అన్వేషించండి

Indian Food: భారతీయులు ఏం తింటున్నారు? ఎంత తింటున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Indian Food Habbits | గృహ వినియోగవ్యయం 2022-23 మధ్య ఎలా ఉందనే విషయం గురించి ఐదుగురు ఆర్థికవేత్తల బృందం ఒక సర్వే నిర్వహించి లోతైన విశ్లేషణను అందించింది. ఆ వివరాలు.

Indians Food Expenditure | భారతదేశం ఏం తింటోంది? అనే విషయం గురించి సర్వే చేసినపుడు ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగుచూశాయని చెప్పవచ్చు. మొత్తం ఇంటి ఖర్చులో ఆహారం కోసం చేసే వ్యయం ఇది వరకటితో పోలిస్తే 50 శాతం వరకు తగ్గిపోయిందట. మొత్తం నెల వారీ వ్యయంలో సగం కంటే తక్కువే ఆహారం కోసం ఖర్చు చేస్తున్నారట. తృణధాన్యాలు, కూరగాయల వినియోగం బాగా తగ్గిందట. కానీ పండ్లు, పాలు, పాలు, పాల ఉత్పత్తులు, గడ్లు, ఇతర మాంసాహారాల వినియోగం పెరిగింది. నిజానికి ప్యాక్డ్, ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం గణనీయంగా పెరిగిందట. తృణధాన్యాలు, కూరగాయల నుంచి భారతీయ కుటుంబాలు మాంసాహారం, ప్యాక్డ్ ఆహారాల వైపు భారీగా మళ్లినట్టు గుర్తించారు.

షమిక రవి, ముదిత్ కపూర్, డాక్టర్ శంకర్ రంజన్, డాక్టర్ గౌరవ్ ధమిజా, డాక్టర్ నేహా సరీన్ ల ఆర్థికవేత్తల బృందం ఈ గృహవినియోగ సర్వే నిర్వహించింది. భారతీయ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఆహార వినియోగ విధానాలను అధ్యయనం చేశారు.

ఆహార వినియోగ వ్యయం ఎంత తగ్గింది?

గ్రామీణ ప్రాంతాల్లో గృహ వ్యయాల్లో ఆహార వ్యయం వాటా 2011-12లో 55.7% ఉండగా, 2022-23లో ఇది 48.6%కి తగ్గింది. ఈ తగ్గుదల వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో భిన్నంగా కనిపించింది. ఉదాహరణకు, తమిళనాడులో ఇది 55.4% నుండి 44.2%కి, అంటే 10.2 శాతం పాయింట్లు తగ్గింది, అలాగే పంజాబ్‌లో 4.2 శాతం పాయింట్లు తగ్గి 48.3% నుండి 44.1%కి వచ్చింది.

పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ తగ్గుదల కనిపించింది, 48% నుండి 41.9%కి పడిపోయింది. ఉత్తరాది ప్రాంతాల్లో ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా 9.6 శాతం పాయింట్లు తగ్గుదల 49.1% నుండి 39.5%కి జరిగింది. మేఘాలయలో స్వల్పంగా 43.4% నుండి 42.5%కి, అంటే 0.9 శాతం పాయింట్లు మాత్రమే తగ్గింది.

గ్రామీణ ప్రాంతాలలో 20 శాతం కుటుంబాల ఆహార వ్యయాల్లో సగటు వాటా 59.6% నుండి 52.1%కి, అంటే 6.5 శాతం పాయింట్లు తగ్గినట్లు గుర్తించారు. అలాగే, పట్టణ ప్రాంతాలలో 20 శాతం కుటుంబాలు కూడా వారి ఆహార వ్యయం 56.9% నుండి 48.9%కి తగ్గించుకున్నారట.

గ్రామీణ ప్రాంతాల్లో పండ్ల కంటే పాన్, పొగాకు, మద్యం వంటి వ్యసనాలకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.

సగటున, ఇళ్లలో  ధాన్యాల వాడకం గణనీయంగా తగ్గింది, అలాగే కూరగాయల వ్యయం కూడా కొంత తగ్గింది. అయితే, పాలు, పాల ఉత్పత్తులు, తాజా పండ్లు, గుడ్లు, చేపలు, మాంసం వంటి వస్తువులపై వ్యయం పెరిగింది, అంటే ఈ వస్తువుల వినియోగం పెరిగినట్లు సూచిస్తోంది.

విషాదం ఏంటంటే పాన్, పొగాకు, మత్తుపదార్థాలపై వ్యయం 2.7% నుండి 3.2%కి పెరిగింది. గ్రామీణ గృహాలు పండ్ల కంటే వీటి పై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. వీరు పానీయాలు, ప్యాకేజ్డ్ మరియు ప్రాసెస్‌డ్ ఫుడ్స్‌పై కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.

గ్రామీణ, పట్టణ గృహాల్లో టాప్ 20% మరియు బాటమ్ 20% మధ్య గల వ్యత్యాసంలో కూడా తగ్గుదల కనిపిస్తోంది.

గ్రామీణ గృహాలలో గుడ్లు, చేపలు, మాంసం వంటి వాటి వినియోగం 64.4% నుండి 80.2%కి పెరిగింది, బాటమ్ 20% లో 58.3% నుండి 78.5%కి, సుమారు 20 శాతం పాయింట్ల మేరకు గణనీయమైన పెరుగుదల కనిపించింది. పట్టణ గృహాల విషయంలో కూడా ఇదే విధమైన ధోరణి కనిపించింది, అంటే టాప్ 20% మరియు బాటమ్ 20% మధ్య వ్యత్యాసం తగ్గింది. సగటున ఒకవ్యక్తి గుడ్లు, చేపలు, మాంసం వినియోగం 2011-12 నుండి 2022-23 లో 0.7 కిలోల నుండి 1.1 కిలోల వరకు పెరిగింది, ఇది సుమారు 57% వృద్ధిని సూచిస్తుంది.

 

టాప్ హెడ్ లైన్స్

NPPA New Drug Prices: అధిక ధరలకు చెక్.. డిప్రెషన్, డయాబెటిస్, గుండె సహా 39 మెడిసిన్ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం
అధిక ధరలకు చెక్.. డిప్రెషన్, డయాబెటిస్, గుండె సహా 39 మెడిసిన్ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Arya: హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Embed widget