News
News
వీడియోలు ఆటలు
X

Leftover Food: ఆయుర్వేదం ప్రకారం మిగిలిపోయిన ఆహారాన్ని ఎన్ని గంటల్లోపు తినాలో తెలుసా?

ఆహారం మిగిలిపోవడం అనేది ప్రతి ఇంట్లో జరిగేదే. అయితే ఆ ఆహారాన్ని తినడానికి నిర్దిష్ట సమయం ఉంది.

FOLLOW US: 
Share:

ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదు, అందుకే మిగిలేటట్టే ఆహారం వండుకుంటారు. తిన్నాక మిగిలిన ఆహారాన్ని దాచుకొని మళ్ళీ తింటూ ఉంటారు. ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమే. అయితే ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని ఎన్ని గంటల్లోపు తినాలో ఆయుర్వేదం వివరిస్తోంది. దాని తాజాదనం, రుచి ఆహారం ఎంతవరకు నిలుపుకుంటుందో ఆ సమయంలోపే అని తినేయాలని చెబుతోంది. తాజాదనం పోతే ఆ పాత ఆహారం అనారోగ్యాలకు కారణం అవుతుందని వివరిస్తోంది ఆయుర్వేదం. 

సైన్స్ చెబుతున్న ప్రకారం మిగిలిపోయిన ఆహారాన్ని 15 సెకండ్ల పాటు అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే చాలు, ఆహారంలో ఉన్న వ్యాధికారక బ్యాక్టీరియాను చంపవచ్చు. తాజాదనం కూడా మళ్లీ ఆహారానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆయుర్వేదం ప్రకారం మాత్రం వండిన ఆహారాన్ని మూడు గంటల్లోపు తింటే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆ తర్వాత పోషక విలువలు తగ్గే అవకాశం ఉంది. ఇక మిగిలిపోయిన ఆహారాన్ని అయితే 24 గంటల్లోపు తినాలి. 24 గంటల తరువాత నిల్వ ఉన్న ఆహారాన్ని తింటే వాటిలోని పోషకాలు తగ్గిపోతాయి. అంతేకాదు అలాంటి ఆహారంలో బ్యాక్టిరియా అభివృద్ధి చెందడం మొదలైపోతుంది. ఈ మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడిచేసినా  కూడా ఆ బ్యాక్టిరియా పోయే అవకాశం లేదు. ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల అజీర్ణం, ఉబ్బరం, శరీరంలో దోషాలు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని తినేవారిలో పేగు ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. పేగు రోగాలు వచ్చే అవకాశం ఉంది. 

ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం ఆహారాన్ని శీతలీకరించి, మళ్లీ వేడి చేయడం వల్ల ఆహారంలోని పోషక విలువలు తగ్గవచ్చు. కాబట్టి తాజాగా తయారు చేసిన ఆహారాన్ని మూడు గంటల్లోపు తినేయాలి. తాజా ఆహారం ప్రాణాన్ని పోషిస్తుందని. జఠరాగ్నిని అంటే జీర్ణంలోని వేడిని పెంచుతుందని నమ్ముతారు. తాజాగా వండిన ఆహారాన్ని నిల్వ ఉంచడం, మళ్ళీ అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వంటివి తినవచ్చు. కానీ మరీ పాత ఆహారాన్ని తినకపోవడం మంచిది. లేకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సులు అధికంగా ఉన్నాయి.  

మిగిలిపోయిన ఆహారం విషయంలో గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. 
1. ఆహారం వండాక గంటన్నరలో తింటే రుచిగా ఉంటుంది. 
2. ఆహారం పూర్తిగా చల్లారాకే ఫ్రిజ్ లో పెట్టాలి. 
3. మాంసం, పాలతో చేసిన వంటకాలు, సముద్ర ఆహారం వంటివి నిల్వ చేయకుండా తినేయడమే మంచిది. 
4. ఏదేమైనా తాజా ఆహారం తింటే మంచిది. ఇది మన శరీరానికి, శ్వాసకు ఎంతో మేలు చేస్తుంది. 

Also read: వ్యక్తి మరణించే ముందు ఒక్కొక్కటిగా ఈ లక్షణాలను కోల్పోతూ ఉంటాడు - స్టాన్‌‌ఫొర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Published at : 24 Apr 2023 10:19 AM (IST) Tags: Eating Ayurvedam Leftover rice Leftover food

సంబంధిత కథనాలు

వేసవిలో షవర్, బాత్ టబ్‌లో స్నానం యమ డేంజర్ - ఈ బ్యాక్టీరియా ప్రాణం తీస్తుందట!

వేసవిలో షవర్, బాత్ టబ్‌లో స్నానం యమ డేంజర్ - ఈ బ్యాక్టీరియా ప్రాణం తీస్తుందట!

Thick Hair Tips: ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు

Thick Hair Tips: ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు

Sleeping Rules in Shastra: దిండు కింద వీటిని పెట్టుకుని పడుకోవడం పెద్ద తప్పు!

Sleeping Rules in Shastra: దిండు కింద వీటిని పెట్టుకుని పడుకోవడం పెద్ద తప్పు!

గుండె జబ్బుల నివారణకు మంచి పరిష్కారం ఈ జ్యూస్

గుండె జబ్బుల నివారణకు మంచి పరిష్కారం ఈ జ్యూస్

High Cholesterol: కొవ్వుతో జర భద్రం - ఈ లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ ప్రమాదం పెరుగుతోందని అర్థం!

High Cholesterol: కొవ్వుతో జర భద్రం - ఈ లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ ప్రమాదం పెరుగుతోందని అర్థం!

టాప్ స్టోరీస్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

YSRCP News :  రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్