అన్వేషించండి

ఈ పండ్లు తిన్నారంటే మెరిసే చర్మం మీ సొంతం

వేసవి ఎండకి చర్మం మంటగా చికాకుగా అనిపిస్తుంది. మురికి పేరుకుపోయి మరింత ఇబ్బంది పెడుతుంది. ఆ సమస్యలన్నింటికి చెక్ పెట్టాలంటే పండ్లతో ఇలా చేయండి.

పండ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయని అనడంతో ఎటువంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ తినాలని వైద్యులు పదే పదే చెప్తుంటారు. అందుకు కారణం పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. చర్మానికి పునరుజ్జీవం ఇవ్వడంలో సహాయపడతాయి. నారింజ, బొప్పాయి, కివీస్ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి అవసరమైన కొల్లాజెన్ ని అందిస్తుంది. చర్మ నిర్మాణానికి, స్థితిస్థాపతకు అవసరమైన ప్రోటీన్ ఇది. అందుకే ఏయే పండ్లు తింటే చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయో తెలుసుకోవాలి.

శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపించాలన్నా, ఫ్రీ రాడికల్స్ తో పోరాడాలన్నా బెర్రీలు, ద్రాక్ష, దానిమ్మ వంటివి తినాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ ని అడ్డుకుంటుంది. వృద్ధాప్య ఛాయలు, చర్మ సమస్యలు రాకుండా నిరోధిస్తుంది.

హైడ్రేట్ గా ఉండేందుకు: పుచ్చకాయ, కీరదోస, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. ముడతలు, గీతలు పోగొట్టి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

చర్మ ఆకృతి కోసం: బొప్పాయి, పైనాపిల్ వంటి పండ్లలో ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి మృతకణాలను ఎక్స్ ఫోలియేట్ చేయడానికి, రంధ్రాలను అన్ లాగ్ చేయడానికి చర్మ ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

మంటని తగ్గిస్తుంది: చెర్రీస్, బ్లూ బెర్రీస్ వంటి పండ్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చర్మంలోని మంట, ఎరుపుని తగ్గించడంలో సహాయపటాయి. అందుకే ఈ వివిధ రకాల పండ్లను చేర్చుకుని తింటే మెరిసే ఛాయ, ఆరోగ్యకరమైన చర్మం పొందవచ్చు.

పండ్లు ఇలా ఉపయోగించండి..

రకరకాల పండ్లు తినాలి: ఒకే రకమైన పండు కాకుండా అన్ని రకాల పండ్లు ముక్కలు చేసుకుని తింటే మంచిది. రోజువారీ ఆహారంలో రకరకాల పండ్లు చేర్చుకోవచ్చు. బొప్పాయి, బెర్రీలు, నారింజ, కివీ, జామ, పుచ్చకాయ వంటి పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

పండ్ల మాస్క్: ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్ కోసం పండ్లు వాడుకోవచ్చు. అరటిపండు, అవకాడో లేదా స్ట్రాబెర్రీ వంటి మెత్తని పండ్లను తేనె, పెరుగు లేదా ఓట్మీల్ కలిపుకుని తీసుకుంటే మంచిది. మాస్క్ ని అప్లై చేసుకునే ముందు గోరువెచ్చని నీటితో మొహం కడుక్కోవాలి. ఫ్రూట్ మాస్క్ అప్లై చేసిన 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి.

పండ్ల నీరు: పండ్లు నానబెట్టుకుని నీటిని తీసుకోవచ్చు. నిమ్మకాయ, దోసకాయ, పుదీనా వంటివి వేసుకుని నీళ్ళు బాగా పోసుకోవాయి. ఆ నీటిని తాగితే చర్మం హైడ్రేట్ గా ఆరోగ్యంగా ఉంటుంది. తగినంత నీరు తాగడం వల్ల శరీరం నుంచి టాక్సిన్స్ బయటకి వెళతాయి.

పండ్ల రసం; చర్మానికి తాజా పండ్ల రసాన్ని కూడా రాసుకోవచ్చు. నారింజ రసాన్ని అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులోని విటమిన్ సి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: రబ్ది, జిలేబి కలిపి తింటే నిజంగానే మైగ్రేన్ నొప్పి తగ్గుతుందా?

టాప్ హెడ్ లైన్స్

Mutton Fry Recipe : ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా
ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా
Early Signs of Liver Problems : ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి
ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి
30 Minute Daily Walk : ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
Excessive Hair Fall : జుట్టు ఎక్కువగా ఊడుతోందా? ఐరన్ లోపానికి ఇవే సంకేతాలు.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
జుట్టు ఎక్కువగా ఊడుతోందా? ఐరన్ లోపానికి ఇవే సంకేతాలు.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget