అన్వేషించండి

Bharat Ratna 2024: మోదీ సర్కార్ అరుదైన రికార్డు, 15 రోజుల వ్యవధిలో ఐదుగురికి భారతరత్న

Bharat Ratna Awards: మోదీ సర్కార్ కేవలం 15 రోజుల వ్యవధిలో 5గురికి భారత రత్న అవార్డులు ప్రకటించి రికార్డు సృష్టించింది.

Bharat Ratna Awards 2024: మోదీ సర్కార్‌ అరుదైన రికార్డ్ సాధించింది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఐదుగురికి భారతరత్న అవార్డు ప్రకటించింది. వీళ్లలో ఇద్దరు మాజీ ప్రధాన మంత్రులు, ఒకరు డిప్యుటీ ప్రధాన మంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు. వీళ్లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త కూడా ఉన్నారు. సాధారణంగా ఏడాదిలో కేవలం ముగ్గురికే భారతరత్న అవార్డు ప్రకటిస్తారు. కానీ...మోదీ సర్కార్‌ ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసింది. ఇప్పటికే బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన కేంద్రం ఇప్పుడు ఏకంగా ముగ్గురిని ఈ పురస్కారంతో సత్కరించింది. మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావుతో పాటు చౌదరి చరణ్ సింగ్‌, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త MS స్వామినాథన్‌కి ఈ అవార్డు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా ఈ ప్రకటన చేశారు. X వేదికగా పోస్ట్‌లు పెట్టారు. వాళ్ల సేవల్ని స్మరించుకున్నారు. 

కర్పూరి ఠాకూర్ 

మోదీ సర్కార్‌ ఈ ఏడాదికి తొలి భారతరత్న అవార్డుని బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కి ప్రకటించింది. బిహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో 1924లో జన్మించిన కర్పూరి ఠాకూర్...రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. తొలిసారి 1970లో డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకూ సీఎంగా ఉన్నారు. ఆ తరవాత 1977 నుంచి 1979 వరకూ ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం బిహార్‌లోని చాలా మంది రాజకీయ నేతలకు ఆయనే మెంటార్‌. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తో పాటు RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ కర్పూరి ఠాకూర్ శిష్యులే. 

ఎల్‌కే అద్వానీ

రెండో భారతరత్న అవార్డుని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి ప్రకటించింది మోదీ సర్కార్. అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలో ఉప ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఎల్‌కే అద్వానీ. ఆ తరవాత పలు మంత్రిత్వ శాఖల బాధ్యతలూ తీసుకున్నారు. 1970 నుంచి 2019 వరకూ పార్లమెంట్‌లోని రెండు సభలకూ ప్రాతినిధ్యం వహించారు. బీజేపీని ముందుండి నడిపించిన రథసారథిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుని ప్రకటించడంపై అద్వానీ సంతోషం వ్యక్తం చేసినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారని, కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు. పలువురు కేంద్రమంత్రులూ ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన సేవలకు తగిన గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. 

పీవీ నరసింహా రావు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి (PV Narasimha Rao) భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని పదవిని అలంకరించిన తొలి దక్షిణ భారతీయులు, ఒకేఒక తెలుగువారు పీవీ నరసింహా రావు. 1991 నుండి 1995 వరకు ఆయన ప్రధానిగా ఉన్నారు. బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు బీజంవేసిన అపర చాణక్యులు. మన్మోహన్ సింగ్ సహకారంతో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల దేశం ముందుకు సాగేందుకు ఉపయోగపడ్డాయి.

చౌదరి చరణ్ సింగ్

తన జీవితం అంతా రైతుల సంక్షేమం కోసమే ధారపోసిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌నీ భారతరత్నతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. 1902లో ఉత్తరప్రదేశ్‌లోని నూర్‌పూర్‌లో డిసెంబర్ 23న జన్మించారు చరణ్ సింగ్. రైతు కుటుంబంలో పుట్టిన ఆయన వాళ్ల కష్టాలేంటో తెలుసు. బాల్యం నుంచి వాటిని కళ్లారా చూశారు. అందుకే...అంతగా రైతుల సంక్షేమం కోసం అనునిత్యం తపించారు. 

ఎమ్ఎస్ స్వామినాథన్ 

భారత హరితవిప్లవ పితామహుడు MS స్వామినాథన్ సేవల్ని గుర్తించి భారతరత్న అవార్డుని ప్రదానం చేసింది కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు స్వామినాథన్. దేశానికి ఆహార భద్రత కల్పించారు. ఎన్నో కొత్త రకాల విత్తనాలను పరిచయం చేశారు. రైతుల మేలు కోసం నిరంతరం కృషి చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో కన్నుమూశారు. 

Also Read: PV Narasimha Rao: తొలిసారి తెలుగు బిడ్డకు దేశ అత్యున్నత పురస్కారం - జర్నలిస్టు నుంచి ప్రధానిగా పీవీ నరసింహారావు, ప్రస్థానం ఇదే!

టాప్ హెడ్ లైన్స్

Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Akbaruddin Owaisi: హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
Aus vs Eng World Cup Final: నాట్ స్కివర్ బ్రంట్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ డీసెంట్ స్కోరు.. ఆసీస్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కొల్లాప్స్
నాట్ స్కివర్ బ్రంట్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ డీసెంట్ స్కోరు.. ఆసీస్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కొల్లాప్స్
ABP Desam Top 10, 5 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 5 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget