అన్వేషించండి

AP CM Jagan: స్కూల్‌ స్టార్ట్ అయిన రోజే విద్యా కానుక- అధికారులకు సీఎం ఆదేశాలు

AP CM Jagan: ప్రభుత్వ బడుల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలని ఏపీ సీఎం జగన్ తెలిపారు. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండాలని సూచించారు. 

AP CM Jagan: పేద, మధ్య తరగతి విద్యార్థులకు అత్యుత్తమైమన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సీఎం జగన్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. విద్యా బోధనలో ఎక్కడ నాణ్యత లోపించినా సహించేది లేదని జగనన్న విద్యా కానుక సమీక్షా సమావేశంలో తెలిపారు. అలాగే ప్రతీ సర్కారు బడిలో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉంటేనే బోధనలో నాణ్యత పెరుగుతుందని, విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగవుతుందన్నారు. నాడు - నేడు కింద జరుగుతున్న రెండో దళ పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 22 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 15 వందల కోట్ల రూపాయల పనులు నడుస్తున్నాయని స్పష్టం చేశారు.

ఇటీవలే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వాటి వాడకం, టీచింగ్ పై నిరంతర పరిశీలన ఉండాలని ఏపీ సీఎం జగన్ అధికారులకు తెలిపారు. విద్యార్థులు పాఠఆలు నేర్చుకుంటున్న తీరు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా చెక్ చేయాలని అన్నారు. ట్యాబ్ ల మెయింటనెన్స్ కోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్ సెంటర్ ఏర్పాటు అవుతుందన్నారు. ట్యాబ్ లో సమస్య ఉంటే వారం రోజుల్లో రిపేర్ చేసి ఇవ్వాలని.. అలా కుదరని పక్షంలో కొత్త ట్యాబ్ ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా ప్రతీ ఒక్క విద్యార్థి దగ్గర డిక్షనరీ ఉందో లేదో మరోసారి చెక్ చేయాలని అన్నారు. లేని వాల్లకు కొత్త డిక్షనరీని వెంటనే అందించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా కానుక కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజు నుంచి వాటిని అందించి తీరాలని స్పష్టం చేశారు. తరగతి గదులు, క్లాస్ రూమ్స్ డిజిటలైజేషన్ వేగంగా పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. డిజిటల్ స్క్రీన్స్ కోసం ఐఎఫ్సీ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. డిజిటల్ స్క్రీన్స్ తో విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధన అందుతుందన్నారు.  

ఇటీవలే ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇచ్చిన ప్రభుత్వం

ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామని గతంలోనే ప్రకటించిన ప్రభుత్వం... వారితోపాటుగా ఉపాధ్యాయులకూ ట్యాబ్‌లు అందించింది. పాఠాలు చెప్పేందుకు వీలుగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ట్యాబ్‌లు అందించారు. ప్రభుత్వం రూ.686 కోట్లతో ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు ఇచ్చారు. రాష్ట్రంలోని 9,703  పాఠశాలల్లోని 4.50 లక్షల మంది విద్యార్థులు, 50,194 మంది ఉపాధ్యాయులు బైజూస్ నుండి కంటెంట్‌తో లోడ్ చేసిన Samsung T220 Lite Tablet PCని పొందారు.  ఈ ట్యాబ్‌ల వల్ల విద్యార్థులు నిరంతరం తమ సందేహాలను తీర్చుకునే అవకాశం ఉంటుంది. క్లాస్ రూమ్‌లలోనే కాకుండా ఇంటి దగ్గర కూడా బైజూస్ కంటెంట్ ద్వారా చదువుకునే వెసులు బాటు ఉంటుంది. ముఖ్యంగా పేద విద్యార్థులు ఇతరులతో పోటీ పడేందుకు ఈ ట్యాబ్‌లు ఎంతగానే ఉపయోగపడనున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Iran US War: చర్చల కోసం ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటోంది, కానీ..! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం
చర్చల కోసం ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటోంది, కానీ..! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం
24 గంటల్లో అధికారులపై చర్య తీసుకోకుంటే తిరుగుబాటు: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరిక
24 గంటల్లో అధికారులపై చర్య తీసుకోకుంటే తిరుగుబాటు: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరిక
Indian Cricket Coaching Changes: కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
టీమిండియా కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
Karnataka Cabinet Expansion: కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా 19 మంది ప్రమాణం- మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా 19 మంది ప్రమాణం- మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget