అన్వేషించండి

Discovery: మనం చనిపోయే ముందు మెదడులో ఏం జరుగుతుంది? తెలుసుకునేందుకు బ్రెయిన్‌ను మ్యాప్ చేసిన శాస్త్రవేత్తలు

ఒక రోగి చనిపోయే ముందు, తరువాత మెదడు పనితీరుపై శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయాన్ని కనిపెట్టారు.

మరణం.. ఎప్పుడు ఒక మిస్టరీనే. మరణించడానికి ముందు మన మెదడు ఏం ఆలోచిస్తుంది? మరణించాక ఏం జరుగుతుంది? ఈ రెండూ కూడా అంతుతేలనివి. వాటి అంతుతేల్చాలనే ఉద్దేశంలోనే శాస్త్రవేత్తలు ఎన్నాళ్ల నుంచో పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఓ అరుదైన అవకాశం చిక్కింది. మరణించడానికి కొన్ని నిమిషాల ముందు అతని మెదడులో ఎలాంటి మార్పులు జరిగాయో తెలుసుకునే వీలు చిక్కింది. ఎలా అంటే...

అమెరికాలో 87ఏళ్ల మూర్చరోగి ఆసుపత్రిలో చేరారు. అతని మూర్ఛలను గుర్తించడానికి వైద్యులు ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫీ (EEG) చేశారు. అయితే హఠాత్తుగా రోగి గుండెపోటుతో మరణించారు. ఇలా జరగడం వల్ల మరణిస్తున్న వ్యక్తి మెదడు ఆలోచించడాన్ని లేదా కార్యాచరణను రికార్డు చేసేందుకు శాస్త్రవేత్తలకు వీలు చిక్కేలా చేసింది. అతని మరణం, ఆ సమయంలో అతని మెదడు చేస్తున్న పనిని EEG పరికరం రికార్డు చేసింది.  ఈ పరిశోధనా వివరాలను స్కై న్యూస్ తో పాటూ, ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరో సైన్స్ జర్నల్ లో ప్రచురితమైంది. దాని ప్రకారం రోగికి అమర్చిన ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ మరణానికి ముందు, తరువాత కలిపి దాదాపు 15 నిమిషాల పాటూ మార్పులను రికార్డు చేస్తూనే ఉంది. 

ఏం కనిపెట్టారు?
 EEG మెషీన్ రోగి చివరి గుండె చప్పుడుకు ఇరువైపులా 30 సెకన్లలో మెదడులో ఒక నిర్ధిష్టరకమైన తరంగాలను కలిగిందని, అందులో పెరుగుదల అధికంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మెదడు తరంగాలను గామా తరంగాలు అంటారు. ఇవి అధునాతనమైన కాగ్నిటివ్ విధులను కలిగిఉంటాయి. అంటే ఏకాగ్రత, కలలు కనడం, ధ్యానం, జ్ఞాపకాలు, సమాచారాన్ని ప్రాసెస్ చేయడం వంటి పనుల్లో చురుకుగా పనిచేస్తాయి. శాస్త్రవేత్తల ఇచ్చిన నివేదిక ప్రకారం రోగి గుండె కొట్టుకోవడం ఆగిపోయే ముందు, తరువాత గామా తరంగాలలో పెరుగుదల కనిపించింది. అంటే చనిపోవడానికి ముందు తన జీవితం అంతా ఒక ఫ్లాష్ లా గుర్తు వచ్చి ఉండొచ్చు, జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఉండొచ్చు అని భావిస్తున్నారు పరిశోధకులు. అయితే మొత్తం ప్రక్రియను ఒక అధ్యయనంగా భావించలేమని, అనుకోకుండా బయటపడిన ఒక పరిశోధనా ఫలితంగానే చూడాలని చెప్పారు. చివరిక్షణాలలో ఏంజరుగుతుందో తెలుసుకోవాలంటే లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు, శోధించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, ఎన్నో అధ్యయనాలు చేయాల్సి వస్తుందని తెలిపారు. 

Also read: సిగరెట్ మానేయలేకపోతున్నారా? ఇవిగో ఈ చిట్కాలు పాటించి చూడండి

Also read: మధుమేహులకు బెస్ట్ ఫుడ్ కొర్రల కిచిడీ, వారానికోసారి తిన్నా ఎంతో ఆరోగ్యం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
SLBC Tunnel: SLBC టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్‌లో ఆ 50 మీటర్లే కీలకం- ఆ గండం దాటితేనే 8 ప్రాణాలు దక్కేది..!
SLBC టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్‌లో ఆ 50 మీటర్లే కీలకం- ఆ గండం దాటితేనే 8 ప్రాణాలు దక్కేది..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GV Reddy Resign Controversy | GV రెడ్డి రాజీనామాతోనైనా చంద్రబాబులో మార్పు వస్తుందా.? | ABP DesamAP Deputy CM Pawan Kalyan Speech | మొఘలులు ఓడించారనేది మన చరిత్ర అయిపోయింది | ABP DesamPastor Ajay Babu Sensational Interview | యేసును తిడుతున్నారు..అందుకే హిందువులపై మాట్లాడుతున్నాం |ABPAdani Speech Advantage Assam 2.0 | అడ్వాంటేజ్ అసోం 2.0 సమ్మిట్ లో అదానీ సంచలన ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
SLBC Tunnel: SLBC టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్‌లో ఆ 50 మీటర్లే కీలకం- ఆ గండం దాటితేనే 8 ప్రాణాలు దక్కేది..!
SLBC టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్‌లో ఆ 50 మీటర్లే కీలకం- ఆ గండం దాటితేనే 8 ప్రాణాలు దక్కేది..!
Hyderabad to Isha Foundation : మహా శివరాత్రికి ఈషా వెళ్లాలనుకుంటే ఇది ఫాలో అయిపోండి.. సెలబ్రేషన్స్, జాగరణ అంటే అసలైన అర్థమిదే
మహా శివరాత్రికి ఈషా వెళ్లాలనుకుంటే ఇది ఫాలో అయిపోండి.. సెలబ్రేషన్స్, జాగరణ అంటే అసలైన అర్థమిదే
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Telangana Latest News: రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
NTRNeel Project: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?
Embed widget