అన్వేషించండి

AP CM Jagan: స్కూల్‌ స్టార్ట్ అయిన రోజే విద్యా కానుక- అధికారులకు సీఎం ఆదేశాలు

AP CM Jagan: ప్రభుత్వ బడుల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలని ఏపీ సీఎం జగన్ తెలిపారు. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండాలని సూచించారు. 

AP CM Jagan: పేద, మధ్య తరగతి విద్యార్థులకు అత్యుత్తమైమన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సీఎం జగన్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. విద్యా బోధనలో ఎక్కడ నాణ్యత లోపించినా సహించేది లేదని జగనన్న విద్యా కానుక సమీక్షా సమావేశంలో తెలిపారు. అలాగే ప్రతీ సర్కారు బడిలో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉంటేనే బోధనలో నాణ్యత పెరుగుతుందని, విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగవుతుందన్నారు. నాడు - నేడు కింద జరుగుతున్న రెండో దళ పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 22 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 15 వందల కోట్ల రూపాయల పనులు నడుస్తున్నాయని స్పష్టం చేశారు.

ఇటీవలే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వాటి వాడకం, టీచింగ్ పై నిరంతర పరిశీలన ఉండాలని ఏపీ సీఎం జగన్ అధికారులకు తెలిపారు. విద్యార్థులు పాఠఆలు నేర్చుకుంటున్న తీరు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా చెక్ చేయాలని అన్నారు. ట్యాబ్ ల మెయింటనెన్స్ కోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్ సెంటర్ ఏర్పాటు అవుతుందన్నారు. ట్యాబ్ లో సమస్య ఉంటే వారం రోజుల్లో రిపేర్ చేసి ఇవ్వాలని.. అలా కుదరని పక్షంలో కొత్త ట్యాబ్ ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా ప్రతీ ఒక్క విద్యార్థి దగ్గర డిక్షనరీ ఉందో లేదో మరోసారి చెక్ చేయాలని అన్నారు. లేని వాల్లకు కొత్త డిక్షనరీని వెంటనే అందించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా కానుక కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజు నుంచి వాటిని అందించి తీరాలని స్పష్టం చేశారు. తరగతి గదులు, క్లాస్ రూమ్స్ డిజిటలైజేషన్ వేగంగా పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. డిజిటల్ స్క్రీన్స్ కోసం ఐఎఫ్సీ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. డిజిటల్ స్క్రీన్స్ తో విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధన అందుతుందన్నారు.  

ఇటీవలే ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇచ్చిన ప్రభుత్వం

ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామని గతంలోనే ప్రకటించిన ప్రభుత్వం... వారితోపాటుగా ఉపాధ్యాయులకూ ట్యాబ్‌లు అందించింది. పాఠాలు చెప్పేందుకు వీలుగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ట్యాబ్‌లు అందించారు. ప్రభుత్వం రూ.686 కోట్లతో ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు ఇచ్చారు. రాష్ట్రంలోని 9,703  పాఠశాలల్లోని 4.50 లక్షల మంది విద్యార్థులు, 50,194 మంది ఉపాధ్యాయులు బైజూస్ నుండి కంటెంట్‌తో లోడ్ చేసిన Samsung T220 Lite Tablet PCని పొందారు.  ఈ ట్యాబ్‌ల వల్ల విద్యార్థులు నిరంతరం తమ సందేహాలను తీర్చుకునే అవకాశం ఉంటుంది. క్లాస్ రూమ్‌లలోనే కాకుండా ఇంటి దగ్గర కూడా బైజూస్ కంటెంట్ ద్వారా చదువుకునే వెసులు బాటు ఉంటుంది. ముఖ్యంగా పేద విద్యార్థులు ఇతరులతో పోటీ పడేందుకు ఈ ట్యాబ్‌లు ఎంతగానే ఉపయోగపడనున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Reaction: కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?

వీడియోలు

Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం
Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Reaction: కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
Chandrababu in Tamilnadu: చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
Pawan Kalyan Kotappakonda Visit: కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
Embed widget