అన్వేషించండి

Yorkshire: చదువు మానేసి ట్రక్కు కొన్నాడు.. కోటీశ్వరుడయ్యాడు, ఇతడిది బుర్రే బుర్ర!

కరోనా చాలామందిని రోడ్డున పడేసింది. కానీ, ఇతడిని రోడ్డెక్కెలా చేసి లాభాలు తెచ్చిపెట్టింది. చదువులేని ఆ వ్యక్తి ఇప్పుడు ఏడాదికి రూ.450 కోట్లు చొప్పున సంపాదిస్తున్నాడు.

జీవితంలో ఎదగాలంటే చదువు ఎంత ముఖ్యమో తెలిసిందే. చదువుకు తెలివి తేటలు తోడైతే సక్సెస్ కూడా మన వెంటే ఉంటుంది. మంచి ఉద్యోగం, గౌరవం, హోదా లభిస్తుంది. చదువుంటే ఎక్కడైనా సరే ఏదో ఒకలా బతికేయొచ్చు. కానీ, అందరికీ చదువు మీద శ్రద్ధ ఉండదు. వారి అభిరుచులు, లక్ష్యాలు వేరుగా ఉంటాయి. తమకు నచ్చిన రంగంలో రాణించాలని కోరుకుంటారు. అయితే, ఇందుకు చాలా ధైర్యం కావాలి. తెలివితేటలు, ప్లానింగ్ కావాలి. ఎలాంటి సవాళ్లు ఎదురైనా సులభంగా ఎదుర్కొనే సత్తా ఉండాలి. ఇవన్నీ ఉన్నవాళ్లు తప్పకుండా విజయం సాధిస్తారు. ఇందుకు ఈ మిలీనియర్ ఒక ఉదాహరణ. 

అతడి పేరు స్టీవ్ పార్కిన్. యూకేలోని యార్క్‌షైర్‌కు చెందిన స్టీవ్ 1992లో 16 ఏళ్ల వయస్సులో అతడు చదువు మానేశాడు. బతుకుతెరువు కోసం ఒక హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లైసెన్స్ తీసుకున్నాడు. ముందుగా అతడు హడర్స్‌ఫీల్డ్ సంస్థకు చెందిన దుస్తుల కంపెనీలో పనిచేశాడు. ట్రక్కు నడుపుతూ సంపాదించిన మొత్తాన్ని జాగ్రత్తగా బ్యాంకులో దాచుకున్నాడు. అదే ఏడాది మరో ఇద్దరు సభ్యులతో ‘క్లిప్పర్’ అనే ఆన్‌లైన్ లాజిస్టిక్స్ కంపెనీని ప్రారంభించాడు. ఆ కంపెనీకి వచ్చే ఆర్డర్లను స్టీవ్ స్వయంగా డ్రైవింగ్ చేస్తూ డెలివరీలు చేసేవాడు. అలా వచ్చిన సొమ్ముతో మరికొన్ని లారీలను, డ్రైవర్లను పెట్టుకున్నాడు. ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లు స్వీకరించడం మొదలుపెట్టాడు. అది సక్సెస్ కావడంతో.. స్వీట్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు ఆ కంపెనీ టర్నోవర్ ఏడాదికి £45 మిలియన్ (రూ. 450 కోట్లు)కు పెరిగింది. 

కలిసొచ్చిన కరోనా: బిజినెస్ ఇన్‌సైడర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..  ‘మ్యాన్ విత్ ఏ వ్యాన్’గా గుర్తింపు పొందిన స్టీవ్ పార్కిన్ ఇప్పుడు యార్క్‌షైర్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో 10వ స్థానంలో ఉన్నాడు. అయితే, ఇతడి వ్యాపారానికి కరోనా వైరస్‌తో కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ప్రపంచంలో చాలామంది కోవిడ్-19 వల్ల ఉపాధి కోల్పోతే.. స్టీవ్ కంపెనీకి మాత్రం లాభాలు వచ్చాయి. లాక్‌డౌన్‌లో ఇళ్లల్లో చిక్కుకున్న ప్రజలకు నిత్యవసర వస్తువులను తరలించేందుకు ప్రభుత్వం క్లిప్పర్ సంస్థనే ఉపయోగించింది. అంతేగాక యూకే నలుమూలల నుంచి కూడా వీరి సంస్థకు ఆన్‌లైన్లో ఆర్డర్లు వచ్చేవి. ఫలితంగా క్లిప్పర్ సంస్థ ఆదాయం గణనీయంగా పెరిగింది.  

ఈ సంస్థ టర్నోవర్ 39.1 శాతానికి పెరిగి.. దాదాపు £700 మిలియన్లకు చేరుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అంతేగాక ఈ సంస్థలో పనిచేసే సిబ్బంది సంఖ్య కూడా అదనంగా 2 వేలకు పెరిగింది. దీంతో స్టీవ్ సంస్థలో ఇప్పుడు 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పార్కిన్ తన సంస్థలో 10 శాతాన్ని విక్రయించి.. 20 కోట్ల విలువైన షేర్లను క్యాష్ చేసుకున్నాడు. ఇప్పుడు క్లిప్పర్ సంస్థ.. ఇ-కామర్స్ లాజిస్టిక్స్ మార్కెట్‌లో ప్రముఖ స్థానానికి చేరుకుంది. పార్కిన్‌కు గుర్రపు స్వారీలంటే చాలా ఇష్టం. 2020లో అతని గుర్రం ఈగల్స్ బై డే యార్క్‌లో జాన్ స్మిత్స్ కప్‌ను గెలుచుకుంది. పార్కిన్.. ‘లీడ్స్ యునైటెడ్’ ఫుట్‌బాల్ క్లబ్ అభిమాని. గతంలో చాలాసార్లు అతడు ఆ క్లబ్‌ను సొంతం చేసుకోవాలని ఆలోచించాడట. 

Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా? ‘హ్యూమాన్జీ’ ఏమైంది?

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget