By: Ram Manohar | Updated at : 27 Mar 2023 11:33 AM (IST)
విపక్షాల వ్యూహంపై కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది. (Image Credits: ANI)
Congress Protest:
17 పార్టీల నేతలు సమావేశం..
రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేసిన తరవాత విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. కాంగ్రెస్తో సైద్ధాంతిక విభేదాలున్న పార్టీలు కూడా బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఈ నిర్ణయం సరికాదని గట్టిగానే వాదిస్తున్నాయి. ఇప్పుడీ పరిస్థితులనే కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. విపక్షాల మధ్య మైత్రి పెంచాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని పార్టీలు విభేదాలన్నీ పక్కన పెట్టి కాంగ్రెస్తో చేయి కలుపుతున్నాయి. రాహుల్ అనర్హతా వేటుపై పార్లమెంట్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి..? బీజేపీతో ఎలా పోరాడాలి..? అనే అంశాలపై కాంగ్రెస్ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో డీఎమ్కే, ఎస్పీ, జేడీయూ, బీఆర్ఎస్, సీపీఎమ్ సహా మొత్తం 17 పార్టీలు కాంగ్రెస్కు అండగా నిలిచాయి. అన్నింటికన్నా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మీటింగ్కు తృణమూల్ కాంగ్రెస్ నేతలూ హాజరవడం. మొదటి నుంచి బీజేపీ, కాంగ్రెస్కు దూరంగా ఉంటోంది TMC.ప్రతిపక్షాల వ్యూహాలపై జరిగిన కీలక సమావేశంలో తృణమూల్ నేతలు హాజరవడం ఆసక్తికరంగా మారింది. ఎవరి ఐడియాలజీ వారిదే అయినప్పటికీ...ఈ సమయంలో అన్ని పార్టీలు ఏకం అవడం చాలా ముఖ్యం అని, బీజేపీపై పోరాడడానికి ఇదే మంచి తరుణం అని చెబుతోంది కాంగ్రెస్. అంతే కాదు. బీజేపీపై నిరసిస్తూ నల్ల దుస్తులు ధరించి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ ఎంపీలు. పార్లమెంట్ సమావేశాలకూ అవే దుస్తులతో హాజరయ్యారు. అయితే సభలు మొదలైన కాసేపటికే వాయిదా పడ్డాయి. ఆ తరవాత పార్లమెంట్ భవనంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆందోళనలు చేసింది.
#WATCH | Delhi: Opposition MPs protest near Gandhi statue in Parliament, wearing black attire, over Adani Group issue.
Congress president-Rajya Sabha LoP Mallikarjun Kharge and UPA chairperson Sonia Gandhi also join the protest. pic.twitter.com/JSYM8luVQt— ANI (@ANI) March 27, 2023
Delhi | Congress MPs meeting at the CPP office in Parliament. UPA chairperson Sonia Gandhi, party chief and Rajya Sabha LoP Mallikarjun Kharge and others present at the meeting. pic.twitter.com/7BgPtqIUQc
— ANI (@ANI) March 27, 2023
Within minutes of the commencement of proceedings of both Houses, Rajya Sabha adjourned till 2 pm and Lok Sabha till 4 pm today, amid Opposition MPs' protest. They were sloganeering over Adani Group issue and Rahul Gandhi's disqualification. pic.twitter.com/7Jh1QfuHVK
— ANI (@ANI) March 27, 2023
టీఎమ్సీ, కాంగ్రెస్ మైత్రి..?
నిజానికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అందుకే రాహుల్పై అనర్హతా వేటు వేసిన తరవాత వెంటనే స్పందించలేదు ఆ పార్టీ. అప్పటికే విపక్షాలన్నీ ఒక్కటైనప్పటికీ టీఎమ్సీ మాత్రం దూరంగానే ఉంది. గతంలో ఇదే తరహా మీటింగ్ జరిగినప్పుడు తృణమూల్ నేతలు హాజరు కాలేదు. అంతే కాదు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు బీజేపీతో రహస్యంగా కుమ్మక్కయ్యాయనీ గతంలో విమర్శించారు మమతా బెనర్జీ. ఇప్పుడు బీజేపీపై పూర్తి స్థాయి పోరాటం మొదలు పెట్టిన కాంగ్రెస్పై TMCకి కాస్త నమ్మకం ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. దీనిపై మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనుకునే ఏ పార్టీకైనా ఆహ్వానం పలుకుతామని స్పష్టం చేశారు.
Also Read: Rajasthan News: పానీపూరీలు అమ్ముకుంటున్న డాక్టర్, టీకొట్టులో పని చేస్తున్న సిబ్బంది, ఎందుకంటే?
VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్షిప్ వివరాలు ఇలా!
3D Printed Temple: ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ టెంపుల్, ఎక్కడో కాదు మన దగ్గరే
CBSE Exams: సీబీఎస్ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్ షీట్స్ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?
AP SSC Exams: ఏపీలో రేపటి నుంచే పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!
TSPSC Group1: 'గ్రూప్-1' పరీక్షపై మళ్లీ హైకోర్టుకెక్కిన అభ్యర్థులు, దర్యాప్తు పూర్తయ్యేదాకా వద్దంటూ విజ్ఞప్తి!
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !