అన్వేషించండి

Breast Cancer Awareness Month : మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల పెరుగుతోన్న మరణాలు.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

Breast Cancer : రొమ్ము క్యాన్సర్​పై అవగాహన కల్పిస్తూ.. ఏటా అక్టోబర్ నెలను Breast Cancer Awareness Month​గా నిర్వహిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సలేమిటో ఇప్పుడు చూసేద్దాం. 

October is Breast Cancer Awareness Month : రొమ్ము కణాల్లో కణితులు ఏర్పడి.. ట్యూమర్లుగా మారి.. శరీరమంతా వ్యాపించి ప్రాణాంతకంగా మారుతాయి. దీనిని బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization) లెక్కల ప్రకారం.. 2022లో ప్రపంచ వ్యాప్తంగా 6,70,000 మహిళలు రొమ్ము క్యాన్సర్​తో మృత్యుబారినపడ్డారు. ఈ క్యాన్సర్ మహిళల్లో అత్యంత సాధారణమైన క్యాన్సర్​గా మారిపోయింది. ముఖ్యంగా క్యాన్సర్ ద్వారా మహిళల్లో సంభవించే మరణాల్లో ఇది రెండో ప్రధాన కారణంగా మారింది. 12 మంది మహిళల్లో 1 ఈ క్యాన్సర్​తో ఇబ్బంది పడుతుంటే.. 71 మంది మహిళల్లో ఒకరు మరణిస్తున్నారట. 

ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏటా అక్టోబర్​నెలలో రొమ్ముక్యాన్సర్​పై అవగాహన కల్పిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్​పై అవగాహన కల్పించే నెలగా అక్టోబర్​ను మార్చారు. ప్రతి సంవత్సరం రొమ్ము క్యాన్సర్​పై ప్రజలకు వివిధ అంశాలను గురించి చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వస్తే ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని చికిత్సలు తీసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. 

ట్యూమర్ ఎలా స్టార్ట్ అవుతుందంటే.. 

క్యాన్సర్​ కణాలు పాల నాళాలు లేదా పాలను ఉత్పత్తి చేసే లోబుల్స్​ లోపల ప్రారంభమవుతాయి. ప్రారంభ దశల్లోనే వీటిని గుర్తించవచ్చు. ఇవి సమీపంలోని రొమ్ము కణజాలంలోకి వ్యాప్తి చెందుతాయి. ఇవి గడ్డలుగా మారి.. కణితులు అవుతాయి. ఇవి శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించి.. ప్రాణాంతకమవుతాయి. యుక్త వయసు తర్వాత ఏ వయసులోనైనా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ సంభవించవచ్చు. పురుషల్లో ఇది 0.5 శాతంగా ఉంటుంది. 

లక్షణాలివే.. 

బ్రెస్ట్ క్యాన్సర్​ను ప్రారంభంలోనే గుర్తిస్తే చికిత్సతో దానిని క్యూర్ చేసుకోవచ్చు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్​ గుర్తించడానికి కొన్ని సంకేతాలుంటాయి. రొమ్ము ముద్దగా లేదా గట్టిగా మారుతుంది. రొమ్ము పరిమాణంలో మార్పులు వస్తాయి. బ్రెస్ట్​పై ఎర్రని మచ్చలు, గుంటలు, స్కిన్​లో మార్పులు వస్తాయి. చనుమొన రూపం మారి.. రక్తం లేదా కొన్ని రకాల ద్రవాలు వస్తాయి. కొందరిలో గడ్డ ఏర్పడిన నొప్పి రాదు. అలాంటివారు వైద్యుల సహాయం తీసుకుంటే క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. 

బ్రెస్ట్​లో మొదలయ్యే ఈ క్యాన్సర్ కణాలను గుర్తించకుంటే.. అవి ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు, ఎముకలతో సహా అన్ని అవయవాలకు వ్యాపిస్తాయి. దీనివల్ల పరిస్థితి తీవ్రమవుతుంది. రోగి చనిపోయే అవకాశాలు ఎక్కువ అవుతాయి. అందుకే వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకుంటే ఈ క్యాన్సర్​ను దూరం చేసుకోవచ్చు. లేదంటే ప్రాణాంతకమవుతుంది. 

చికిత్స ఇదే.. 

రొమ్ము క్యాన్సర్​కు చికిత్స అనేది.. క్యాన్సర్ కణాలు శరీరంలో ఎంతవరకు వ్యాపించాయి అనేదానిపై ఆధారపడి ఉంటుంది. బ్రెస్ట్ వెలుపల కణుపులు ఉంటే.. స్టేజ్ 2, స్టేజ్ 3 అంటారు. అదే శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తే స్టేజ్ 4 అవుతుంది. వీటిని బట్టే చికిత్సల్లో మార్పులు ఉంటాయి. క్యాన్సర్​ తిరిగే వచ్చే అవకాశాలు లేకుండా చికిత్సను అందించేందుకు వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. 

చికిత్స తీసుకునే వ్యక్తి క్యాన్సర్ రకం, దాని వ్యాప్తిపై ఆధారపడి ఉంటుంది. శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, మందులు వంటివాటితో క్యాన్సర్​ను కంట్రోల్ చేసేందుకు చూస్తారు. హార్మోన్ ట్రీట్​మెంట్, కీమోథెరపీ లేదా టార్గెటెడ్ బయోలాజికల్ థెరపీలతో సహా వ్యాప్తిని నిరోధించడానికి మందులు ఇస్తారు. 

టార్గెట్ ఇదే.. 

బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలను ఏటా 2.5 శాతం తగ్గించాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇనిషియేటివ్ లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. 2020 నుంచి 2040 మధ్య 2.5 మిలియన్ల రొమ్ము క్యాన్సర్ మరణాలను నివారించాలనే ఉద్దేశంతో అక్టోబర్​లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ అంశంపై మహిళల్లో అవగాహన పెంచే విధంగా ప్రోత్సాహిస్తున్నారు. బ్రెస్ట్​ క్యాన్సర్​ను ముందుగా గుర్తిస్తే మనుగడ రేటు పెరుగుతుందనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. 

Also Read : కొవ్వును కరిగించే హెల్తీ డ్రింక్స్.. బరువును తగ్గించి ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యూలర్​గా తాగొచ్చు

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget