అన్వేషించండి

Turmeric Water : రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు

Health Alert : పసుపు ఆరోగ్యానికి మంచిది. కానీ సరైన మోతాదులో తీసుకోకుంటే కాలేయం, ఐరన్, కిడ్నీలు, రక్తంలో చక్కెరపై చెడు ప్రభావం చూపుతుందని అంటున్నారు. వీటిలో నిజమెంత?

Turmeric Water Side Effects : ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ ఉదయం పసుపు నీరు తీసుకుంటారు కొందరు. పసుపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొన్ని వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులను దూరం చేసే సూపర్​ ఫుడ్​గా చెప్పవచ్చు. అయితే దీనిని సరైన మోతాదులో తీసుకోకుంటే లాభాల కంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు నిపుణులు. అంటే ప్రతిరోజూ అవసరమైన దానికంటే ఎక్కువ పసుపు నీరు తాగితే.. దానివల్ల కలిగే అనేక నష్టాలు శరీరంలో కనిపిస్తాయట. పసుపులో ఉండే కర్కుమిన్ అధిక మొత్తంలో శరీరంలోకి వెళితే.. అది కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుందట. అంతేకాకుండా ఎసిడిటీ, నొప్పి, గ్యాస్, మంట వంటి కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని చెప్తున్నారు.

ఐరన్ లోపం 

పసుపు శరీరంలో ఐరన్ శోషణను తగ్గిస్తుంది. అంటే మీరు ఎక్కువ మొత్తంలో పసుపు తీసుకుంటే.. ఆహారంలో ఉండే ఐరన్ శరీరానికి సరిగ్గా అందదు. దీనివల్ల రక్తహీనత సమస్య వస్తుంది. అందుకే ఇప్పటికే ఐరన్ లోపం లేదా రక్తహీనత సమస్య ఉన్నవారికి పసుపు ఎక్కువగా తీసుకోవడం హానికరం.

కాలేయంపై ప్రభావం

పసుపును పాలతో అయినా లేదా నీటితో అయినా.. కలిపి ఎక్కువగా తీసుకుంటే.. కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాలేయం మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది రక్తాన్ని శుభ్రపరచడానికి, ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అవసరమైన దానికంటే ఎక్కువ పసుపు కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.

చర్మ సమస్యలు

ఎక్కువ మొత్తంలో పసుపు నీరు తాగడం లేదా పచ్చి పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, ఇతర చర్మ వ్యాధులు వస్తాయి.

కిడ్నీలో రాళ్ల ప్రమాదం

మీకు కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే.. పసుపును ఎక్కువగా తీసుకుంటున్నారా లేదా అని ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. పసుపులో ఆక్సలేట్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరంలో అధిక మొత్తంలోకి ప్రవేశించినప్పుడు.. కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలేట్​ను ఏర్పరుస్తుంది. ఇది కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. పసుపు పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది. కానీ ప్రతిరోజూ అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోవడం కిడ్నీలపై ప్రభావం చూపుతుంది.

రక్తంలో చక్కెరపై ప్రభావం

పరిశోధన ప్రకారం పసుపు నీరు అధిక రక్త చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. సరైన మోతాదులో పసుపు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర, రక్తపోటు స్థాయిలను సమతుల్యం చేస్తుంది. కానీ మీరు ఎక్కువ మొత్తంలో పసుపు నీరు తీసుకుంటే అది రక్తంలో చక్కెర స్థాయిని అవసరమైన దానికంటే ఎక్కువగా తగ్గించవచ్చు. ఇది ప్రమాదకరంగా ఉంటుంది.

రక్తం పలుచబడటం

పసుపు సహజంగానే రక్తాన్ని పలుచగా చేస్తుంది. కానీ మీరు ఇప్పటికే రక్తం పలుచబడే మందులు తీసుకుంటుంటే.. పసుపును చాలా పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఎక్కువ పసుపు తీసుకోవడం వల్ల రక్తస్రావం వంటి సమస్యలు వస్తాయి.

ఎంత మోతాదులో తీసుకోవాలి?

పసుపు మన ఆరోగ్యానికి అవసరం. ఆయుర్వేదం, వైద్య శాస్త్రం రెండూ దీనిని ఉపయోగకరంగానే చెప్తాయి. కానీ మీరు ప్రతిరోజూ పసుపు నీటిని మందులా తీసుకుంటే.. అది శరీరంలో అనేక వ్యాధులకు కారణం కావచ్చు. కాబట్టి ఆరోగ్య ప్రయోజనాల కోసం పసుపు నీరు తాగాలనుకుంటే.. దాని పరిమాణాన్ని పరిమితం చేయండి. ప్రతిరోజూ ఒక చిటికెడు లేదా అర టీస్పూన్ పసుపును శరీరానికి అందించండి. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Post-Festival Health Guide : హోలీ తర్వాత ఉబ్బరం, షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయా? ఈ టిప్స్​తో శరీరాన్ని రీసెట్ చేసుకోండి
హోలీ తర్వాత ఉబ్బరం, షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయా? ఈ టిప్స్​తో శరీరాన్ని రీసెట్ చేసుకోండి
Heaviest Baby Born : 5.9 కిలోల ‘సూపర్ బేబీ’.. ఆసుపత్రిలో పుట్టిన వెంటనే రికార్డు, ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
5.9 కిలోల ‘సూపర్ బేబీ’.. ఆసుపత్రిలో పుట్టిన వెంటనే రికార్డు, ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
AI for Income : AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
Holi 2026 : హోలీ ఆడక ముందు, ఆడిన తర్వాత ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. రంగులు సులభంగా వదిలిపోతాయి, స్కిన్ డ్యామేజ్ కాదు
హోలీ ఆడక ముందు, ఆడిన తర్వాత ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. రంగులు సులభంగా వదిలిపోతాయి, స్కిన్ డ్యామేజ్ కాదు
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Embed widget