అన్వేషించండి

Memory: జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు

ఎంత ప్రయత్నించినా కొన్ని విషయాలు గుర్తుకు రావు. చిన్నపాటి మతిమరుపు సమస్య అందరినీ కలవరపెడుతుంది. అందుకే ఈ బ్రెయిన్ డెవలప్ మెంట్ ఫుడ్ తీసుకుంటే అటువంటి ఇబ్బంది ఉండదు.

రీక్షల టైమ్ లో ఎంత చదివినా ఖచ్చితంగా ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం గుర్తుకురాదు. కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటారు.. వెంటనే చెప్పలేదంటే దాన్ని మర్చిపోతారు. తర్వాత ఎంత గుర్తు చేసుకుందామని అనుకున్నా గుర్తుకు రాదు. ఇలా చాలా మందికి జరుగుతూనే ఉంటుంది. ఇక వయసు మళ్లిన వాళ్ళు అయితే మతిమరుపు వల్ల తీవ్ర ఇబ్బందులు కూడా పడతారు. అప్పుడే తింటారు కానీ వాళ్ళు తిన్న విషయం కూడా గుర్తు ఉండదు. ఇలా జ్ఞాపకశక్తి మందగించడం వల్ల చాలా నష్టపోవాల్సి వస్తుంది. దాన్ని అధిగమించాలంటే తగిన మీ మెమరి పెంచే పోషకాలు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇలా చెయ్యడం వల్ల మీ మెమరి పవర్ చాలా బాగుంటుంది.

శరీరానికి పోషకాహారం అవసరం అయినట్టే మెదడు కూడా సరిగా పని చెయ్యడానికి పోషకాలు అవసరం. అందుకే జ్ఞాపకశక్తిని పెంచే ఈ ఆహారాన్ని మీ డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. నెయ్యి, ఆలివ్ నూనె, వాల్‌నట్, నానబెట్టిన బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు, తాజా పండ్లు మాత్రమే కాదు కాయధాన్యాలు, పప్పు, బీన్స్, పనీర్ కూడా తినాలి. ఆయుర్వేదం ప్రకారం జీలకర్ర మెదడు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. నల్ల మిరియాలు కూడా మెదడుకి మేలు చేస్తాయి.

ఆయుర్వేద మూలికలు

ఆయుర్వేద మూలికలు మెదడులోని ధీ, ధృతి, స్మృతి అనే మూడు అభ్యాసాల సామర్థ్యాలకు మద్దతు ఇచ్చి వాటిని మెరుగుపరుస్తాయి. గోటు కోలా, అశ్వగంధ, బాకోపా వంటి ప్రత్యేకమైన మూలికలలో ఉపయోగించడం వల్ల అద్భుతమైన జ్ఞాపకశక్తి పొందవచ్చు.

యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం

మెదడు బాగా పని చేయాలంటే ఆక్సిజన్ అవసరం. అయితే అధిక ఆక్సిజన్ వినియోగం, లిపిడ్ రిచ కంటెంట్ మెదడు ఆక్సీకరణ ఒత్తిడికి గురి చేస్తాయి. ఇది శరీర కణాలలో ఫ్రీ రాడికల్స్ అధికంగా చేరడానికి దారితీస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించి మానసిక స్థితిని సమతుల్యం చేస్తుంది. పింక్, ఎరుపు రంగు పండ్లు, కూరగాయాలు, పుచ్చకాయ, టమోటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్రెయిన్ డెవలప్ మెంట్ కి తోడ్పడతాయి.

మెదడుని హైడ్రేట్ చెయ్యడానికి హెర్బల్ టీ

శరీర విధులు సక్రమంగా నిర్వర్తించడానికి తగినంత నీరు అవసరం. లేదంటే బలహీనంగా మారిపోయి శరీరం డీ హైడ్రేట్ కి గురవుతుంది. ప్రత్యేకమైన హెర్బల్ టీ తాగడం వల్ల మెదడు హైడ్రేట్ అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మానసిక శక్తి, జ్ఞాపకశక్తిని పెంచుతుందని హెర్బల్ టీ సిఫార్సు చేస్తున్నారు. హెర్బల్ టీలో హింగ్, పసుపు, అజ్వైన్, తులసి ఉన్నాయి.

బాగా నిద్రపోవాలి

నిద్రలేమి మెదడు పనితీరుని తీవ్రంగా దెబ్బ తీస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, ఆలోచన విధానాన్ని క్షీణించేలా చేస్తుంది. అందుకే ప్రతిరోజు తగినంత నిద్ర ఉండాలని వైద్యులు సూచిస్తారు. ప్రతిరోజు ఒకే సమయంలో పడుకుని ఒకే టైమ్ కి లేవడం అలవాటు చేసుకోవాలి. నిద్రలేమితో ఇబ్బంది పడుతుంటే ఆయుర్వేద మూలిక బకోపా మెదడుని శాంతపరచడానికి ఉపయోగపడుతుంది. నిద్రని ప్రోత్సహించేలా చేస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: నడవలేని స్థితిలో మైక్ టైసన్‌, ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Also Read: ‘బ్లాక్ కాఫీ’ ప్రేమలో షారుఖ్, రితేష్‌ - దీని ప్రయోజనాలు తెలిస్తే మీరూ లవ్‌లో పడిపోతారు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
ArcelorMittal Nippon Steels Plant: రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
Advertisement

వీడియోలు

Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
ArcelorMittal Nippon Steels Plant: రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
8th Pay Commission: 8వ వేతన సంఘం అమల్లోకి రాగానే DA '0' ఎందుకు అవుతుంది, ఈ విషయం మీకు తెలుసా..
8వ వేతన సంఘం అమల్లోకి రాగానే DA '0' ఎందుకు అవుతుంది, ఈ విషయం మీకు తెలుసా..
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Embed widget