అన్వేషించండి

Breaking News Telugu Live Updates: సర్వీసులను పునరుద్ధరించాలని విశాఖ రైల్వే అధికారులకు ఆదేశం 

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Key Events
Agnipath Protests in Telangana Breaking News Live Updates Breaking News Telugu Live Updates: సర్వీసులను పునరుద్ధరించాలని విశాఖ రైల్వే అధికారులకు ఆదేశం 
ఏపీ, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

Background

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు దాదాపుగా అన్ని జిల్లాల్లోకి ప్రవేశించాయి. దీంతో ఇకనుంచి అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతూ అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. కొన్నిచోట్ల వర్షాలు ఇంకా మొదలుకాకపోవడంతో ఉష్ణోగ్రతలు దిగి రావడం లేదు. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో శుక్రవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దక్షిణ కోస్తా ఒడిశా, పరిసర ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది.  రాగల రెండు రోజులలో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడా, కర్ణాటక, తమిళనాడు, విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి నైరుతి రుతుపవనాలు ముందుకు కదులుతున్నాయి.

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి.  కొనుగోలుదారులకు మళ్లీ షాక్ తగిలింది. మరోవైపు వెండి ధర నిలకడగా ఉంది. రూ.230 మేర పెరగడంతో  తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100కి పుంజుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,750 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.66,000 అయింది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,100 కి చేరగా, 22 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.47,750 అయింది. ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,100 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750 కి చేరింది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.66,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకాన్ని నిరసిస్తూ చేపట్టిన నిరసనలో ఆర్పీఎఫ్ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియ (అగ్నిపథ్)ను నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో రైల్వే పోలీస్ కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ మరణంపై కేసీఆర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

రాకేష్ కుటుంబానికి అండగా తెలంగాణ ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన బీసీ యువకుడు రాకేష్ కుటుంబానికి సీఎం కేసీఆర్ తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబానికి 25 లక్షల పరిహారంతో పాటు, ఆ కుటుంబంలో అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేష్ బలయ్యిండని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం కేసీఆర్ చేశారు. 

20:03 PM (IST)  •  18 Jun 2022

పట్టపగలే అత్యంత దారుణంగా స్నేహితుడి తండ్రిని హత్య చేసిన యువకుడు

చిత్తూరు జిల్లా, చౌడేపల్లె మండలం, పెద్దకంపల్లిలో ఓ యువకుడు పట్ట పగలే ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపాడు.. అదే గ్రామానికి చేందిన శ్రీనివాసులు రావు తన ఇద్దరూ కుమారులతో కలిసి నివాసం ఉండేవాడు.. అయితే గత కొద్ది రోజులుగా తండ్రి‌ మాటలను ఏమాత్రం లెక్క చేయకుండా చెడు తిరుగుళ్ళు తిరుగుతూ చుట్టు పక్కల గ్రామాల్లో అప్పులు చేసి జల్సాలు చేసేవారు.. ఇదే విషయంపై గత రెండు ఏళ్ళుగా తండ్రి, కుమారులకు తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి.. ఎప్పటికైనా తమ కుమారుల్లో మార్పు రాకుండా పోతుందా అనే ఆశతో శ్రీనివాసురావు తన కుమారులు చేసిన అప్పులు తీర్చేవాడు.. అయితే గ్రామంలో ఉంటున్న గిరిబాబు నాయుడు అనే యువకుడితో శ్రీనివాసురావు ఇద్దరు కుమారులు స్నేహంగా మెలుగుతున్నట్లు శ్రీనివాసురావు తెలుసుకున్నాడు.. వీరిపై శ్రీనివాసురావు ఆరా తీసేవాడు.. ముగ్గురు రోజు పీకల వరకూ తాగి, పేకాట ఆడుతూ కాలం గడిపేవారు.. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడి చేసి గాయ పరిచేవారు.. దీంతో గ్రామంలో ఎవరూ వీరిని పెద్దగా పట్టించుకునేవారు కాదు.. రోజు రోజుకి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న తన కుమారులను తలుచుకుని శ్రీనివాసురావు కుమిలి పోయేవాడు.. అనేక మార్లు గ్రామంలో పంచాయతీ పెట్టి ముగ్గరిని హెచ్చరించినా వారు తీరు మార్చుకోకుండా పుల్ గా మద్యం సేవించి గ్రామస్తుల గొడవకు ఈడ్చేవారు.. అయితే తన కుమారులు చెడి పోయేందుకు కారణంమైన గిరిబాబు నాయుడిని పిలిచి‌న శ్రీనివాసులు తన కుమారులతో చేరొద్దని, వారి భవిష్యత్తు నాశనం అవుతుందని పలుమార్లు హెచ్చరించాడు.. ఇవేవి పట్టించుకోని గిరిబాబు నాయుడు రోజులాగే మద్యం సేవించి శ్రీనివాసురావు కుమారులతో పేకాట ఆడేవాడు.. దీంతో ఆగ్రహించిన శ్రీనివాసు రావు ఈ రోజు మధ్యాహ్నం తన కుమారులతో చేరద్దని గిరిబాబు నాయుడు ఇంటి వద్దకు వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు.. గిరిబాబు నాయుడు, శ్రీనివాసురావులు ఇద్దరూ ఒకరిని ఒకరు దూషించుకుని, వాగ్వాదంకు దిగ్గారు.. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన గిరిబాబు నాయుడు తన నివాసంలో ఉన్న కత్తిని తీసుకుని ఒక్కసారిగా శ్రీనివాసులరావుపై దాడి చేసి గ్రామస్తులు అందరూ చూస్తుండం గానే అతికిరాతకంగా నరికి చంపాడు.

13:24 PM (IST)  •  18 Jun 2022

Visakhapatnam Rail Service: సర్వీసులను పునరుద్ధరించాలని విశాఖ రైల్వే అధికారులకు ఆదేశం 

విశాఖపట్నం: సర్వీసులను పునరుద్ధరించాలని విశాఖ రైల్వే అధికారులకు ఆదేశం 

నగర సరిహద్దు స్టేషన్లలో ఆగి ఉన్న రైళ్ళను విశాఖ కు రప్పించే ప్రయత్నాలు ప్రారంభం

విశాఖ స్టేషన్ నుంచి రెండు గంటలకు ప్రారంభం కానున్న తిరుమల ఎక్స్ప్రెస్(17488)

విజయనగరం లో ఆగిఉన్న హౌరా - యశ్వంత్ పూర్,  ప్రశాంతి ఎక్స్ప్రెస్ కు కూడా క్లియరెన్స్

మూడు గంటలకు మరోసారి భద్రతా ఏర్పాట్లను సమీక్షించి అన్ని ట్రైన్స్ ను పునరుద్ధరించాలని నిర్ణయం

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Indw vs Slw 4th t20 highlights: ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
Nirmala Sitharaman AP Tour: విద్య, క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు.. తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: నిర్మలా సీతారామన్
నరసాపురం తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: ఏపీ పర్యటనలో నిర్మలా సీతారామన్
Prakash Raj Vs BJP Vishnu: ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
Binni And Family OTT: థియేటర్లలో విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి... బాలీవుడ్ హీరో కజిన్ కూతురి సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
థియేటర్లలో విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి... బాలీవుడ్ హీరో కజిన్ కూతురి సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indw vs Slw 4th t20 highlights: ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
Nirmala Sitharaman AP Tour: విద్య, క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు.. తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: నిర్మలా సీతారామన్
నరసాపురం తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: ఏపీ పర్యటనలో నిర్మలా సీతారామన్
Prakash Raj Vs BJP Vishnu: ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
Binni And Family OTT: థియేటర్లలో విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి... బాలీవుడ్ హీరో కజిన్ కూతురి సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
థియేటర్లలో విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి... బాలీవుడ్ హీరో కజిన్ కూతురి సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Actor Vijay Quits Cinema: నటుడు విజయ్ కెరీర్‌లో కీలకఘట్టం.. సినిమాలకు గుడ్‌బై చెబుతూ దళపతి ఎమోషనల్
నటుడు విజయ్ కెరీర్‌లో కీలకఘట్టం.. సినిమాలకు గుడ్‌బై చెబుతూ దళపతి ఎమోషనల్
Kaleshwaram Project: మేడిగడ్డ కుంగుబాటుపై ఎల్‌ అండ్‌ టీకి తుది నోటీసులు.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం!
మేడిగడ్డ కుంగుబాటుపై ఎల్‌ అండ్‌ టీకి తుది నోటీసులు.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం!
మూడవ ప్రపంచ యుద్ధం నుంచి AI విపత్తు వరకు 2026లో ఏం జరుగుతోందో తెలుసా?
మూడవ ప్రపంచ యుద్ధం నుంచి AI విపత్తు వరకు 2026లో ఏం జరుగుతోందో తెలుసా?
Champion Box Office Collection Day 3 : మూడు రోజుల్లో కలెక్షన్స్ 'ఛాంపియన్' - పది కోట్లకు చేరువలో రోషన్ స్పోర్ట్స్ డ్రామా
మూడు రోజుల్లో కలెక్షన్స్ 'ఛాంపియన్' - పది కోట్లకు చేరువలో రోషన్ స్పోర్ట్స్ డ్రామా
Embed widget