అన్వేషించండి

Trad Deal Issue: ట్రేడ్ డీల్ పై కాంగ్రెస్ ట్రంప్-నిర్భరత విమర్శలు - రైతుల ప్రయోజనాలను కాపాడతామని కేంద్రం ప్రకటన

Congress : భారత్, అమెరికా ట్రేడ్ డీల్ పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. మోదీ దేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టారు ఆరోపిస్తోంది. అయితే కేంద్రం మాత్రం రైతుల ప్రయోజనాలను కాపాడతామని ప్రకటించింది.

Congress is heavily criticizing the India US trade deal:  అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఈ ఒప్పందాన్ని ట్రంప్-నిర్భరత  అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అభివర్ణించారు. దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలను భారత ప్రభుత్వం కంటే ముందుగా అమెరికా ప్రతినిధులు, అధ్యక్షుడు ట్రంప్ తన  ట్రూత్ సోష వేదికగా వెల్లడించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టారు, ఇది భారత్‌కు అత్యంత తక్కువ స్థాయి క్షణం  అంటూ కాంగ్రెస్ కేరళ విభాగం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

లోక్‌సభ వెలుపల మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని ఆరోపించారు.  మోదీజీ భయపడుతున్నారు. తన ఇమేజ్ కాపాడుకోవడం కోసం దేశ ప్రయోజనాలను పక్కనపెట్టి రాత్రికి రాత్రే ఈ ఒప్పందంపై సంతకం చేశారు అని విమర్శించారు. ఎప్ స్టీన్ ఫైల్స్ తో పాటు అదానిపై కేసు విషయంలో మోదీ భయపడుతున్నారని రాహుల్ ఆరోపించారు. సభలో చైనా అంశాన్ని లేవనెత్తకుండా అధికార పక్షం తన గొంతు నొక్కుతోందని, దేశాన్ని అమెరికా కాలనీగా మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు.       

విపక్షాల విమర్శలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఇతర నేతలు కొట్టిపారేశారు. ఈ ఒప్పందం  మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్‌ను తెరుస్తుందని, అమెరికా దిగుమతి సుంకాలను 25 నుంచి 18 శాతానికి తగ్గించడం గొప్ప విజయమని పేర్కొన్నారు. దేశ రైతుల ప్రయోజనాలను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించలేదని, వివాదాస్పద దేశాల నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేసి, అమెరికా వంటి మిత్ర దేశాల నుంచి ఇంధనాన్ని సేకరించడం వ్యూహాత్మక నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసింది.  

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్   ఈ ఒప్పందం భారతీయ తయారీదారులకు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ  రంగానికి వరమని పేర్కొన్నారు. బడ్జెట్‌లో ప్రకటించిన కస్టమ్స్ డ్యూటీ తగ్గింపులకు, అమెరికా ఒప్పందానికి సంబంధం లేదని, అవన్నీ స్వదేశీ పరిశ్రమల ప్రయోజనాల కోసమే చేశామని ఆమె స్పష్టం చేశారు. ఒప్పందం పూర్తి వివరాలను త్వరలోనే సభ ముందు ఉంచుతామని ఎన్డీయే నేతలు ప్రకటించారు.  

టాప్ హెడ్ లైన్స్

Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
MP Jhabua Man Builds Underground House: తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget