అన్వేషించండి

Karnataka BJP: కర్ణాటక బీజేపీకి మరో గుజరాత్ అవుతుందా? హిమాచల్‌లా షాక్ ఇస్తుందా?

Karnataka BJP: మరో ఐదు నెలల్లో కర్ణాటకలో జరిగే ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందా లేదా అన్న చర్చ మొదలైంది.

Karnataka BJP: 

ఐదేళ్లకోసారి ప్రభుత్వం మార్పు..

గుజరాత్‌ ఫలితాలు వచ్చేశాయి. బీజేపీ భారీ మెజార్టీతో గెలిచింది. ఇదంతా ముగిసిన కథ. ఇప్పుడు అసలు కథ ఉంది. అదే...కర్ణాటక ఎన్నికలు. 
మరో ఐదు నెలల్లో కర్ణాటకలో ఎన్నికలు రానున్నాయి. ఇదే జోరుతో అక్కడా క్లీన్‌ స్వీప్ చేస్తామని కర్ణాటక బీజేపీ ధీమాగా చెబుతోంది. కానీ... గుజరాత్, కర్ణాటకను పోల్చి చూస్తే...గుజరాత్ ఫలితాలే కర్ణాటకలోనూ రిపీట్ అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. గుజరాత్‌లో బీజేపీకి భారీ మెజార్టీ వచ్చిందంటే అందుకు కారణం..మోడీ చరిష్మా. అందులోనూ అది ఆయన సొంత రాష్ట్రం కాబట్టి కొంత వరకూ సెంటిమెంట్‌ కూడా వర్కౌట్ అయి ఉండొచ్చు. కారణాలేవైనా..బీజేపీకి అయితే భారీ మెజార్టీ వచ్చింది. కానీ...కర్ణాటక పరిస్థితి వేరు. ఆ రాష్ట్రంలో క్యాడర్‌ బలంగా ఏం లేదు. పైగా...అంతకు ముందు కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉంది. ఇప్పుడూ ఆ పార్టీ ఉనికి అక్కడ బాగానే కనిపిస్తోంది. కాస్త అటు ఇటు అయితే...తప్పకుండా కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే...ఇక్కడే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ఓ సారి గుర్తు చేసుకోవాలి. సాధారణంగా...కొన్ని రాష్ట్రాల్లో ఓటర్లు ప్రతి ఐదేళ్లకోసారి కొత్త ప్రభుత్వానికి అవకాశం
ఇస్తుంటారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ...హిమాచల్ ఓటర్లు అధికారంలో ఉన్న బీజేపీని కాదని...కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఇది కచ్చితంగా బీజేపీని వేవ్‌ను అడ్డుకున్న విజయమే. గుజరాత్‌ గెలుపుతో క్యాడర్ హ్యాపీగానే ఉన్నా...హిమాచల్‌ను చేజార్చుకోవడం వల్ల ఆత్మ పరిశీలనలో పడింది బీజేపీ. ఇదే ట్రెండ్‌ కర్ణాటకలోనూ కొనసాగితే...అధికారం కోల్పోక తప్పదన్న కలవరం మొదలైంది. 

ఆపరేషన్ లోటస్‌ అస్త్రం..

కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కర్ణాటకలోనూ గుజరాత్ ఫలితాలు రిపీట్ అవుతాయని చాలా ధీమాగా చెబుతున్నారు. కానీ...హిమాచల్‌లో జైరామ్ ఠాకూర్‌ను ప్రజలు ఎలాగైతే పక్కన పెట్టారో..అలాగే బొమ్మై సర్కార్‌ను కూడా పక్కన పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఓ సారి కర్ణాటక ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ని గమనిస్తే...2004 నుంచి అక్కడి ఓటర్లు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. 2008లో బీఎస్ యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ 110 స్థానాలు గెలుచుకుంది. ఆ తరవాత..."ఆపరేషన్ లోటస్" మొదలు పెట్టి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తనవైపు లాక్కుంది. మ్యాజిక్ ఫిగర్‌ సాధించుకుంది. ఆ తరవాత 2013లో మాత్రం బీజేపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ ఎన్నికల్లో 40 సీట్లకే పరిమితమైంది కాషాయ పార్టీ. ఓటు షేర్ కూడా దారుణంగా పడిపోయింది. కాంగ్రెస్ 122స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018లో మళ్లీ సీన్ మారింది. కాంగ్రెస్‌ను కాదనుకుని ఓటర్లు బీజేపీకి ఓటు వేశారు. కాంగ్రెస్ 80 స్థానాలకు
పరిమితం కాగా...బీజేపీ 104 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్ జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిప్పటికీ...ఆపరేషన్ లోటస్ ధాటికి ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. కాంగ్రెస్, జేడీఎస్‌ కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి బీజేపీలో చేరారు. ఫలితంగా...బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ ట్రెండ్‌ కొనసాగితే...ఈ సారి ఓటర్లు కాంగ్రెస్‌కు అవకాశమిస్తారేమో అన్న అంచనాలున్నాయి. సీనియర్ నేత అయిన యడియూరప్పను పక్కన పెట్టేసింది బీజేపీ. కర్ణాటకలో కీలకమైన లింగాయత్‌ వర్గానికి చెందిన యడ్డీని పక్కకు తప్పించడం వల్ల ఆ మేరకు బీజేపీ నష్టపోవాల్సి వచ్చింది. లింగాయత్ ఓటు బ్యాంకుని దూరం చేసుకున్నట్టైంది. పైగా...బొమ్మై సర్కార్‌ "పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది" అన్న విమర్శలూ ఉన్నాయి. అవినీతి ఆరోపణలు రావడం, పరిపాలన సజావుగా సాగకపోవడం లాంటి కారణాలూ బొమ్మై ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడేసే అవకాశముంది. సో...బీజేపీ కర్ణాటకలో ఆపరేషన్ లోటస్‌ను అమలు చేస్తే తప్ప భారీ మెజార్టీతో గెలవకపోవచ్చు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Also Read: Shraddha Murder Case: పోలీసులు సహకరించి ఉంటే నా కూతురు ప్రాణాలతో ఉండేది - శ్రద్ధ తండ్రి వికాస్ వ్యాఖ్యలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Board Exams Cancel: వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు
వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget