అన్వేషించండి

SBI PO: ఎస్‌బీఐ పీవో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

ఎస్‌బీఐ పీవో పోస్టుల భర్తీకి సెప్టెంబరు 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 27 వ‌ర‌కు దరఖాస్తులు సమర్పించవచ్చు.

'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి  సెప్టెంబరు 6న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2,000 పీవో పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 27 వ‌ర‌కు దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

వివరాలు..

* ప్రొబేషనరీ ఆఫీసర్

ఖాళీల సంఖ్య: 2,000 పోస్టులు

పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 300, ఎస్టీ- 150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్‌- 200, యూఆర్‌- 810.

అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.04.2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీత భత్యాలు: నెలకు బేసిక్‌ పే రూ.41,960.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు/ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 07.09.2023 నుంచి 27.09.2023 వరకు.

➥ దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 07.09.2023 నుంచి 27.09.2023 వరకు.

➥ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2023, అక్టోబర్‌ రెండో వారంలో ప్రారంభం.

➥ స్టేజ్‌ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్‌ 2023.

➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: నవంబర్‌, డిసెంబర్ 2023.

➥ మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: నవంబర్‌/ డిసెంబర్‌ 2023.

➥ స్టేజ్‌ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్‌: డిసెంబర్‌ 2023/ జనవరి 2024.

➥ ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబర్‌ 2023/ జనవరి 2024.

➥ ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి/ ఫిబ్రవరి 2024.

➥ ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: జనవరి/ ఫిబ్రవరి 2024.

➥ ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌ తేదీలు: జనవరి/ ఫిబ్రవరి 2024.

➥ తుది ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి/ మార్చి 2024.

ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2023, అక్టోబరు మొదటివారం నుంచి.

ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ నిర్వహణ: 2023, అక్టోబరు రెండోవారం నుంచి.

Notification

Online Application

ALSO READ:

ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2024 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలిలా
న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను సెప్టెంబరు 6న విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 6న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు సెప్టెంబరు 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan:
"ఉత్తరాంధ్రను డంపింగ్ ప్రాంతంగా మార్చేశారని ప్రజలు బాధపడుతున్నారు" కాలుష్యంపై పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Chairman: కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ నిర్దారించలేదు - చార్జిషీట్‌లో లోపాలు - టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ నిర్దారించలేదు - చార్జిషీట్‌లో లోపాలు - టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
C J Roy suicide: బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్త ఆత్మహత్య - ఐటీ అధికారుల విచారణ తర్వాత ప్రాణం తీసుకున్న సీజే రాయ్
బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్త ఆత్మహత్య - ఐటీ అధికారుల విచారణ తర్వాత ప్రాణం తీసుకున్న సీజే రాయ్
CM Revanth : హార్వార్డ్ లో 21వ శతాబ్దంలో నాయకత్వంపై శిక్షణ పూర్తి - మెరుగైన సేవలందించడంలో సాయపడుతుందని రేవంత్ సంతృప్తి
హార్వార్డ్ లో 21వ శతాబ్దంలో నాయకత్వంపై శిక్షణ పూర్తి - మెరుగైన సేవలందించడంలో సాయపడుతుందని రేవంత్ సంతృప్తి

వీడియోలు

YSRCP vs TDP Conflict in GVMC Council | జీవీఎంసీ కౌన్సిల్‌లో వైసీపీ రగడ | ABP Desam
Chetla tandra Lakshmi Narasimha Temple | అరటిగెలల మహోత్సవం చూడాలనుకుంటున్నారా.? | ABP Desam
Building Gaddelu in Medaram Jatara 2026 | మేడారంలో వినూత్న రీతిలో భక్తుల పూజలు | ABP Desam
Rangoli for Samakka in Medaram Jatara | సమ్మక్క రాక కోసం ముగ్గులు వేసిన భక్తులు
Tribal Dance in Medaram Jatara 2026 | మేడారంలో ఆదివాసీల డోలు విన్యాసాలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan:
"ఉత్తరాంధ్రను డంపింగ్ ప్రాంతంగా మార్చేశారని ప్రజలు బాధపడుతున్నారు" కాలుష్యంపై పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Chairman: కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ నిర్దారించలేదు - చార్జిషీట్‌లో లోపాలు - టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ నిర్దారించలేదు - చార్జిషీట్‌లో లోపాలు - టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
C J Roy suicide: బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్త ఆత్మహత్య - ఐటీ అధికారుల విచారణ తర్వాత ప్రాణం తీసుకున్న సీజే రాయ్
బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్త ఆత్మహత్య - ఐటీ అధికారుల విచారణ తర్వాత ప్రాణం తీసుకున్న సీజే రాయ్
CM Revanth : హార్వార్డ్ లో 21వ శతాబ్దంలో నాయకత్వంపై శిక్షణ పూర్తి - మెరుగైన సేవలందించడంలో సాయపడుతుందని రేవంత్ సంతృప్తి
హార్వార్డ్ లో 21వ శతాబ్దంలో నాయకత్వంపై శిక్షణ పూర్తి - మెరుగైన సేవలందించడంలో సాయపడుతుందని రేవంత్ సంతృప్తి
Hyderabad Crime News: అదానీ గ్రూప్‌కు లక్కీ భాస్కర్ తరహా టోకరా; రెండు కోట్ల సిమెంట్‌ స్కామ్‌, హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఘరానా మోసం 
అదానీ గ్రూప్‌కు లక్కీ భాస్కర్ తరహా టోకరా; రెండు కోట్ల సిమెంట్‌ స్కామ్‌, హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఘరానా మోసం 
Deputy CM Sunetra Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి - శనివారమే ప్రమాణ స్వీకారం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి - శనివారమే ప్రమాణ స్వీకారం
Medaram Jatara 2026: మేడారం జాతర ముగింపు! వనదేవతల వీడ్కోలు, భక్తుల భావోద్వేగం! 2028లో మళ్ళీ కలుద్దాం!
మేడారం జాతర ముగింపు! వనదేవతల వీడ్కోలు, భక్తుల భావోద్వేగం! 2028లో మళ్ళీ కలుద్దాం!
India EU trade Deal: ఇండియా, యూరప్ ట్రేడ్ డీల్‌తో పాకిస్తాన్‌కు చావు దెబ్బ - ఎగుమతల సంక్షోభంలోకి జారుకోనున్న దాయాది
ఇండియా, యూరప్ ట్రేడ్ డీల్‌తో పాకిస్తాన్‌కు చావు దెబ్బ - ఎగుమతల సంక్షోభంలోకి జారుకోనున్న దాయాది
Embed widget