News
News
X

బెంగళూరు మైసూరు ఎక్స్‌ప్రెస్‌ వే జలమయం, గత వారమే ప్రారంభించిన ప్రధాని - వాహనదారుల అసహనం

Bengaluru-Mysuru Expressway: కర్ణాటకలో కురిసిన వర్షాలకు బెంగళూరు మైసూరు ఎక్స్‌ప్రెస్ వేలో నీళ్లు నిలిచిపోయాయి.

FOLLOW US: 
Share:

Bengaluru-Mysuru Expressway:

వారం క్రితమే ప్రారంభించిన ప్రధాని 

వారం రోజుల కింద ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించారు. అయితే...కర్ణాటకలో కురిసిన వర్షాలకు ఈ రోడ్‌లో నీళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చాలా వెహికిల్స్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. అసహనం వ్యక్తం చేసిన వాహనదారులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి కాస్తా వైరల్ అయ్యాయి. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలూ మొదలయ్యాయి. దీనిపై స్పందించిన NHAI వీలైనంత త్వరగా ఈ నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. సోషల్ మీడియాలో మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

"వాన నీళ్లు వెళ్లిపోవడానికి మేం ప్రత్యేకంగా కొంత స్పేస్‌ అలాగే ఉంచాం. కానీ కొంత మంది గ్రామస్థులు వాటిని మట్టితో నింపేశారు. అందుకే ఇలా వరద వచ్చింది. నీళ్లు నిలిచిపోయాయి. వీటిని తొలగిస్తున్నాం. త్వరలోనే రూట్ క్లియర్ చేస్తాం"

- NHAI

గతేడాది ఆగస్టులోనూ వర్షాలు పడినప్పుడు ఇదే దారిలో భారీగా నీళ్లు నిలిచిపోయాయి. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. టెక్నికల్ టీమ్‌ ఈ సమస్యను పరిష్కరిస్తుందని  ఈ ఏడాది జనవరిలో పర్యటించిన సమయంలో హామీ ఇచ్చారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకే కట్టుబడి ఉన్నామని వివరించారు. కానీ ఇప్పుడు మళ్లీ ఇదే హైవేలో నీళ్లు నిలిచిపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Published at : 18 Mar 2023 05:16 PM (IST) Tags: NHAI Karnataka rains Bengaluru-Mysuru Bengaluru-Mysuru Expressway

సంబంధిత కథనాలు

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్

సీఈవోకి షాక్ ఇచ్చిన ఉద్యోగులు, ఆ డిమాండ్‌లు తీర్చాల్సిందేనంటూ ఓపెన్ లెటర్

సీఈవోకి షాక్ ఇచ్చిన ఉద్యోగులు, ఆ డిమాండ్‌లు తీర్చాల్సిందేనంటూ ఓపెన్ లెటర్

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్-ఆర్జిత సేవా, అంగప్రదక్షిణం టికెట్లు విడుదల

Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్-ఆర్జిత సేవా, అంగప్రదక్షిణం టికెట్లు విడుదల

Bank Holidays list in April: ఏప్రిల్‌లో 15 రోజులు బ్యాంక్‌లకు సెలవులు - లిస్ట్‌ ఇదిగో

Bank Holidays list in April: ఏప్రిల్‌లో 15 రోజులు బ్యాంక్‌లకు సెలవులు - లిస్ట్‌ ఇదిగో

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

Kushi Release Date : సెప్టెంబర్‌లో 'ఖుషి' ఖుషీగా - విజయ్ దేవరకొండ, సమంత సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

Kushi Release Date : సెప్టెంబర్‌లో 'ఖుషి' ఖుషీగా - విజయ్ దేవరకొండ, సమంత సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

Best Mileage Cars: రూ. 10 లక్షల లోపు బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే - ఏకంగా 34 కిలోమీటర్ల వరకు!

Best Mileage Cars: రూ. 10 లక్షల లోపు బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే - ఏకంగా 34 కిలోమీటర్ల వరకు!