అన్వేషించండి

Agneepath Recruitment Scheme: అగ్నిపథ్‌తో సైన్యానికి లాభమా, నష్టమా- ప్రభుత్వం ఏం చెబుతోంది

అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం మాత్రం ఇదో చరిత్రాత్మక నిర్ణయమని అంటోంది.

అగ్నిపథ్‌కు ఎవరు అర్హులు..? 

కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మాట అగ్నిపథ్. సైనికుల నియామకంలో కొత్త ట్రెండ్‌కి ఇది నాంది పలుకుతుందని కేంద్రం చాలా గట్టిగా చెబుతోంది. యువతకు అధిక ప్రాధాన్యతనిచ్చేలా ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఇటీవలే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ప్రకటించారు. ఇదో చరిత్రాత్మక నిర్ణయమని, మొదటి విడతలో 46 వేల మందిని సైనికులుగా తీర్చి దిద్దుతామంటూ వెల్లడించింది కేంద్రం. త్రివిధ దళాల్లో నాలుగేళ్ల పాటు వీళ్లు విధులు నిర్వహిస్తారు. సైన్యంలోకి యువరక్తాన్ని ఆహ్వానించటం ద్వారా భారత్ మరింత శక్తిమంతమవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

ఇవీ లాభాలు

రెగ్యులర్ సైనికులకు అందించే పెన్షన్లు, జీతాలు కోసం చేసే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చని భావిస్తోంది. ఈ అగ్నిపథ్‌ సర్వీస్‌లో చేరేందుకు 17.5-21 ఏళ్ల వాళ్లు అర్హులు. ఎంపికైన వారికి ఆర్నెల్ల పాటు శిక్షణ అందించి మూడున్నరేళ్ల పాటు సర్వీసులో ఉంచుతారు. ఈ నాలుగేళ్లు పూర్తయ్యాక ప్రతిభ ఆధారంగా 25% మందిని శాశ్వత కమిషన్‌లో పని చేసేందుకు అవకాశం కల్పిస్తారు. మంచి ప్యాకేజీ కూడా అందిస్తారు. తొలి సంవత్సరం రూ.4.76 లక్షల ప్యాకేజీ అందిస్తారు. వీరిని అగ్నివీరులుగా అభివర్ణిస్తోంది కేంద్ర ప్రభుత్వం.   అయితే ఈ రిక్రూట్‌మెంట్ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

అగ్నిపథ్ తీసుకురావటానికి కారణమిదే..

ఈ అగ్నిపథ్ సర్వీస్‌ని ప్రారంభించాలని ఐడియా 2020లోనే వచ్చిందట. ఇది మాజీ సైనికాధ్యక్షుడు బిపిన్ రావత్ ఆలోచన. సైన్యం కోసం చేస్తున్న ఖర్చుని వీలైనంత వరకూ తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ ఆలోచన చేశారట. అయితే ఈ ప్రక్రియను కేవలం జవాన్లకే పరిమితం చేయాలని భావిస్తోంది కేంద్రం. ఉన్నతాధికారులకు సంబంధించి ఇప్పటికే షార్ట్ సర్వీస్ కమిషన్‌ అందుబాటులో ఉంది. ఆఫీసర్ క్యాడర్‌ వాళ్లను రిక్రూట్ చేసుకుని ఐదేళ్ల పాటు సర్వీస్‌లో కొనసాగిస్తారు. కానీ ఇప్పటికే ఈ రిక్రూట్‌మెంట్‌పై కాస్త అసహనం వ్యక్తమవుతోంది. చాలా కొద్ది మంది మాత్రమే పర్మినెంట్‌ అవుతుండటమే ఇందుకు కారణం. ఈ ఆఫీసర్‌లకు శిక్షణనిచ్చేందుకు ఏటా రూ.6కోట్లు ఖర్చు చేస్తున్నారని అంచనా. కానీ ఇలా ఐదేళ్ల సర్వీస్ ముగించుకున్న వాళ్లకి పెన్షన్లు రావటం లేదు. కనీసం మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వటం లేదని చాలా మంది అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి అగ్నిపథ్ లాంటి తాత్కాలిక రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను తీసుకురావటంపై కొందరు సీనియర్లు పెదవి విరుస్తున్నారు. కఠినమైన ఎంపిక ప్రక్రియను దాటుకుని వస్తే రెగ్యులర్ క్యాడర్‌లోకి తీసుకుంటామని కేంద్రం చెబుతున్నా ఈ అవకాశాలు చాలా తక్కువేనన్నది కొందరి అభిప్రాయం. 

భిన్నాభిప్రాయాలు ఎందుకు..? 

సాధారణంగా ఓ సైనికుడు అన్ని విధాలుగా శిక్షణ పొంది పోరాడేందుకు సిద్ధ పడాలంటే కనీసం 6-7 ఏళ్లు పడుతుందన్నది సీనియర్ల అభిప్రాయం. అలాంటికి కేవలం ఆర్నెల్లలో ట్రైనింగ్ ఇచ్చి రంగంలోకి దింపుతామంటే అది సాధ్యం కాని పని అని కొందరు గట్టిగానే వాదిస్తున్నారు. పూర్తి స్థాయి అవగాహన వచ్చే నాటికి సర్వీస్ నుంచి దిగిపోతారు. చైనా, పాకిస్థాన్‌తో సరిహద్దు పంచుకునే ప్రాంతాల్లో భారత జవాన్లు ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాస్తుంటారు. కేవలం నాలుగేళ్ల పాటు పని చేసేందుకు వచ్చే సైనికులు అంత ధైర్యసాహసాలు చూపించి పోరాడతారా అన్నదీ ప్రశ్నార్థకమే అన్నది డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ పీకే సెహగల్ అభిప్రాయం. పైగా వీరిలో కేవలం 25% మంది మాత్రమే పర్మినెంట్ అవుతారని కేంద్రం చెబుతోంది. ఆర్మీలో పూర్తి స్థాయి శిక్షణ పొందిన వారి సంఖ్య ఇంత తక్కువగా ఉంటే ఎలా అన్న వాదనా వినిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
The RajaSaab - King Size Interview: ప్రభాస్ & 'ది రాజా సాబ్' హీరోయిన్లతో సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ... ప్రోమో వచ్చేసింది
ప్రభాస్ & 'ది రాజా సాబ్' హీరోయిన్లతో సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ... ప్రోమో వచ్చేసింది
Embed widget