అన్వేషించండి

Breaking News Live: ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూత 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Key Events
AP Telangana Breaking News Live Updates on 8th January 2022 Breaking News Live: ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూత 
Today-News-Updates

Background

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న వనమా రాఘవను తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి దమ్మపేట, చింతలపూడి మధ్య పోలీసులు వనమా రాఘవేంద్రరావు(59)ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు గిరీష్, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. విపక్షాల నుంచి విమర్శలు రావడంతో టీఆర్ఎస్ పార్టీ శుక్రవారమే రాఘవను సస్పెండ్ చేసింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే (కొత్తగూడెం) వనమా వెంకటేశ్వరరావు కుమారుడైన వనమా రాఘవ బెదిరింపుల కారణంగా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం జనవరి 3న ఆత్మహత్యకు పాల్పడింది. రామకృష్ణ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ఆస్తి పంపకాల విషయంలో కుటుంబంలో విభేదాలు తలెత్తగా ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ తలదూర్చాడు. హైదరాబాద్‌కు భార్యను తీసుకొచ్చి అప్పగిస్తే ఆస్తి నీకు దక్కేలా చేస్తానని వనమా రాఘవ తనను బెదిరించాడని.. ఈ అవమానాలు తట్టుకోలేక కుటుంబంతో పాటు చనిపోయాతున్నానని రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన భార్య, ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు, ఆపై తాను కూడా కాల్చుకుని బలవన్మరణం చెందాడు. రామకృష్ణ సూసైడ్ సెల్ఫీ వీడియో బయటకు రావడంతో దుమారం రేపుతోంది.

హైదరాబాద్‌లో గత ఏడాది డిసెంబర్ నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. డిసెంబర్ నెల మొదట్నుంచీ నేడు సైతం పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్, డీజిల్ ధర స్థిరంగా ఉండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.107.69 కాగా.. డీజిల్ ధర రూ.94.14 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.107.92 కాగా, డీజిల్‌ లీటర్ ధర రూ.94.35గా ఉంది. కరీంనగర్ లో పెట్రోల్ ధర 46 పైసలు పెరిగింది.  నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.108.57 కాగా, 43 పైసలు పెరగడంతోడీజిల్ ధర రూ.94.78 గా ఉంది. నిజామాబాద్‌లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడలో పెట్రోల్ ధర 21 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.29 అయింది. 17 పైసల చొప్పున పెరగడంతో ఇక్కడ డీజిల్ ధర రూ.96.36కు చేరుకుంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 0.21 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.109.30 అయింది. డీజిల్ ధర 0.19 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.41 అయింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. వరుసగా రెండో రోజు బులియన్ మార్కెట్లో పసిడి ధరలు పతనమయ్యాయి. మరోవైపు వెండి ధర పడిపోయింది.  తాజాగా హైదరాబాద్‌‌లో 22 క్యారెట్లపై రూ.350 మేర తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.48,650 కి క్షీణించింది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.900 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.64,500కి పడిపోయింది.

ఏపీ మార్కెట్లో బంగారం ధర రూ.350 మేర పతనమైంది. ఇక్కడ సైతం వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,650 అయింది.. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.44,600కు పడిపోయింది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం ధర తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,650 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 కు క్షీణించింది. ఏపీ, తెలంగాణలో వెండి ధరలు ఒకే రేట్లలో విక్రయాలు జరుగుతున్నాయి. 

Also Read: SBI Alert: బీ కేర్‌ఫుల్.. డాక్యుమెంట్స్ అప్‌డేట్ చేయలేదని ఎస్‌బీఐ అకౌంట్స్ బ్లాక్ చేస్తుందా.. ఈ విషయాలు తెలుసుకోండి

Also Read: Gold Silver Price Today: గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. రూ.900 మేర దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ..

Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

22:08 PM (IST)  •  08 Jan 2022

మహేష్ బాబు ఇంట్లో విషాదం... ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూత 

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్న ఘట్టమనేని రమేష్ బాబు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్  కన్నుమూశారు. గత కొద్దికాలంగా రమేష్ బాబు లివర్ ప్రాబ్లం తో బాధపడుతున్నారు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ కి తరలిస్తుండగా ఆయన కన్నుమూశారు. 

21:00 PM (IST)  •  08 Jan 2022

రణస్థలం సరాక ఫార్మా కంపెనీ కెమికల్స్ లీక్.. ఒకరి మృతి, ఐదుగురి పరిస్థితి విషమం

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం పరిధిలోని సరాక ఫార్మా కంపెనీలో  పెను ప్రమాదం జరిగింది. కంపెనీలో బ్లాక్ బి లో రేడియేటర్ లీక్ అవ్వడంతో, కెమికల్స్ లీక్ అయ్యి బ్లాక్ ఇంచార్జ్ బోగీ ప్రసాద్ రావు (45) అక్కడకక్కడే మృతి చెందారు. బ్లాక్ లో ఉన్న మిగతా ఐదుగురు పరిస్థితి విషమించడంతో, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం  విజయనగరం తిరుమల హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలుసుకున్న జె. ఆర్. పురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు

 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS vs Congress: రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్
రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Embed widget