అన్వేషించండి

Andhra Pradesh and Telangana Weather Updates: ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!

Andhra Pradesh and Telangana Weather Updates: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలుగు రాష్ట్రాల్లో భరించలేని ఎండలు, రోళ్లు పగిలే స్థాయి ఉష్ణోగ్రతలు.
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు.
  • తీవ్రమైన ఎండలు, వడగాలలతో తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న మరణాల సంఖ్య.
  • ప్రభుత్వాలు అత్యవసర హెచ్చరికలు జారీ, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.

Andhra Pradesh and Telangana Weather Updates: తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయనే సామెత నిజం అవుతోంది. చాలా ప్రాంతాల్లో రోళ్లు, రాళ్లు పలిగే ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తోంది. జనం విలవిలలాడిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వేసవి మొదలు కాక ముందు నుంచే ఎండు ఠారెత్తించాయి. గతానికి కంటే భిన్నంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు అవి మరింత తీవ్ర స్థాయికి వెళ్లాయి. దీంతో అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగురాళ్లలో ప్రళయం 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో ఎండలు అసాధారణంగా పెరిగాయి. బుధవారం నాటి గణాంకాల ప్రకారం పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో అత్యధికంగా 47. 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఈ వేసవిలో నమోదు అయిన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. ఒక్క పల్నాడు జిల్లా మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. 28 జిల్లాలకు గాను, 23 జిల్లాల్లో ఎండలు మండిపోయాయి. 233 మండలాల్లో 41 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 11 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటగా, 204 మండలాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు రిజిస్టర్ అయ్యాయి.  

పిడుగురాళ్ల తర్వాత నెల్లూరు జిల్లా గూడూరులో 44.9 డిగ్రీలు, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5 డిగ్రీలు, ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, మార్కాపురం జిల్లాల్లోని పెదచెర్లోపల్లిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 

తెలంగాణలో అదిరిపోతున్న ఎండలు 

తెలంగాణలో కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బుధవారం నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌్లో 46.5 డగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది. గత  పదేళ్ల రికార్డులను తుడిచి కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హనుమకొండలో 46.4, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 40.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

వడగాలులకు పోతున్న ప్రాణాలు 

తీవ్రమైన ఎండల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ బుధవారం ఒక్క రోజే వడదెబ్బకు పది మందికిపైగా మృతి చెందారు. మరణించిన వారిలో రైతులు, ఉపాధి కూలీలు, మున్సిపల్‌ కార్మికులు, దివ్యాంగులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు, కరీంనగర్‌, సూర్యాపేట, ములుగు, మహబూబాబాద్‌, జనగామ, రాజన్న సిరిసిల్ల ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కూడా వడ దెబ్బ కారణంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో గీత కార్మికుడు చనిపోయాడు. కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన కౌలు రైతు చనిపోయాడు. మార్చి 1 నుంచి మే 19 వరకు 325 మంది వడదెబ్బకు ఏపీలో మృత్యువాత పడ్డారు. 

ప్రస్తుతం వాయవ్య భారతం నుంచి వేడిగాలులు కోస్తాంధ్ర, రాయలసీమవైపు వీస్తున్నాయి. దీనికి తోడు కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షి కోస్తాంధ్ర వరకు ఒక ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉండటంతో ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణం. సాధారణం కంటే 4.5 నుంచి 6.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. 

Frequently Asked Questions

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదయ్యాయి?

ఆంధ్రప్రదేశ్​లో పిడుగురాళ్లలో 47.6 డిగ్రీలు, తెలంగాణలో నిర్మల్​ జిల్లా దిలావర్​పూర్​లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఈ వేడి వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా?

అవును, తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బకు తెలంగాణలో పది మందికి పైగా, ఆంధ్రప్రదేశ్​లో మార్చి 1 నుంచి మే 19 వరకు 325 మంది మృతి చెందారు.

ఎన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి?

ఆంధ్రప్రదేశ్​లో 233 మండలాల్లో 41 డిగ్రీల కంటే ఎక్కువ, 11 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటాయి. తెలంగాణలో 33 జిల్లాల్లో 40.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిర్మల్ జిల్లాలో అటవీ అధికారులు. గిరిజనుల మధ్య ఉద్రిక్తత 
నిర్మల్ జిల్లాలో అటవీ అధికారులు. గిరిజనుల మధ్య ఉద్రిక్తత 
Tamil Nadu Crop Loan Waiver 2026: తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం- రైతుల రుణమాఫీ రూ.75,000కు పెంపు
తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం- రైతుల రుణమాఫీ రూ.75,000కు పెంపు
SUV కొనాలని ఆలోచిస్తున్నారా? త్వరలో మార్కెట్లోకి రానున్న 6 పవర్‌ఫుల్ వెహికల్స్
SUV కొనాలని ఆలోచిస్తున్నారా? త్వరలో మార్కెట్లోకి రానున్న 6 పవర్‌ఫుల్ వెహికల్స్
WhatsApp కాకుండా Telegram App మీద నిషేధం ఎందుకు? ఇది ఎలా పనిచేస్తుంది ?
WhatsApp కాకుండా Telegram App మీద నిషేధం ఎందుకు? ఇది ఎలా పనిచేస్తుంది ?
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport: ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ముందడుగు! డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు సేకరణకు చర్యలు!
ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ముందడుగు! డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు సేకరణకు చర్యలు!
Tamil Nadu Crop Loan Waiver 2026: తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం- రైతుల రుణమాఫీ రూ.75,000కు పెంపు
తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం- రైతుల రుణమాఫీ రూ.75,000కు పెంపు
HYDERABAD METRO - THE ISSUE and THE STATUS | హైదరాబాద్ మెట్రోకు ఏమైంది? రూ.13,600 కోట్ల అప్పు, ఫేజ్ - 2 ప్రారంభానికి అడ్డేంటి ??
HYDERABAD METRO | హైదరాబాద్ మెట్రోకు ఏమైంది? రూ.13,600 కోట్ల అప్పు, ఫేజ్ - 2 ప్రారంభానికి అడ్డేంటి ??
Telegram Ban: టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం.. నీట్ రీఎగ్జామ్ వేళ కేంద్రం కీలక నిర్ణయం
టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం.. నీట్ రీఎగ్జామ్ వేళ కేంద్రం కీలక నిర్ణయం
Hyderabad Metro Phase 2 Loan Controversy: రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న మెట్రో ఫేజ్ 2 - రేవంత్ , కిషన్, కేటీఆర్ మధ్య పరస్పర ఆరోపణలు - పరిష్కారం ఉందా?
రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న మెట్రో ఫేజ్ 2 - రేవంత్ , కిషన్, కేటీఆర్ మధ్య పరస్పర ఆరోపణలు - పరిష్కారం ఉందా?
US Iran Peace Deal: ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల పరిహారం..! యుద్ధంతో డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించారు?
ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల పరిహారం..! యుద్ధంతో డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించారు?
International Yoga Day: ఏపీలో పండుగలా యోగాడే నిర్వహణకు ఏర్పాట్లు - తెలంగాణలో లైట్ - ఎందుకలా?
ఏపీలో పండుగలా యోగాడే నిర్వహణకు ఏర్పాట్లు - తెలంగాణలో లైట్ - ఎందుకలా?
Vaibhav Suryavanshi: లంక ఆటగాళ్లతో వివాదం.. చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ! ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తప్పవా ?
లంక ఆటగాళ్లతో వివాదం.. చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ! ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తప్పవా ?
Embed widget