అన్వేషించండి

New Study: సరిగా వండని అన్నం తింటే క్యాన్సర్ ముప్పు... ఇలా వండితే సేఫ్

మనదేశంలో ఎక్కువ మంది ఆధారపడేది వరి అన్నం మీదే. అన్నం సరిగా ఉడికించకుండా తింటే చాలా ప్రమాదమని చెబుతున్నాయి కొత్త అధ్యయనాలు.

మనదేశంలో ప్రధానమైన  ఆహారం బియ్యం. దీన్ని వండడం కూడా చాలా సులువు. మితంగా తింటే ఎంతో ఆరోగ్యం. కానీ సరిగా వండని అన్నం తినడం మాత్రం చాలా ప్రమాదకరమని కొత్త అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. కొంతమంది తక్కువ నీటితో అన్నాన్ని ఉడికిస్తారు. సరిగా ఉడక్కుండా మెతుకులు గట్టిగా అవుతాయి. అయినా సరే ఆ అన్నాన్ని తినేస్తారు. అలాగే కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అన్నం పొడిగా వచ్చేందుకు వాటిని పూర్తిగా ఉడకనివ్వరు. ఇలాంటి సరిగా వండని అన్నాన్ని తినడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువని ఓ అధ్యయనం చెబుతోంద. 

మనం తినే ఆహారాలన్నీ దాదాపు రసాయనాలతో మిళితమైనవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంటలకు చీడా పీడా పట్టకుండా క్రిమిసంహారక మందులు వాడుతూనే ఉన్నారు. ఆ మందులు మొక్కలపైనే కాదు, మట్టిపైన కూడా పడి, ఆ మట్టిలో రసాయనాలు కలిసిపోయాయి. ఇలా కొన్నేళ్ల నుంచి జరుగుతుంటే మట్టి నుంచి రసాయనాలు మొక్కల ద్వారా, పంట పై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇంగ్లాండ్ లోని క్వీన్స్ యూనివర్సిటీ వారి అధ్యయనం ప్రకారం మట్టిలోకి పరిశ్రమల వ్యర్థాల వల్ల చేరిన రసాయనాలు, పురుగుల మందుల నుంచి చేరిన రసాయనాలు కలిపి వరి పంటని ప్రమాదకరంగా మారుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఆర్సెనిక్ అనే విషతుల్యమైన రసాయనంగా మారుతుందని అధ్యయనం చెబుతోంది. 

కేవలం ఇదొక్క అధ్యయనమే కాదు పలు పరిశోధనలు అన్నం క్యాన్సర్ కారకమని పేర్కొంటున్నాయి. కాలిఫోర్నియా టీచర్స్ స్టడీ పేరుతో 90వ దశకంలో మరొక అధ్యయనం ప్రారంభించారు. వేల మంది ఈ అధ్యయనంలో భాగస్వాములయ్యారు. వారిలో 9,400 మంది క్యాన్సర్ బారిన పడ్డారు. వారిలో ఎక్కవ మందికి రొమ్ము క్యాన్సర్ లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. 

ఆర్సెనిక్ అంటే...
వివిధ ఖనిజాలలో ఉండే రసాయనం ఇది. పారిశ్రామిక పురుగుమందుల తయారీలో దీన్ని వాడుతారు. ఆహారం లేదా నీటి ద్వారా దీర్ఘకాలం ఆర్సెనిక్ ను మనం స్వీకరిస్తే అది విషంగా మారుతుంది. వాంతులు, కడుపునొప్పి, విరేచనాలతో పాటూ క్యాన్సర్ కారకం అవుతుంది. అధ్యయనం ప్రకారం బియ్యం అధికస్థాయిలో ఆర్సెనిక్ ను కలిగి ఉంది. అందుకే బియ్యాన్ని బాగా ఉడికించి తినాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవు. 

ఎలా వండితే మంచిది?
1. ఒక కప్పు బియ్యానికి అయిదు కప్పుల నీటిని జోడించాలి. అన్నం బాగా ఉడికాక, అదనపు నీరుని వడకట్టేయాలి. ఇలా పూర్వకాలంలో వండేవారు. ఇలా వండితే ఆర్సెనిక్ స్థాయి సగానికి తగ్గిపోతుంది. 
2. బియ్యాన్ని కొన్ని గంటల పాటూ నానబెట్టి తరువాత వండితే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నాన బెట్టిన నీటిని బయట పడేయాలి. ఇలా చేస్తే 80 శాతం ఆర్సెనిక్ ప్రభావం తగ్గిపోతుందని చెబుతున్నారు. ఆ పద్దతితో బియ్యం బాగా నానిపోతాయి, కనుక అన్నం ముద్దవుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
E85 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ Yamaha FZ Blue వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే
E85 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ Yamaha FZ Blue వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే
Embed widget