అన్వేషించండి

No Cooking: అందరూ తినేందుకు రెడీ, కానీ వండేందుకు మాత్రం ఇష్టం ఉండదట

వంట చాలా ముఖ్యమైన ప్రక్రియ, కానీ అదంటే ఇష్టపడని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

కోటి విద్యలు కూటి కొరకే అంటారు. ఏ పని చేసినా చివరికి అది పొట్ట నింపుకోవడం కోసమే. పొట్ట నిండాలంటే ముందు వంట చేయాలి. తినడానికి అందరూ రెడీనే, కానీ వంట చేయడానికి మాత్రం రెడీగా లేము అని చెబుతున్నారు ఎంతోమంది. ఎంతమందికి వంట చేయడం ఇష్టం లేదో తెలుసుకోవడం కోసం అమెరికాలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో వంట చేయడం ఇష్టం లేదని ప్రతి వందమందిలో 30 మంది చెప్పారు. వంట చేయడం కన్నా యుద్దానికి వెళ్లడమే సులువు అని కూడా కామెంట్లు చేస్తున్నారు. వంట చేయడం వల్ల చాలా అలసిపోతామని, రోజూ వండడం చాలా బోరింగ్ విషయమని వివరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేలో కూడా 29 శాతం మంది వంట చేయడం ఇష్టం లేదని ఒప్పుకున్నారు. రోజూ వంట చేసే వారిలో ఎంతోమంది తమ ఇంట్లోని ఇతరులను ఒక్కరోజైనా వంట చేయమని అడుగుతూ ఉంటారట. దానికి కారణం రోజూ వంట చేస్తే బోరింగ్ గా ఉంటుందని, తమ వంట తామే తినడం ఇంకా బోరింగ్ గా ఉందని వారు చెబుతున్నారు. 

వంట చేయడం కష్టంగా అనిపించే రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ఆహారాలను అధికంగా కొని తినేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. ప్రపంచంలో 42 శాతం మంది వంటగదిలోకి వెళ్లడంతోనే అలసటగా ఫీల్ అయిపోతారని అంటున్నారు. ఎంతోమందికి పాస్తా, సుషీ, నూడుల్స్ వంటివి ఇష్టం. వాటిని తయారు చేసుకోవడానికి కూడా వారు భయపడుతుంటామని చెబుతున్నారు. ఆ భయానికి కారణం వంట బోరింగ్ గా అనిపించడమేనని వివరిస్తున్నారు.

వంట చేయడం అనేది ఆధునిక తరంలో కష్టమైన ప్రక్రియగా భావిస్తోంది యువత. ఇప్పటికీ ఎన్నో ఇళ్లల్లో పెద్దవారే చక్కగా వంట చేస్తున్నారు. నేటి కాలం కోడళ్ళు వంట చేసే తీరే మారిపోయింది. సులువుగా ఐదు నిమిషాల్లో తయారయ్యే వంటకాలను చేసి పెట్టేస్తున్నారు. వాటిని తినడం వల్ల అనారోగ్యమే తప్పా ఆరోగ్య ప్రయోజనాలు సున్నా. నిజానికి వంట చేయడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికాలోని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీలో అధ్యయనాన్ని నిర్వహించారు. 

ఒత్తిడిని తగ్గించే ఔషధాల్లో వంట కూడా ఒకటని చెప్పారు పరిశోధనకర్తలు. వంట చేయడం మొదలుపెడితే వారికి తెలియక ఉండాలి. ఒత్తిడి పోతుందని దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. ఎవరికైతే మానసిక ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటారో వారు రోజూ వంట చేయడం అలవాటు చేసుకోవాలి. వంట చేయడం వల్ల తమపై తమకు విశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే ఇంట్లోని ఆహారపు అలవాట్లు కూడా మారుతాయి. అందరూ ఆరోగ్యకరమైన భోజనాన్ని తింటారు. దీని వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లోనే మనుషులంతా ఇలా ఆరోగ్యంగా ఉంటే ఇల్లు కూడా కళకళలాడిపోతుంది. 

Also read: చల్లదనం కోసం ఏసీలో ఎక్కువగా ఉంటున్నారా? మీ చర్మంపై ఈ మార్పులు తప్పవు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Thyroid Weight Loss Tips : థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం కష్టమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం కష్టమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Joining in Hostel : మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget