అన్వేషించండి

AP PCC Gidugu Rudraraju: వైసీపీ నేతలు మాతో టచ్ లో ఉన్నారు, త్వరలోనే కాంగ్రెస్ లోకి జంప్ ! గిడుగు రుద్రరాజు సంచలనం

AP PCC Chief Gidugu Rudraraju: అధికార పార్టీ వైసీపీ నేతలు చాలా మంది తమతో టచ్ లో ఉన్నారని, తిరిగి కాంగ్రెస్ కి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP PCC Chief Gidugu Rudraraju: తిరుపతి: ఓవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని స్థానాల్లో విజయం సాదిద్దాం, వై నాట్ 175 సీట్స్ అని గట్టిగానే చెబుతున్నారు. అయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పిడుగు లాంటి వార్త చెప్పారు. అధికార పార్టీ వైసీపీ నేతలు చాలా మంది తమతో టచ్ లో ఉన్నారని, తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జగన్, కేంద్రంలో బీజేపీలే మాకు రాజకీయ ప్రత్యర్థులు అని స్పష్టం చేశారు. 

జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ 
దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు అన్నారు కుబేరుడు అదాని కార్పొరేట్ మాఫియాతో, ఆర్థిక అక్రమాలపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలో రాష్ట్ర  పిసిసి అధ్యక్షుడు గిడిగి రుద్రరాజు పాదయాత్ర నిర్వహించారు. స్థానిక మహతి కళాక్షేత్రం వద్ద నుంచి అంబేద్కర్ భవన్ వద్ద వరకు ఈ పాదయత్ర సాగింది. 

అనంతరం అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జగన్, వైసీపీలే మాకు రాజకీయ ప్రత్యర్థులు అన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు అన్ని దోచుకుంటున్నారని సచివాలయం పేరుతో స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారంటూ ధ్వజమెత్తారు. దేశంలో అదాని కార్పొరేట్ మాఫియాతో, ఆర్థిక అక్రమాలపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలిని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందన్నారు. అధికార పార్టీ వైసీపీ నేతలు చాలా మంది మాతో టచ్ లో ఉన్నారని, తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావాటానికి సిద్ధంగా ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. వైసీపీ పాలన చూసిన రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయం అని గిడుగు రుద్రరాజు ధీమా వ్యక్తం చేశారు.

ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చెయ్యడమే తన లక్ష్యం అంటున్నారు గిడుగు రుద్రరాజు. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ పదవి రావడానికి తన విధేయతే కారణం అంటున్నారు.  కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న సీనియర్ నేతలను కలుపుకుని ముందుకు వెళతానంటున్న పార్టీ నూతన అధ్యక్షుడు పార్టీయే తన కులం, గోత్రం అంటున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళతానన్నారు. ప్రజా సమస్యలు, విభజన హామీలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ గుర్తింపు ఉంటుందని, ముఖ్యంగా కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు ఉంటుందన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pipeline Gas: గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
Bhogi 2025 : భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
Ys Jagan: 'శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా?' - క్షమాపణ అంటూ రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
'శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా?' - క్షమాపణ అంటూ రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP DesamAjith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pipeline Gas: గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
Bhogi 2025 : భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
Ys Jagan: 'శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా?' - క్షమాపణ అంటూ రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
'శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా?' - క్షమాపణ అంటూ రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
Daaku Mahaaraj Review - డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
Karimnagar News: మంత్రుల సమక్షంలోనే వివాదం - కరీంనగర్ కలెక్టరేట్ సమావేశం రసాభాస, పాడి కౌశిక్ రెడ్డిని బయటకు లాక్కెళ్లిన పోలీసులు
మంత్రుల సమక్షంలోనే వివాదం - కరీంనగర్ కలెక్టరేట్ సమావేశం రసాభాస, పాడి కౌశిక్ రెడ్డిని బయటకు లాక్కెళ్లిన పోలీసులు
IPL-2025 UPdate: ఐపీఎల్ డేట్ వచ్చేసిందోచ్ - 2 నెలల పాటు ధనాధన్ ఆట, నిర్వహణ తేదీలు ప్రకటించిన బీసీసీఐ
ఐపీఎల్ డేట్ వచ్చేసిందోచ్ - 2 నెలల పాటు ధనాధన్ ఆట, నిర్వహణ తేదీలు ప్రకటించిన బీసీసీఐ
Atreyapuram Boat Racing: సంక్రాంతికి ఫుల్ జోష్ - కోనసీమలో కేరళ తరహా పడవ పోటీలు, ఆత్రేయపురానికి బోట్ రేసింగ్ శోభ
సంక్రాంతికి ఫుల్ జోష్ - కోనసీమలో కేరళ తరహా పడవ పోటీలు, ఆత్రేయపురానికి బోట్ రేసింగ్ శోభ
Embed widget