By: Ram Manohar | Updated at : 18 Dec 2022 03:39 PM (IST)
దేశంలోని సమస్యలు తీర్చే బాధ్యతను దేవుడే ఆప్నకు అప్పగించాడని కేజ్రీవాల్ అన్నారు. (Image Credits: Twitter)
Arvind Kejriwal:
నేషనల్ కౌన్సిల్..
ఢిల్లీలో ఆప్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. పంజాబ్, గుజరాత్, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల తరవాత నిర్వహించిన కీలక సమావేశంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇదే సందర్భంలో బీజేపీపై విమర్శలు చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని అన్నారు. ఢిల్లీలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉందని చెప్పారు. నిజాయతీగా ఉంటున్న
వ్యక్తులపైనే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారని మండి పడ్డారు. "దేశంలో ప్రతి ఒక్కరినీ ధనికులుగా మార్చడమే నా లక్ష్యం" అని వెల్లడించారు. అంతే కాదు. దేశంలోని సమస్యల్ని తీర్చాలనే ఉద్దేశంతోనే దేవుడు భూమి మీదకు పంపాడని అన్నారు. "దేశాన్ని సరైన మార్గంలో నడిపే పనిని దేవుడే ఆమ్ఆద్మీకి అప్పగించాడు" అని చెప్పారు. ఆమ్ఆద్మీ పార్టీని విస్తృతం చేయాలనే ఆలోచన తనకు లేదని, దేశానికి ఏం చేయొచ్చనే దృష్టితోనే ఆలోచిస్తున్నానని స్పష్టం చేశారు. "మతం పేరుతో హింస జరగకూడదు. 130 కోట్ల మంది ప్రజలు ప్రశాంతంగా బతకాలి" అని వెల్లడించారు. దేశమంతా ఓ కుటుంబం అని...అందరూ కలిసికట్టుగా పని చేయకపోతే...దేశాభివృద్ధి జరగదని అన్నారు. బీజేపీ దేశాన్ని విభజిస్తోందని విమర్శించారు. ఢిల్లీలోని పాఠశాలలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహిస్తోందని, దేశమంతా ఇదే విధానం అమల్లోకి రావాలని కోరారు. పేదరికాన్ని నిర్మూలించడమే కాదు...దేశ పౌరులందరినీ ధనికులుగా మార్చాలన్నదే తన లక్ష్యం అని స్పష్టం చేశారు.
Indians को भगा रहे हो और China वालों को गले लगाते हो!
China से आने वाला 90% माल भारत में बन सकता है।
उद्योगपति देश छोड़कर जा रहे हैं, पिछले 5–7 साल में 12.5 Lakh लोग देश छोड़कर गए।
उद्योगपतियों के पीछे CBI-ED छोड़कर, चोर-उचक्कों को पार्टी में लेते हैं।
—CM @ArvindKejriwal pic.twitter.com/IbAcQ6chGN — AAP (@AamAadmiParty) December 18, 2022
AAP को लेकर नहीं, देश को लेकर मेरा Vision है🇮🇳
— AAP (@AamAadmiParty) December 18, 2022
जाति-धर्म के नाम पर हिंसा न हो—अगर लोग इकट्ठा होकर काम नहीं करेंगे,वो देश आगे बढ़ ही नहीं सकता
हम ऐसा देश चाहते हैं जहां कोई भूखा न सोए
गरीब को भी Best शिक्षा-स्वास्थ्य मिले, और अमीर बने—भारत शिक्षा का Hub बने
—CM @ArvindKejriwal pic.twitter.com/Cnj6xST3IY
ఎన్నికలే లక్ష్యంగా..
"టార్గెట్ 2024" ఎజెండాతో ముందుకు సాగనుంది ఆప్. పది మంది రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవలే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 15 ఏళ్ల బీజేపీ అధికారానికి స్వస్తి పలికి... అధికారంలోకి వచ్చింది ఆప్. ఇది కూడా ఆ పార్టీకి ఉత్సాహాన్నిచ్చింది. పంజాబ్లోనూ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ వరుస ఎన్నికల తరవాత నిర్వహించుకుంటున్న కీలక సమావేశమిది. అందుకే...పార్టీ నేతలందరూ చాలా ఆసక్తి కనబరిచారు. ఢిల్లీ, పంజాబ్, గోవా, గుజరాత్తో సహా కీలక నేతలందరూ ఈ సమావేశంలో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఆయా రాష్ట్రాల రాజకీయ వాతావరణం ఎలా ఉందన్న అంశంపైనా చర్చించనున్నారు. మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు
జరగనున్న రాష్ట్రాలపైనా ప్రత్యేక దృష్టి సారించనుంది ఆప్. పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న సందీప్ పఠక్ను ఇటీవలే నేషనల్ సెక్రటరీగా నియమించారు కేజ్రీవాల్. ఆయన నేతృత్వంలోనే కీలక సమావేశాలన్నీ జరగనున్నాయి.
Also Read: Mamata Banerjee: అమిత్షా సమక్షంలో భద్రతా బలగాలతో మమతా వాగ్వాదం, అధికారాల విషయంలో అభ్యంతరాలు
CM KCR Nanded Tour: నేడే నాందేడ్లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Weather Latest Update: నేడు ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! చాలా జిల్లాల్లో వణికించనున్న చలి
Petrol-Diesel Price 05 February 2023: రాజమండ్రిలో చమురు మంట, పెద్ద నోటు ఉంటేనే పెట్రోల్ బంక్కు వెళ్లండి
ABP Desam Top 10, 5 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
KNRUHS: యూజీ ఆయూష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఫిబ్రవరి 5, 6 తేదీల్లో వెబ్ఆప్షన్లు!
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?