అన్వేషించండి

Avoid After Meals: భోజనం తర్వాత ఈ పనులు చేశారో ఇక మీ ఆరోగ్యం మటాష్!

అన్నం తిన్న వెంటనే పడక ఎక్కేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి. అది ఎంత ప్రమాదమో తెలిస్తే ఇక మీదట మీరు అసలు అలాంటి పని చేయరు.

భోజనం చేశాక చాలా మందికి పడుకునే అలవాటు ఉంటుంది. మరికొంతమంది సిగరెట్ తాగడానికి ఇష్టపడతారు. ఇంకొంత మంది వెంటనే స్నానం చేయడానికి బయల్దేరిపోతారు. కానీ ఈ అలవాట్లు అన్నీ ఆరోగ్యానికి ఎంత హాని చేస్తాయనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని అలవాట్లు జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందుకే భోజనం చేసిన తర్వాత మీరు కూడా ఇలా చేస్తుంటే వెంటనే మానేయండి. లేదంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

నిద్ర వద్దు

భోజనం చేసిన తర్వాత నిద్రపోతే హాయిగా ఉంటుంది. కానీ అలా చేయడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఆహార అణువులు విచ్చిన్నం చేయడానికి చాలా సమయం పడుతుంది. దీని వల్ల పొట్టలో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఆహారం అరగకపోగా ఇబ్బంది పెడుతుంది. అందుకే భారీగా భోజనం చేసిన వెంటనే నిద్రకు దూరంగా ఉండటం మంచిది.

ధూమపానం వద్దు

తిన్న వెంటనే కొందరు సిగరెట్ తాగేస్తారు. కానీ అది ఆరోగ్యాన్ని, జీవక్రియను నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం భోజనం తర్వాత ధూమపానం చేయడం అంటే 10 సిగరెట్లు ఒకేసారి తాగడంతో సమానం. అంటే అది ఎంత హానికరమో మీరే ఆలోచించుకోండి.

స్నానం చేయడం

జీర్ణక్రియ ప్రక్రియని ఆలస్యం చేస్తుంది. అందుకే భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం మంచి అలవాటు కాదని ఇంట్లో వాళ్ళు చెబుతూ ఉంటారు. స్నానం చేయడం వల్ల పొట్ట చుట్టు జరిగే రక్త ప్రసరణపై తీవ్ర ప్రభావం చూపుతుంది. స్నానం చేసే సమయంలో శరీరంలోని ఇతర భాగాలకు ప్రవహిస్తుంది. జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది.

పండ్లు తినొద్దు

అన్నం తిన్న వెంటనే ఏదో ఒక పండు తినడం చాలా మందికి ఉన్న అలవాటు. పండ్లు ఆరోగ్యకరమైనవి అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ భోజనం చేసిన వెంటనే వాటిని తినడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది. పండ్లు తినడానికి ఉత్తమ సమయం భోజనానికి రెండు గంటల ముందు లేదా తిన్న రెండు గంటల తర్వాత తింటే ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయకపోగా మంచి చేస్తుంది. ఇది జీవక్రియను పెంచడంలోను సహాయపడుతుంది. పోషకాలను గ్రహించడంలో కూడా మెరుగ్గా పని చేస్తుంది.

టీ వద్దే వద్దు

టీ సాధారణంగా ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. అందులోని టీలోను కెఫీన్ ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది. భోజనం చేసిన వెంటనే ఒక కప్పు టీ తీసుకోవడం వల్ల ఆహార అణువులు విచ్చిన్నానికి ఆటంకం ఏర్పడుతుంది. ఆహారంలోని ప్రోటీన్ కంటెంట్ అజీర్ణానికి కారణమవుతుంది. అంతే కాదు భోజనం తర్వాత టీ తాగితే ఐరన్ శోషణకు ఆటంకం ఏర్పడుతుంది. అందుకే తిన్న తర్వాత పొరపాటున కూడా టీ తాగొద్దు.

 గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: చర్మానికి హాని చేసే ఆహారాలు ఇవే

టాప్ హెడ్ లైన్స్

NPPA New Drug Prices: అధిక ధరలకు చెక్.. డిప్రెషన్, డయాబెటిస్, గుండె సహా 39 మెడిసిన్ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం
అధిక ధరలకు చెక్.. డిప్రెషన్, డయాబెటిస్, గుండె సహా 39 మెడిసిన్ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
Embed widget