అన్వేషించండి

Congress: కర్ణాటక కథ ముగిసింది, తరవాతి టార్గెట్ ఫిక్స్ చేసుకున్న కాంగ్రెస్ - ఆ 4 రాష్ట్రాలపైనే ఫోకస్

Congress: రానున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు మొదలు పెట్టింది కాంగ్రెస్.

Congress Eyes on Elections: 

నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు..

ఈ మధ్యే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఒక్క గుజరాత్‌లో తప్ప మిగతా రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు కూడా పూర్తైంది. ఇక ఇప్పుడు అసలు సవాళ్లు ఎదుర్కోనుంది ఆ పార్టీ. అందులోనూ 2024లో లోక్‌సభ ఎన్నికల్లో ఉనికి చాటుకోవడం చాలా ముఖ్యం. ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే...తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్. హిమాచల్, కర్ణాటక ఇచ్చిన జోష్‌తోనే ఈ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంది. మే 24వ తేదీన కాంగ్రెస్ హైకమాండ్‌ కీలక భేటీకి పిలుపునిచ్చింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేయనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. పదవుల కోసం పోరాటాల వల్ల దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ల్ అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయి. కర్ణాటకలోనూ ఇదే తప్పదని బీజేపీ నేతలు గట్టిగానే విమర్శించారు. కానీ...హైకమాండ్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరించింది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా పవర్ షేరింగ్ చేసింది. వాళ్లను బుజ్జగించింది. కర్ణాటకలో యుద్ధం ముగిసినా...రాజస్థాన్‌లో మాత్రం ఇంకా అవే సమస్యలు కొనసాగుతున్నాయి. సచిన్ పైలట్, గహ్లోట్ మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. 

స్ట్రాటెజీ ఏంటి..? 

సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేశారు సచిన్ పైలట్. సీఎం కుర్చీ కోసం చాలా ఆరాట పడుతున్నారు. అటు గహ్లోట్ మాత్రం సీఎం కుర్చీ నుంచి దిగేదే లేదని తేల్చి చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరతకూ కారణమయ్యారు సచిన్ పైలట్. బీజేపీ నేతలతో కుమ్మక్కై కుట్ర చేశారని అశోక్ గహ్లోట్ చాలా సందర్భాల్లో విమర్శించారు. అప్పటి నుంచి పైలట్‌, గహ్లోట్‌కి మధ్య వైరం దూరం పెరుగుతూ వచ్చాయి. పవర్ షేరింగ్ ఫార్ములా కర్ణాటకలో వర్కౌట్ అయినా...రాజస్థాన్‌లో వర్కౌట్ అవుతుందా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే...అక్కడ కాంగ్రెస్‌కి జరిగిన అతి పెద్ద నష్టం..జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడటం. ఆయనతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఫలితంగా..2020లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. రెబల్స్ అంతా బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. అయితే...ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్నే తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టిగా కసరత్తు చేస్తోంది. తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌పై దాడి మొదలు పెట్టింది. తెలంగాణలోనూ కచ్చితంగా అధికారంలోకి వస్తామని కొందరు స్థానిక నేతలు చెబుతున్నా...అంత క్యాడర్ ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే...భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్‌కి బూస్టప్ వచ్చిందని హైకమాండ్  భావిస్తోంది. అందుకే...కర్ణాటక గెలుపుకి క్రెడిట్ అంతా రాహుల్‌కే ఇచ్చేశారు సీనియర్ నేతలు. ఇదో జోష్‌తో బరిలోకి దిగితే రానున్న 4 రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమాగా ఉంది. 

Also Read: Kerala Story Controversy: థియేటర్‌ ఓనర్లను బెదిరిస్తున్నారు, కేరళ స్టోరీ వివాదంపై అమిత్ మాల్వియా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Anti Cancer Drug:జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
India vs Sri Lanka Highlights: మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
Embed widget