అన్వేషించండి

AP 10th Class Results 2024: ఏప్రిల్‌ చివరి వారంలో ఏపీ పదో తరగతి ఫలితాలు

ఏపీలో టెన్త్ విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఏపీ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ టెన్త్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్‌ చివరి వారంలో విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తోంది.

ఏపీలో టెన్త్ విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఏపీ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్  టెన్త్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్‌ చివరి వారంలో విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తోంది. అంటే ఏప్రిల్‌ 25 నుంచి 30వ తేదీలోపు టెన్త్‌ ఫలితాలు ప్రకటించనుంది. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నెంబర్‌ను నమోదు చేసి ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల అధికారిక విభాగాలు వెల్లడించాయి. కాగా గతేడాది మే 6వ తేదీన పదో తరగతి ఫలితాలు వెల్లడించామని, ఈ ఏడాది అంతకంటే ముందే ఫలితాలు వెల్లడిస్తామని డైరెక్టర్‌ దేవానంద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పబ్లిక్‌ పరీక్షలు మార్చి18 నుంచి మార్చి 30 వరకు పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వార్షిక పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,30,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక రాష్ట్రంలో దాదాపు 3473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల ప్రక్రియ అనంతరం వెనువెంటనే సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభించి ఏప్రిల్‌ 8 నాటికి ముగించారు. మూల్యాంకనం చేసిన జవాబుపత్రాలను మరోసారి పరిశీలించి ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు, కంప్యూటరీకరణ ప్రక్రియను చేపట్టారు. ఈ విధానం పూర్తి చేసేందుకు మరో వారం సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో టెన్త్ పరీక్ష ఫలితాల విడుదలకు కూడా ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరైంది. ఇప్పటికే ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు ఏప్రిల్‌ చివరి వారంలో ఫలితాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రావడం ఆలస్యమైతే మే మొదటి వారంలో ఫలితాల విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఫలితాల విడుదల వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకునేందుకు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితాలతోపాటు మార్కుల మెమోను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఫలితాల ప్రకటన తర్వాత కొన్ని రోజులకు తాము చదువుకున్న పాఠశాలల నుంచి విద్యార్ధులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు పొందవచ్చు. అయితే మార్క్‌ షీట్‌లో గ్రేడ్స్‌ మాత్రమే ఉంటాయి. ఏ సబ్జెట్‌లో ఎన్ని మార్కులు వచ్చాయన్న వివరాలు అందులో ఉండవని బోర్డు పేర్కొంది.

ALSO READ:

AP Inter Memos: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన మార్కుల మెమోలు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థుల షార్ట్‌ మెమోలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. విద్యార్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి షార్ట్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 12న ఇంటర్ పరీక్షల ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 8,55,030మంది పరీక్షలు రాయగా.. ప్రథమ సంవత్సరంలో 67%, ద్వితీయ సంవత్సరంలో 78% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం మార్కుల మెమో కోస్ం క్లిక్‌ చేయండి..

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం మార్కుల మెమో కోస్ం క్లిక్‌ చేయండి..

ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

మే 15 నుంచి ఇంటర్మీడియట్‌ ప్రవేశాలు..
ఇంటర్‌లో ప్రవేశాల ప్రక్రియను మే 15 నుంచి ప్రారంభించనున్నారు. రెండు విడతలుగా ప్రవేశాలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో మే 15 నుంచి దరఖాస్తులు విక్రయించి, జూన్‌ 1 లోపు వాటిని స్వీకరిస్తారు. ఇక మే 22 నుంచి మొదటి విడత ప్రవేశాలు చేపట్టాలని, జూన్‌ 1 లోపు పూర్తి చేయనున్నారు. రెండో విడత ప్రవేశాలను జూన్‌ 10 నుంచి జులై 1 లోపు పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chicken festival: ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
Nizamabad: రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
Kakinada Crime News: కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
Discounts On Tata Cars: హ్యారియర్‌, సఫారి సహా టాటా కార్లపై భారీ ఆఫర్లు - నవంబర్‌లో రూ.1.75 లక్షల వరకు తగ్గింపు
నవంబర్‌లోనూ బంపర్‌ ఆఫర్లు - Tata కార్ల మీద రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్‌
Advertisement

వీడియోలు

Sanju Samson in IPL 2026 | క్లాసెన్‌ ను విడుదుల చేయనున్న SRH ?
Sachin Advt in Sujeeth Direction | యాడ్స్‌కి దర్శకత్వం వహించిన సుజిత్
India vs Australia T20 Match | నేడు ఆస్ట్రేలియాతో భారత్‌ ఐదవ టీ20
Harman Preet Kaur Smriti Mandhana | చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి | ABP Desam
గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chicken festival: ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
Nizamabad: రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
Kakinada Crime News: కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
Discounts On Tata Cars: హ్యారియర్‌, సఫారి సహా టాటా కార్లపై భారీ ఆఫర్లు - నవంబర్‌లో రూ.1.75 లక్షల వరకు తగ్గింపు
నవంబర్‌లోనూ బంపర్‌ ఆఫర్లు - Tata కార్ల మీద రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్‌
Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
Psych Siddhartha Teaser : డిఫరెంట్‌గా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'సైక్ సిద్దార్థ' టీజర్ - లోకల్ లాంగ్వేజ్, బూతులు బాగా వాడేశారు
డిఫరెంట్‌గా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'సైక్ సిద్దార్థ' టీజర్ - లోకల్ లాంగ్వేజ్, బూతులు బాగా వాడేశారు
Vijay Deverakonda Rashmika : విజయ్ రష్మికల పెళ్లి డేట్ ఫిక్స్! - కన్ఫర్మ్ చేసిన నేషనల్ క్రష్... వెన్యూ సెర్చింగ్ మొదలు పెట్టేశారా?
విజయ్ రష్మికల పెళ్లి డేట్ ఫిక్స్! - కన్ఫర్మ్ చేసిన నేషనల్ క్రష్... వెన్యూ సెర్చింగ్ మొదలు పెట్టేశారా?
Vande Bharat Trains:నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
Embed widget