అన్వేషించండి

PV Narasimha Rao: తొలిసారి తెలుగు బిడ్డకు దేశ అత్యున్నత పురస్కారం - జర్నలిస్టు నుంచి ప్రధానిగా పీవీ నరసింహారావు, ప్రస్థానం ఇదే!

PV Narasimha Rao Profile: దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' అందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా దివంగత పీవీ నరసింహారావు చరిత్రలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి మరిన్ని విశేషాలు మీ కోసం..

Bharat Ratna PV Narasimha Rao Profile: మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న'ను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఆయన పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921, జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు. ఆ తర్వాత పూర్వపు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయన్ను దత్తత తీసుకోవడంతో పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. ఉస్మానియా యూనివర్శిటీ, బాంబే, నాగ్ పూర్ విశ్వ విద్యాలయాల్లో చదువుకున్నారు. అనంతరం స్వాతంత్ర్యోద్యమ సమయంలో దేశం కోసం పోరాడిన ఆయన.. రాజకీయాల వైపు అడుగులు వేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రికలో  'జయ' అనే మారుపేరుతో 1950 ప్రాంతంలో ఆర్టికల్స్ రాశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మంథని నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1962, 1967, 1972లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన అనంతరం ఆయనకు మంత్రి పదవి దక్కింది. తొమ్మిదేళ్ల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పని చేశారు.

ఉమ్మడి ఏపీ సీఎంగా..

1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఏపీ సీఎంగా నియమించింది. రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన.. రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. 1977లో హనుమకొండ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 

పీఎంగా అప్పుడే

ఎంపీగా ఎన్నికైన అనంతరం పీవీ కేంద్ర కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 1991లో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్న ఆయన.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో ఆ నిర్ణయం విరమించుకున్నారు. 1991 నుంచి 96 వరకూ దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించి సేవలందించారు. దేశ అత్యున్నత పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. నెహ్రూ - గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా కాంగ్రెస్ నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం. దేశం విదేశీ నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో పీవీ.. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ వంటి ఆర్థిక సంస్కరణలతో గాడిన పెట్టారు.

ఈ ఏడాది ఐదుగురికి 'భారతరత్న'

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఐదుగురికి దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ప్రకటించింది. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ, పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, స్వామినాథన్ లకు అవార్డు ప్రకటించింది. ఒక ఏడాది గరిష్టంగా ముగ్గురికి మాత్రమే భారతరత్న ప్రకటించవచ్చు. కానీ 1999లో నలుగురికి ప్రకటించారు. ఆ తర్వాత ఎక్కువ మందికి ఇవ్వడం ఇదే తొలిసారి.

Also Read: Bharat Ratna Award: మాజీ ప్రధానులు పీవీ నరసింహా రావు, చరణ్ సింగ్‌కి భారతరత్న - కేంద్రం కీలక ప్రకటన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TVK Vijay trouble: కరూర్ తొక్కిసలాట పాపం అంతా విజయ్‌దేనా ? - తమిళనాట కలకలం రేపుతున్న సీబీఐ దూకుడు
కరూర్ తొక్కిసలాట పాపం అంతా విజయ్‌దేనా ? - తమిళనాట కలకలం రేపుతున్న సీబీఐ దూకుడు
Tamil Nadu Assembly Elections 2026: దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు తమిళనాడు అసెంబ్లీ పోల్స్ - ఖర్చు వేల కోట్లు ఖాయం!
దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు తమిళనాడు అసెంబ్లీ పోల్స్ - ఖర్చు వేల కోట్లు ఖాయం!
Vijay Latest News: ఎవరితో పొత్తు లేదు, నేను ప్రజల టీమ్! రాజకీయ సమీకరణాలపై విజయ్ సంచలన ప్రకటన!
ఎవరితో పొత్తు లేదు, నేను ప్రజల టీమ్! రాజకీయ సమీకరణాలపై విజయ్ సంచలన ప్రకటన!
Reel Mad: తండ్రిని గన్నీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి కొరియర్ ఆఫీస్‌కు తెచ్చారు - రీల్ కోసమే ! సోషల్ మీడియా పిచ్చి పీక్స్
తండ్రిని గన్నీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి కొరియర్ ఆఫీస్‌కు తెచ్చారు - రీల్ కోసమే ! సోషల్ మీడియా పిచ్చి పీక్స్

వీడియోలు

India Bullet Train : హైదరాబాద్‌ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
Gautam Gambhir about KKR IPL 2026 | గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Ambati Rayudu Reveals Dhoni’s Secret | సీఎస్‌కే డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ | ABP Desam
Greatest T20 Player by AB de Villiers | బుమ్రానే ఆల్‌టైమ్ నంబర్ 1 | ABP Desam
Sanju Samson leaving RR IPL2026 | సీఎస్కే లోకి సంజు శాంసన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay trouble: కరూర్ తొక్కిసలాట పాపం అంతా విజయ్‌దేనా ? - తమిళనాట కలకలం రేపుతున్న సీబీఐ దూకుడు
కరూర్ తొక్కిసలాట పాపం అంతా విజయ్‌దేనా ? - తమిళనాట కలకలం రేపుతున్న సీబీఐ దూకుడు
North Korean elections: ఉత్తరకొరియా ఎన్నికల్లో 99.93 శాతం ఓట్లతో కిమ్ విజయం - ఆ కొద్ది మంది ఏమై ఉంటారో ఊహించగలరా?
ఉత్తరకొరియా ఎన్నికల్లో 99.93 శాతం ఓట్లతో కిమ్ విజయం - ఆ కొద్ది మంది ఏమై ఉంటారో ఊహించగలరా?
Dalal Street Market Crash 2026: దలాల్ స్ట్రీట్‌లో ఊచకోత!1,400 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్! హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డులో 'నైతిక' కలకలం!
దలాల్ స్ట్రీట్‌లో ఊచకోత!1,400 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్! హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డులో 'నైతిక' కలకలం!
Dhurandhar 2 OTT : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ ధురంధర్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ ధురంధర్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Anushka Shetty : అనుష్క పెళ్లి రూమర్స్ - అదే ఎందుకు హైలెట్ చేస్తున్నారంటూ టీం స్ట్రాంగ్ రియాక్షన్
అనుష్క పెళ్లి రూమర్స్ - అదే ఎందుకు హైలెట్ చేస్తున్నారంటూ టీం స్ట్రాంగ్ రియాక్షన్
YS Jagan: సీఈసీపై అభిశంసన - జగన్‌కు పెద్ద సమస్య ! మద్దతివ్వకపోతే ఓట్ల గల్లంతు,ఈవీఎంలపై ఎలా మాట్లాడగలరు?
సీఈసీపై అభిశంసన - జగన్‌కు పెద్ద సమస్య ! మద్దతివ్వకపోతే ఓట్ల గల్లంతు,ఈవీఎంలపై ఎలా మాట్లాడగలరు?
Revanth Reddy: 2029లో మళ్లీ తొక్కకపోతే చూడు! అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌కు రేవంత్ రెడ్డి సవాల్!
2029లో మళ్లీ తొక్కకపోతే చూడు! అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌కు రేవంత్ రెడ్డి సవాల్!
Andhra Pradesh Latest News: తెలుగు ప్రజలకు ఉగాది కానుక! రెగ్యులర్ రైలుగా వైజాగ్ - తిరుపతి స్పెషల్ ట్రైన్!
తెలుగు ప్రజలకు ఉగాది కానుక! రెగ్యులర్ రైలుగా వైజాగ్ - తిరుపతి స్పెషల్ ట్రైన్!
Embed widget