అన్వేషించండి

Today Top Headlines:తెలంగాణ పాలిటిక్స్‌లో ఎసిడిటి, దావోస్‌ వెళ్లిన లక్ష్యం వేరు అంటున్న సీబీఎన్‌ లాంటి టాప్‌ హెడ్‌లైన్స్‌ ఇవే

Top News: తెలంగాణలో సంచలనంగా మారుతున్న రాజకీయ ఉబ్బరంసహా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:

దావోస్‌ వెళ్లిన మోటో వేరు 

దావోస్ నుంచి ఎలాంటి పెట్టుబడులు తీసుకురాకుండానే తిరిగి వచ్చారనే విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. గతంలో హైదరాబాద్‌  ప్రమోట్ చేశామని ఇప్పుడు అమరావతి అనే కొత్త బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నామన్నారు. 27 ఫేస్‌ టూ ఫేస్‌ మీటింగ్స్‌లో పాల్గొన్నట్టు వెల్లడించారు. నాలుగు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లు, 3 కాంగ్రెస్ సమావేశాలు, ఒక యూఎన్ హాబిటెట్ సమావేశానికి హాజరైనట్టు పేర్కొన్నారు. మన దగ్గర ఉన్న అనుకూలత, ప్రభుత్వ సహకారం వ్యాపారవేత్తలకు తెలిపామన్నారు. గతంలో ఐటీ గురించి ఇప్పుడు  హ్యూమన్ మెషిన్ కొలాబరేషన్ అన్ లాకింగ్ మీద ఫోకస్ చేసినట్టు ివరించారు. ఇంకా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

పొలిటికల్ ఉబ్బరంతో ఈనోకు ఉచిత ప్రచారం 

తెలంగాణ రాజకీయాలతో ఈనోకు ఉచిత ప్రచారం లభిస్తోంది. ఇప్పటి వరకు తమను తాము ప్రచారం  చేసుకున్న ప్రభుత్వాలను చూసే ఉంటారు తొలిసారిగా ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ ఇలాంటి ప్రచారం చేయడం మాత్రం ఇదే తొలిసారి. దావోస్‌ కేంద్రంగా జరిగిన ఒప్పందాలపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ మధ్య రగులుతున్న రాజకీయంలో ఇదో కొత్త పోకడ చూస్తున్నాం. కేటీఆర్ ఫొటోలతో హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా పోస్టర్లు, హోర్డింగులు రాత్రికి రాత్రి వెలిశాయి. వీటిని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇంకా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

హనీ ట్రాప్ ముఠా అరెస్టు 

ఈ మధ్య కాలంలో ఉత్తరాంధ్ర హైటెక్ నేరాలకు కేంద్రంగా మారుతోంది. తాజాగా హనీట్రాప్‌ కేసులో అరెస్టులు సంచలనంగా మారుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన రామారావు అనే వ్యక్తిని హనీ ట్రాప్ చేసి దోపిడీకి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలతో పేరుతో వలవేసి నగదు దోచుకున్న విషయంలో ఆలస్యంగా వెలుగు చూసింది. మాయ మాటలు చెప్పి ఓ చోటుకి రమ్మని దాడి చేసి నిలువుదోపిడీ చేస్తున్నారు. కంచరపాలేనికి చెందిన ఓ వివాహితతో కలిసి ముఠా ఏర్పడిన వీళ్లంతా హనీ ట్రాప్ చేయడం ఆరంభించారు. ఇంకా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

మేమంతా క్లీన్‌ అండ్‌ వైట్‌

నాలుగు రోజులుగా సంచలనంగా మారుతున్న ఐటీ రైడ్స్‌పై అగ్ర నిర్మాత 'దిల్' రాజు క్లారిటీ ఇచ్చారు. తమ ఆఫీసులతోపాటు ఇళ్లలో జరిగిన ఐటీ రైట్స్ గురించి మీడియా సమావేశం పెట్టి చాలా విషయాలపై స్పష్టత ఇచ్చారు. తమను ఎవరు టార్గెట్ చేయలేదన్న రాజు... ప్రాసెస్‌లో భాగంగానే ఐటీ రైడ్స్‌ జరిగినట్టు వెల్లడించారు. 18 ఏళ్ల క్రితం ఒకసారి ఐటీ తనిఖీలు జరిగాయని ఇప్పుడు మళ్లీ చేశారని గుర్తు చేశారు.  తామంత క్లీన్‌గా ఉన్నామని ఎలాంటి రైడ్స్ జరిగిన వచ్చిన భయం ఏమీ లేదన్నారు. వారి కావాల్సిన లెక్కలు, ఇతర అనుమానాలపై క్లారిఫై తీసుకున్నారని వివరించారు. మీడియాలో వచ్చినట్టు తమ వద్ద 20 లక్షలకు మించిన నగదు ఇతర డాక్యుమెంట్స్‌ లభించలేదని తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

కూటమికేే మేలు

రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్సార్ సీపీ నేత వి. విజయసాయిరెడ్డి  రాజీనామా చేసి ఆమోదింపజేసుకున్నారు. రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌తో సమావేశమై రాజీనామా సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఏదైనా ఉంటే ధైర్యంగా ఎదుర్కొనే తత్వం తనదని కేసులకో, ఎవరికో భయపడే ఇలాంటివి చేలేదన్నారు. తన రాజీనామాతో కూటమికి మేలు జరుగుతుందని తెలిసనా తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇంకా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam Attack Terrorists Sketch: పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
Pahalgam Terror Attack Viral Photo: ఆ ఫోటో మనల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది… పహల్‌గామ్ దాడిలో చనిపోయిన  వ్యక్తి ఫోటో వైరల్
ఆ ఫోటో మనల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది… పహల్‌గామ్ దాడిలో చనిపోయిన  వ్యక్తి ఫోటో వైరల్
SRH vs MI: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
Mythri Distributor Sashi: తెలుగు సినిమాల కంటే డబ్బింగ్ మూవీ ఎక్కువా? టంగ్ స్లిప్ అయిన 'మైత్రీ' శశి... కరెక్ట్ కాదు సార్!
తెలుగు సినిమాల కంటే డబ్బింగ్ మూవీ ఎక్కువా? టంగ్ స్లిప్ అయిన 'మైత్రీ' శశి... కరెక్ట్ కాదు సార్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్  హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?Axar Patel Batting IPL 2025 | కీలక సమయాల్లో ఆదుకుంటున్న కెప్టెన్ ఆల్ రౌండర్KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటిKL Rahul Ignored LSG Owner Goenka | రాహుల్ కి ఇంకా కోపం లేదు..తిట్టారనే కసి మీదే ఉన్నట్లున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam Attack Terrorists Sketch: పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
Pahalgam Terror Attack Viral Photo: ఆ ఫోటో మనల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది… పహల్‌గామ్ దాడిలో చనిపోయిన  వ్యక్తి ఫోటో వైరల్
ఆ ఫోటో మనల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది… పహల్‌గామ్ దాడిలో చనిపోయిన  వ్యక్తి ఫోటో వైరల్
SRH vs MI: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
Mythri Distributor Sashi: తెలుగు సినిమాల కంటే డబ్బింగ్ మూవీ ఎక్కువా? టంగ్ స్లిప్ అయిన 'మైత్రీ' శశి... కరెక్ట్ కాదు సార్!
తెలుగు సినిమాల కంటే డబ్బింగ్ మూవీ ఎక్కువా? టంగ్ స్లిప్ అయిన 'మైత్రీ' శశి... కరెక్ట్ కాదు సార్!
Pahalgam Attack: కళ్లముందే ఉగ్రదాడి చూసి వణికిపోతున్న బాధితులు..మేమున్నాం అని ధైర్యం చెబుతున్న భారత సైన్యం!
కళ్లముందే ఉగ్రదాడి చూసి వణికిపోతున్న బాధితులు..మేమున్నాం అని ధైర్యం చెబుతున్న భారత సైన్యం!
Pranayam OTT Release Date: సైలెంట్‌గా ఆహాలోకి వచ్చిన కొత్త సినిమా... 70 ఏళ్ళ వయసులో ప్రేమలో పడితే? పెళ్లి చేసుకుంటే?
సైలెంట్‌గా ఆహాలోకి వచ్చిన కొత్త సినిమా... 70 ఏళ్ళ వయసులో ప్రేమలో పడితే? పెళ్లి చేసుకుంటే?
AP Tragedy: ఉగ్రదాడుల్లో మరణించిన ఏపీ వాసులకు మంత్రుల నివాళి, వైజాగ్ చేరుకున్న చంద్రమౌళి మృతదేహం
ఉగ్రదాడుల్లో మరణించిన ఏపీ వాసులకు మంత్రుల నివాళి, వైజాగ్ చేరుకున్న చంద్రమౌళి మృతదేహం
Pak Reaction on Pahalgam Attack: మేం ఏం చేయలేదు, పహల్గాం ఉగ్రదాడికి మోదీ ప్రభుత్వమే కారణం: పాకిస్తాన్
మేం ఏం చేయలేదు, పహల్గాం ఉగ్రదాడికి మోదీ ప్రభుత్వమే కారణం: పాకిస్తాన్
Embed widget