అన్వేషించండి

New Study: అలాంటి తల్లులకు శుభవార్త.. వారి పాలల్లో పది నెలల పాటూ యాంటీ బాడీలు, బిడ్డలకు రక్ష

అనేకమంది పాలిచ్చే తల్లుల్లు కరోనా బారిన పడి తేరుకున్నారు. ఇప్పుడు అలాంటి తల్లులకు కొత్త అధ్యయనం ఓ శుభవార్తను మోసుకొచ్చింది.

గత రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. లక్షల మంది కరోనా బారిన పడ్డారు. వారిలో కాబోయే తల్లులు, చంటి బిడ్డల అమ్మలు కూడా ఉన్నారు.  వారిలో చాలా మంది కరోనా నెగిటివ్ వచ్చాక కూడా పిల్లలకు పాలిచ్చేందుకు భయపడుతున్నారు. అలాంటివారికి ఓ అధ్యయనం శుభవార్తను చెబుతోంది. కరోనా వచ్చి తగ్గిన తల్లుల రొమ్ముపాలల్లో దాదాపు పదినెలల పాటూ కరోనా వైరస్ ను న్యూట్రలైజ్ చేసే యాంటీ బాడీలు కలిగి ఉంటాయని కొత్త పరిశోధన తేల్చింది. కాబట్టి తల్లి పాల ద్వారా పిల్లలకు కూడా ఆ యాంటీబాడీలు చేరే అవకాశం ఉంది. దీనివల్ల ఆ చంటి బిడ్డలు కరోనాను తట్టుకునే శక్తిని మరింత పుంజుకుంటారు. కాబట్టి కరోనా నుంచి తేరుకున్న తల్లులు ఎలాంటి సందేహం లేకుండా పిల్లలకు పాలివ్వడం మంచిదే. 

న్యూయార్క్ కు చెందిన మౌంట్ సినాయ్ ఆసుపత్రికి చెందిన రెబెక్కా పావెల్ ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు. ఆమె బృందం కోవిడ్ 19 నుంచి కోలుకున్న 75 మంది తల్లుల నుంచి తల్లి పాల నమూనాలను సేకరించింద. వారి విశ్లేషణలో 88 శాతం పాలలో కరోనా వైరస్ ను నిరోధించగల యాంటీబాడీలు ఉన్నాయని కనుగొన్నారు. ఆ పాలల్లో ‘ఇమ్యునోగ్లోబిన్ ఎ’ అనబడే యాంటీబాడీని గుర్తించారు. ఇది పాలు తాగిన పిల్లల శ్వాసకోశ, పేగు గొట్టాల గోడలకు అంటుకుని ఉండి, వైరస్ ను శరీరంలో చేరకుండా అడ్డుకుంటుందని వారి పరిశోధనలో తేలింది. అంతేకాదు ఆ ప్రతిరోధకాలు తల్లి పాలల్లో దాదాపు పదినెలల పాటూ ఉంటాయని గుర్తించారు. 

కరోనా వచ్చి తగ్గాక ఆ తల్లుల్లో సాధారణంగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. ఆ తల్లులు టీకా కూడా వేయించుకుంటే యాంటీ బాడీలు ప్రేరేపణకు గురవుతాయి. మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి.  కరోనా నుంచి కోలుకుని, టీకా కూడా వేయించుకున్న పసిబిడ్డల తల్లులు యాంటీబాడీలను భవిష్యత్ తరాలకు అందించే మహత్తరమైన పనిని కొనసాగించగలరని అభిప్రాయపడుతున్నారు అధ్యయన సారథి రెబెక్కా. 

ముఖ్య గమనిక: అధ్యయనం వివరాలను యథావిధిగా అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు. మీ ఆరోగ్యం, డైట్ కు సంబంధించిన ఏ సందేహాలున్నా వైద్యుడిని సంప్రదించగలరు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Also read: కుంభకర్ణుడి విలేజ్.. రోజుల పాటూ నిద్రపోయే గ్రామస్థులు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

Also read: ఈ ఆహారాలు క్యాన్సర్ కారకాలుగా మారచ్చు... జాగ్రత్త పడండి

Also read: ఇంట్లో దోమలు ఎక్కువయ్యాయా... వెల్లుల్లితో తరిమికొట్టండి

టాప్ హెడ్ లైన్స్

Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
Why To Avoid Salads In Monsoon:వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
Embed widget