అన్వేషించండి

IPL-2025 UPdate: ఐపీఎల్ డేట్ వచ్చేసిందోచ్ - 2 నెలల పాటు ధనాధన్ ఆట, నిర్వహణ తేదీలు ప్రకటించిన బీసీసీఐ

IPL 2025: ఐపీఎల్ 18వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. మార్చి 23 నుంచి ఈ మెగాటోర్నీని నిర్వహించనున్నారు. వచ్చే నెలలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత ఆటగాళ్లు మళ్లీ ఈ టోర్నీలోనే బరిలోకి దిగుతారు. 

IPL 2025 News: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐపీఎల్ 2025 నిర్వహణకు ముహుర్తం ఖరారైంది. మార్చి 23 నుంచి ఈ మెగా టోర్నీ జరుగుతంది. రెండు నెలలకు పైగా సాగే ఈ టోర్నీ మే 25న ముగుస్తుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఆదివారం నిర్వహించిన బీసీసీఐ ప్రత్యేక వార్షిక సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. బీసీసీఐ కార్యదర్శిగా దేవజిత్ సైకియా, కోశాధికారి ప్రభ్ తేజ్ సింగ్ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐపీఎల్ నిర్వహణ తేదిల గురించి తెలియజేశారు. అలాగే పాకిస్థాన్ నిర్వహించబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంపిక చేసే జట్టును ఈ నెల 18న లేదా 19న వెల్లడిస్తామని పేర్కొన్నారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయంపై అవగాహన రాకపోవడంతోనే జట్టు ప్రకటనలో ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. 

కొత్త కూర్పుతో జట్లు..
గతేడాది రెండు రోజులపాటు ఐపీఎల్ మెగా వేలం నిర్వహించడంతో ఈసారి జట్లు వివిధ ఆటగాళ్లతో కళకళలాడనున్నాయి. అలాగే ఆటగాళ్లకు కేటాయించే బడ్జెట్ కూడా ఈసారి పెరిగింది. 2008లో టోర్నీ మొదలైన ఇన్నేళ్లలో రిషభ్ పంత్ అత్యంత ఖరీదైన ప్లేయర్‌‍గా నిలిచాడు. వేలం మొదలైన రోజునే రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ తనను సొంతం చేసుకుంది. వేలంతో తొలుత ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్‌లతో పోటీపడినా లక్నో.. చివరికి 20.75 కోట్ల వద్ద పైచేయి సాధించిది. ఈ దశలో రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ద్వారా ఢిల్లీ రంగంలోకి దిగగా, రూ.27 కోట్ల కళ్లు చెదిరే మొత్తాన్ని ఆఫర్ చేసి లక్నో పంత్‍‌ను కైవసం చేసుకుంది. అలాగే గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును విజేతగా నిలిపిన ఆ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అనూహ్యంగా వేలంలోకి వచ్చి, భారీ ధరను దక్కించుకున్నాడు. రూ.26.75 కోట్లతో తనను పంజాబ్ కింగ్స్ దక్కించుకోగా, టోర్నీలోనే రెండో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచాడు. ఇక హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి కప్పు కొరతను పంజాబ్‌కు తీర్చాలని భావిస్తున్నాడు. 

ఇక ఆర్సీబీ ప్లేయర్ విల్ జాక్స్ వేలంలోకి రాగా కాస్త వివాదాస్పద పద్ధతిలో అతడిని ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. వేలంలో రూ.5.25 కోట్లకు ముంబై జాక్స్‌ను దక్కించుకోగా, తన రైట్ టూ మ్యాచ్ ఆప్షన్‌ను ఆర్సీబీ వినియోగించుకోలేదు. దీంతో వేలం అనంతరం ముంబై యాజమాని ఆకాశ్ అంబానీ.. ఆర్సీబీ యాజమాన్యం దగ్గరికి వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడం వివాదాస్పదమైంది. ముందే సంప్రదింపులు చేసుకుని జాక్స్‌ను ముంబై దక్కించుకుందని ఆరోపణలు రాగా, కేవలం ఆర్సీబీకి థ్యాంక్స్ చెప్పడం కోసమే అనంత్ అక్కడికి వెళ్లాడనే సమర్థింపులు కూడా వచ్చాయి. మొత్తానికి ఇదో టాక్ ఆఫ్ ది టౌన్‌లా మారింది. 

యంగెస్ట్ ప్లేయర్‌గా సూర్యవంశీ..
ఇక బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో ఆడబోతున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. రూ.1.10 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ జట్టు అతడిని కొనుగోలు చేసింది. దీంతో టీనేజీలోనే కోటీశ్వరుడిగా సూర్యవంశీ నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్ మెగావేలం కొంతమందికి చేదు అనుభవం మిగిల్చింది. హుషారుగా తమ పేరును వేలంలో నమోదు చేసుకున్న వివిధ దేశాలకు చెందిన ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలి షాకిచ్చారు. ముఖ్యంగా పీయూష్ చావ్లా, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, ఉమేశ్ యాదవ్, స్టీవ్ స్మిత్ తదితరులు అమ్ముడుపోలేదు. అలాగే ఫేమస్ క్రికెటర్లయిన ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్, పృథ్వీషా, సర్ఫరాజ్ ఖాన్, జేమ్స్ అండర్సన్ లాంటి వాళ్లను కొనుగోలు చేయడానికి ఏ టీమ్ ఉత్సాహం చూపించలేదు. ఏదేమైనా ఐపీఎల్ మొదలై 17 ఏళ్లు గడిచిన ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు కొత్త జట్టు లక్నోలు కప్పు కొట్టలేదు. ఈసారి ఎలాగైనా ఆ లోటు తీర్చుకోవాలని గట్టి పట్టుదలగా ఉన్నాయి. 

Read Also: BCCI New Secretary: బీసీసీఐలో నూతన శకం - ఊహించినట్లుగానే కార్యదర్శిగా సైకియా, తను ముందుర సవాళ్లెన్నో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Polavaram Banakacherla Interlinking Project : 81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
IPL 2025 LSG Vs DC Result Update: ఢిల్లీని గెలిపించిన అశుతోష్.. క్యాపిటల్స్ అద్భుత విజ‌యం.. పూర‌న్, మార్ష్ విధ్వంస‌క ఫిఫ్టీలు
ఢిల్లీని గెలిపించిన అశుతోష్.. క్యాపిటల్స్ అద్భుత విజ‌యం.. పూర‌న్, మార్ష్ విధ్వంస‌క ఫిఫ్టీలు
Sunny Deol: 'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DC vs LSG Match Highlights IPL 2025 | సంచలన రీతిలో లక్నోపై గెలిచేసిన ఢిల్లీ | ABP DesamSunita Williams Return to Earth | నాసాకు కూడా అంతు చిక్కని Communication Blackout  | ABP DesamMS Dhoni Fun Moments with Deepak Chahar | CSK vs MI మ్యాచ్ లో ధోని క్యూట్ మూమెంట్స్ | ABP DesamMS Dhoni Lightning Stumping | కనురెప్ప మూసి తెరిచే లోపు సూర్య వికెట్ తీసేసిన ధోనీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram Banakacherla Interlinking Project : 81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
IPL 2025 LSG Vs DC Result Update: ఢిల్లీని గెలిపించిన అశుతోష్.. క్యాపిటల్స్ అద్భుత విజ‌యం.. పూర‌న్, మార్ష్ విధ్వంస‌క ఫిఫ్టీలు
ఢిల్లీని గెలిపించిన అశుతోష్.. క్యాపిటల్స్ అద్భుత విజ‌యం.. పూర‌న్, మార్ష్ విధ్వంస‌క ఫిఫ్టీలు
Sunny Deol: 'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
AP Liquor Scam: దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
Revanth in delhi: ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
Nara Lokesh: ఉత్తరాంధ్రలో జార్జియా నేషనల్ యూనివర్సిటీ - నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలు
ఉత్తరాంధ్రలో జార్జియా నేషనల్ యూనివర్సిటీ - నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలు
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రిటీలు ఇక సేఫ్..!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రిటీలు ఇక సేఫ్..!
Embed widget