SBI clerk prelims Results 2025: ఎస్బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల- డైరెక్ట్ లింక్ ఇదే
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో జూనియర్ అసోసియేట్(SBI Clerk) పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రాథమిక పరీక్ష పరీక్ష ఫలితాలను మార్చి 28న వెల్లడించారు.

SBI clerk Phase-I Results 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో జూనియర్ అసోసియేట్(SBI Clerk) పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రాథమిక పరీక్ష పరీక్ష ఫలితాలు(SBI Clerk Prelims Results 2025) విడుదలయ్యాయి. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 1వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను అధికారులు శుక్రవారం (మార్చి 28) వెల్లడించారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వంటి లాగిన్ వివరాలను ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు.
దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ (జూనియర్ అసోసియేట్) పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 13,735 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 342; అమరావతి సర్కిల్లో 50 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి నవంబరు 17 నుంచి డిసెంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి తాజాగా ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించిన ఎస్బీఐ.. మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థుల కాల్ లెటర్లను త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు. మెయిన్స్ పరీక్షకు ఏప్రిల్ 10, 12 తేదీలను తాత్కాలికంగా నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఎస్బీఐ ప్రిలిమ్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.
ఫలితాలను చెక్ చేసుకోండి ఇలా..
➥ ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ https://sbi.co.in/ను సందర్శించండి.
➥ హోమ్పేజీలో పైన కనిపించే కెరీర్స్ అనే లింక్పై క్లిక్ చేయండి
➥ జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్కు సంబంధించిన లింక్ కనబడుతుంది
➥ ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ ప్రిలిమ్స్ ఫలితాల లింక్పై క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేయండి
➥ మీరు సాధించిన స్కోరు కార్డును డౌన్లోడ్ చేసుకొని భవిష్యత్తు వినియోగం కోసం భద్రపరుచుకోండి.
* జూనియర్ అసోసియేట్స్ (క్లరికల్ కేడర్) పోస్టులు
ఖాళీల సంఖ్య: 13,735 పోస్టులు
రాష్ట్రాల వారీగా ఖాళీలు: గుజరాత్- 1073, ఆంధ్రప్రదేశ్- 50, కర్ణాటక- 50, మధ్యప్రదేశ్- 1317, ఛత్తీస్గఢ్- 483, ఒడిశా- 362, హరియాణా- 306, జమ్ము & కశ్మీర్ యూటీ- 141, హిమాచల్ ప్రదేశ్- 170, చండీగఢ్ - 32, లడఖ్ యూటీ- 32, పంజాబ్- 569, తమిళనాడు- 336, పుదుచ్చేరి- 04, తెలంగాణ- 342, రాజస్థాన్- 445, పశ్చిమ బెంగాల్- 1254, అండమాన్ & నికోబార్ దీవులు- 70, సిక్కిం- 56, ఉత్తర్ప్రదేశ్- 1894, మహారాష్ట్ర- 1163, గోవా- 20, దిల్లీ- 343, ఉత్తరాఖండ్- 316, అరుణాచల్ ప్రదేశ్- 66, అస్సాం- 311, మణిపుర్- 55, మేఘాలయ- 85, మిజోరం- 40, నాగాలాండ్- 70, త్రిపుర- 65, బిహార్- 1111, జార్ఖండ్- 676, కేరళ- 426, లక్షద్వీప్- 02.
మెయిన్ పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 190 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. ఇందులో జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటల 40 నిమిషాలు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
ఆంధ్రప్రదేశ్: అనంతపురం, గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
బేసిక్ పే: నెలకు రూ.26,730.





















