అన్వేషించండి

Mamata Banerjee: అమిత్‌షా సమక్షంలో భద్రతా బలగాలతో మమతా వాగ్వాదం, అధికారాల విషయంలో అభ్యంతరాలు

Mamata Banerjee: బీఎస్‌ఎఫ్ నిఘా పరిధిని పెంచడంపై మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Mamata Banerjee on BSF:

ఈస్టర్న్ జోన్ కౌన్సిల్‌లో...

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నేతృత్వంలో పశ్చిమ బెంగాల్‌లో కీలక సమావేశం జరిగింది. ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్‌కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అంతర్గత, సరిహద్దు భద్రతపై ఈ సందర్భంగా చర్చించారు అమిత్‌షా. ఈ సమయంలోనే పశ్చిమ  బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరిహద్దు భద్రతా బలగాలు (BSF)తో వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి BSF సరిగా సహకరించడం లేదని ఆమె తీవ్రంగా ఆరోపించారు. కొన్ని చోట్ల మాత్రమే బలగాలు యాక్టివ్‌గా ఉంటున్నాయని, మరి కొన్ని చోట్ల అసలు నిఘా పెట్టడం లేదని విమర్శించారు. అంతే కాదు. ప్రభుత్వ పనుల్లోనూ జోక్యం చేసుకుంటోందని మండి పడ్డారు. అమిత్‌షా సమక్షంలోనే ఇలా విమర్శలు చేశారు మమతా బెనర్జీ. బీఎస్‌ఎఫ్ నిఘా పరిధినీ 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవహారాలలో జోక్యం చేసుకునేందుకే ఇలా చేశారని ఆరోపించారు. ఈ కారణంగా...బీఎస్‌ఎఫ్‌కు అదనపు అధికారాలు కట్టబెట్టినట్టైందని అన్నారు. నిజానికి...ఈ అంశంపై చాన్నాళ్లుగా మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఎస్‌ఎఫ్ పరిధిని పెంచడాన్ని వ్యతిరేకిస్తూ
గతేడాది అసెంబ్లీలో ఓ తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించారు. పంజాబ్‌ కూడా ఇలాంటి తీర్మానాన్నే ప్రవేశ పెట్టింది. ఆ తరవాత బెంగాల్‌ అదే బాటలో నడిచింది. ఇక్కడే చర్చకు వస్తున్న మరో అంశం...కేంద్ర హోం శాఖ బీఎస్‌ఎఫ్‌ నియమ నిబంధనల్ని మార్చివేయడం. ఈ మార్పులు జరిగిన వెంటనే ఆ బలగాలకు అదనపు అధికారాలు వచ్చాయి. అంతకు ముందు రాష్ట్ర సరిహద్దు లోపల 15 కిలోమీటర్ల వరకూ వారెంట్ లేకుండానే చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడా పరిధిని 50 కిలోమీటర్లకు పెంచారు. గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అసోం, మణిపూర్, మిజోరం, త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయా సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది అమల్లోకి వచ్చింది. అయితే...పంజాబ్‌, బెంగాల్‌లో మాత్రమే దీనిపై వ్యతిరేకత వచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో లేదు. 

ఇదీ కారణం...

రాష్ట్ర ప్రభుత్వ హక్కుల్ని అణిచివేస్తున్నారంటూ కేంద్రంపై మమతా ఫైర్ అవుతున్నారు. ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా బీఎస్‌ఎఫ్ పరిధిని ఎలా పెంచుతారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే..బీజేపీ మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతా బలగాలకు ఒకే రకమైన అధికారాలు ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేస్తోంది. సరిహద్దుల్లో ఎలాంటి అలజడులు రేగకుండా, రాష్ట్ర భద్రతకు భరోసా ఇచ్చేందుకు ఇది అవసరమని వివరిస్తోంది. మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేయడానికీ కారణముంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బీఎస్‌ఎఫ్ కూడా వచ్చి జోక్యం చేసుకుంటోంది. కానీ...కొన్ని సార్లు స్థానిక పోలీసుల పరిధిలో ఉండే సమస్యల్నీ తలకెత్తుకుంటున్నారని ఆరోపిస్తున్నారు మమతా. ఫలితంగా...భద్రతా బలగాలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతోందని.. వాళ్ల మధ్య సయోధ్య ఉండటం లేదని చెబుతున్నారు. అందుకే...అమిత్‌షాతో జరిగిన సమావేశంలో మరోసారి తన నిరసన గళాన్ని వినిపించారు దీదీ. 

Also Read: AAP National Council Meeting: 2024 ఎన్నికలకు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్న ఆప్, టార్గెట్ అదే!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Embed widget