అన్వేషించండి

Andhra Pradesh and Telangana Weather Updates: ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!

Andhra Pradesh and Telangana Weather Updates: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలుగు రాష్ట్రాల్లో భరించలేని ఎండలు, రోళ్లు పగిలే స్థాయి ఉష్ణోగ్రతలు.
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు.
  • తీవ్రమైన ఎండలు, వడగాలలతో తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న మరణాల సంఖ్య.
  • ప్రభుత్వాలు అత్యవసర హెచ్చరికలు జారీ, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.

Andhra Pradesh and Telangana Weather Updates: తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయనే సామెత నిజం అవుతోంది. చాలా ప్రాంతాల్లో రోళ్లు, రాళ్లు పలిగే ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తోంది. జనం విలవిలలాడిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వేసవి మొదలు కాక ముందు నుంచే ఎండు ఠారెత్తించాయి. గతానికి కంటే భిన్నంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు అవి మరింత తీవ్ర స్థాయికి వెళ్లాయి. దీంతో అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగురాళ్లలో ప్రళయం 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో ఎండలు అసాధారణంగా పెరిగాయి. బుధవారం నాటి గణాంకాల ప్రకారం పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో అత్యధికంగా 47. 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఈ వేసవిలో నమోదు అయిన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. ఒక్క పల్నాడు జిల్లా మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. 28 జిల్లాలకు గాను, 23 జిల్లాల్లో ఎండలు మండిపోయాయి. 233 మండలాల్లో 41 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 11 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటగా, 204 మండలాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు రిజిస్టర్ అయ్యాయి.  

పిడుగురాళ్ల తర్వాత నెల్లూరు జిల్లా గూడూరులో 44.9 డిగ్రీలు, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5 డిగ్రీలు, ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, మార్కాపురం జిల్లాల్లోని పెదచెర్లోపల్లిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 

తెలంగాణలో అదిరిపోతున్న ఎండలు 

తెలంగాణలో కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బుధవారం నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌్లో 46.5 డగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది. గత  పదేళ్ల రికార్డులను తుడిచి కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హనుమకొండలో 46.4, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 40.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

వడగాలులకు పోతున్న ప్రాణాలు 

తీవ్రమైన ఎండల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ బుధవారం ఒక్క రోజే వడదెబ్బకు పది మందికిపైగా మృతి చెందారు. మరణించిన వారిలో రైతులు, ఉపాధి కూలీలు, మున్సిపల్‌ కార్మికులు, దివ్యాంగులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు, కరీంనగర్‌, సూర్యాపేట, ములుగు, మహబూబాబాద్‌, జనగామ, రాజన్న సిరిసిల్ల ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కూడా వడ దెబ్బ కారణంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో గీత కార్మికుడు చనిపోయాడు. కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన కౌలు రైతు చనిపోయాడు. మార్చి 1 నుంచి మే 19 వరకు 325 మంది వడదెబ్బకు ఏపీలో మృత్యువాత పడ్డారు. 

ప్రస్తుతం వాయవ్య భారతం నుంచి వేడిగాలులు కోస్తాంధ్ర, రాయలసీమవైపు వీస్తున్నాయి. దీనికి తోడు కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షి కోస్తాంధ్ర వరకు ఒక ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉండటంతో ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణం. సాధారణం కంటే 4.5 నుంచి 6.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. 

Frequently Asked Questions

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదయ్యాయి?

ఆంధ్రప్రదేశ్​లో పిడుగురాళ్లలో 47.6 డిగ్రీలు, తెలంగాణలో నిర్మల్​ జిల్లా దిలావర్​పూర్​లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఈ వేడి వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా?

అవును, తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బకు తెలంగాణలో పది మందికి పైగా, ఆంధ్రప్రదేశ్​లో మార్చి 1 నుంచి మే 19 వరకు 325 మంది మృతి చెందారు.

ఎన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి?

ఆంధ్రప్రదేశ్​లో 233 మండలాల్లో 41 డిగ్రీల కంటే ఎక్కువ, 11 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటాయి. తెలంగాణలో 33 జిల్లాల్లో 40.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ayodhya Ram Mandir Donation Theft: అయోధ్య రామాలయం విరాళాల కేసు.. చోరీ ఎలా చేశారో పోలీసులకు వివరించిన నిందితుడు
అయోధ్య రామాలయం విరాళాల కేసు.. చోరీ ఎలా చేశారో పోలీసులకు వివరించిన నిందితుడు
Breaking News: సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ప్లాన్ ప్రకారం అయోధ్య విరాళాల చోరీ
సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ప్లాన్ ప్రకారం అయోధ్య విరాళాల చోరీ
ABP Desam Top 10, 1 July 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 1 July 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష పారితోషికం
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష పారితోషికం
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: 2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
Palnadu Road Accident: 2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష పారితోషికం
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష పారితోషికం
WhatsApp Hacks:వాట్సాప్‌లో పంపిన ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? క్వాలిటీ పెంచే చిట్కాలు ఇవే! 
వాట్సాప్‌లో పంపిన ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? క్వాలిటీ పెంచే చిట్కాలు ఇవే! 
TDP Blacklisted MLAs List 2026: దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
MGNREGA Replaced by VBG RAM G: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
Donald Trump Order: ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
Embed widget