అన్వేషించండి

Kids: పాలిచ్చే తల్లులు వీటిని తినకపోతేనే బిడ్డకు ఆరోగ్యం

పాలిచ్చే తల్లులు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

శిశువుకు తల్లిపాలే ఆధారం. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాల మీదే ఆధారపడతారు బిడ్డలు. ఆ సమయంలో తల్లి తీసుకునే ఆహారమే వారికి అందే పోషకాలను నిర్ణయిస్తుంది. కాబట్టి బిడ్డలను దృష్టిలో ఉంచుకొని తల్లి ఆహారాన్ని తీసుకోవాలి. వారి శారీరక మానసిక ఎదుగుదలకు తగ్గ ఆహారాన్ని ఎంచుకొని తినాలి. అలాగే వారిలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని కూడా తినాలి. ఇలా వారికి పోషకాలను అందించే ఆహారాన్ని తినడంతో పాటు వారికి అనారోగ్యాలను తెచ్చిపెట్టే ఆహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. లేకుంటే పిల్లల్లో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఎంతోమందికి కాఫీ, టీలు తాగే అలవాటు ఉంటుంది. గర్భిణీలుగా ఉన్నప్పుడు, ప్రసవం అయ్యాక కూడా టీ, కాఫీలు తాగుతూనే ఉంటారు. బిడ్డకు పాలిచ్చే తల్లులు కెఫీన్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. అంటే టీ కాఫీలు తాగకపోవడమే ఉత్తమం. ఇందులో ఉండే కెఫీన్ పిల్లలకు జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది. అలాగే వారికి నిద్ర రాకుండా చేస్తుంది. చికాకును కలిగిస్తుంది. పిల్లలు తరచూ ఏడుస్తున్నారంటే మీరు ఎలాంటి ఆహారాన్ని తింటున్నారో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. కాఫీని రోజుకి ఒకసారికి మించి తాగకపోవడమే ఉత్తమం. పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది.

కొన్ని రకాల కాయగూరలను కూడా దూరంగా ఉంచాలి. పిల్లల్లో గ్యాస్టిక్ సమస్యలను తెచ్చిపెట్టే కాలీఫ్లవర్, క్యాబేజీ, దోసకాయ, బ్రకోలి వంటి వాటిని తినకపోతే ఉత్తమం. అలాగే మిరియాలు, దాల్చిన చెక్క వేసిన ఆహారానికి కూడా దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా పిల్లల జీర్ణవ్యవస్థ పై ప్రభావాన్ని చూపిస్తాయి. వారిలో అరుగుదల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విరేచనాలు కావడం వంటివి కూడా జరగొచ్చు. కాబట్టి పిల్లలు పాలు మానేసే వరకు  ఇలాంటి పదార్థాలతో వండిన ఆహారాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

మీ పిల్లలు కేవలం తల్లిపాల మీదే ఆధారపడుతున్నప్పుడు పుదీనా వేసిన ఆహారాన్ని తినకండి. ఇది పాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. కాబట్టి పాలు మానేపించే వరకు పుదీనాను దూరంగా పెట్టడం ఉత్తమం. కోడిగుడ్లు, పాలు, ఆకుకూరలు, బీట్ రూట్, క్యారెట్, చికెన్, మటన్ వంటివి తరచూ తింటుంటే పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఏవైనా కూడా అతిగా తినకూడదు. మితంగా తింటే బిడ్డకు తల్లికి ఇద్దరికీ ఆరోగ్యకరం. నువ్వుల నూనెతో వండిన వంటకాలు తింటే బిడ్డ రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. కాబట్టి బిడ్డ పాలిస్తున్నంత కాలం నువ్వుల నూనెతో వంట చేసుకోవడం ఉత్తమం.

Also read: మానసిక ఆందోళన మితిమీరిపోయిందా? అయితే అది జబ్బే

Also read: డయాబెటిస్ ఉంటే మతిమరుపు వ్యాధి త్వరగా వచ్చేస్తుందట

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

JanaSainiks on Pithapuram Sabha | నాలుగు కాదు పవన్ కళ్యాణ్ కోసం 40కిలోమీటర్లైనా నడుస్తాం | ABP DesamRayapati Aruna on Pithapuram Sabha | నాగబాబుకు MLC పదవి ఎందుకో చెప్పిన రాయపాటి అరుణ | ABP DesamFood Items Menu Janasena Pithapuram Sabha | పిఠాపురం సభలో 10వేల మందికి భోజనాలు | ABP DesamJanasena Pithapuram Sabha Arrangements | పిఠాపురంలో భారీ రేంజ్ లో జనసేన సభ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Tamannaah - Vijay Varma: ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Viral News: చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
Embed widget