ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) మరియు మేనేజ్మెంట్ ట్రెయినీ (MT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6,715 పోస్టులు ఉన్నాయి.
IBPS PO MT Recruitment: ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఉద్యోగాల జాతర.. 6,715 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
IBPS PO MT Recruitment: బ్యాంకింగ్ అభ్యర్థులకు ఐబీపీఎస్ గుడ్ న్యూ్స్ చెప్పింది. దేశవ్యాప్తంగా 6715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 21 లోపు అప్లై చేసుకోవచ్చు.

- ఐబీపీఎస్ 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
- డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 21, 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
IBPS PO MT Recruitment: బ్యాంకు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఐబీపీఎస్ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,715 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు జులై 21, 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు:
మొత్తం 6,715 పోస్టులలో ప్రధాన బ్యాంకుల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి.
- బ్యాంక్ ఆఫ్ బరోడా: 1,900 పోస్టులు
- కెనరా బ్యాంక్: 1,500 పోస్టులు
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 1,100 పోస్టులు
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 550 పోస్టులు
- పంజాబ్ నేషనల్ బ్యాంక్: 504 పోస్టులు
- బ్యాంక్ ఆఫ్ ఇండియా: 500 పోస్టులు
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : 500 పోస్టులు
- పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్: 161 పోస్టులు
అర్హతలు & వయోపరిమితి:
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 20 సంవత్సరాల నుండి గరిష్ఠంగా 30 సంవత్సరాల లోపు వయోపరిమితి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
జీతం
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ప్రారంభంలోనే రూ.48,480 నుంచి రూ.85,920 వరకు బేసిక్ పే లభిస్తుంది. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు అదనంగా అందుతాయి.
ఎంపిక విధానం:
అభ్యర్థులను మొత్తం 5 దశలలో ఎంపిక చేస్తారు.
1. ప్రిలిమినరీ పరీక్ష
2. మెయిన్స్ పరీక్ష
3. పర్సనాలిటీ టెస్ట్ / ఇంటర్వ్యూ
4. సర్టిఫికెట్ వెరిఫికేషన్
5. మెడికల్ పరీక్ష
ఈ పరీక్షలలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. పరీక్షలు ఇంగ్లీష్, హిందీ మీడియంలో మాత్రమే నిర్వహిస్తారు.
Also Read: కేంద్ర ఉద్యోగులకు శుభవార్త! 8th Pay Commission నివేదిక ఎప్పుడు వస్తుంది? జీతాల పెంపుపై అప్డేట్
ఎగ్జామ్ విధానం
1. ప్రిలిమినరీ పరీక్ష - మొత్తం మార్కులు: 100, సమయం: 60 నిమిషాలు
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 30 ప్రశ్నలు
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ – 35 ప్రశ్నలు
- రీజనింగ్ ఎబిలిటీ – 35 ప్రశ్నలు
2. మెయిన్స్ పరీక్ష (మొత్తం మార్కులు: 200, టైమ్ : 2 గంటల 40 నిమిషాలు)
- మొత్తం ప్రశ్నలు: 170
- సబ్జెక్టులు: రీజనింగ్ (40 ప్రశ్నలు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు), జనరల్ అవేర్నెస్ (50 ప్రశ్నలు), డేటా అనాలిసిస్ (40 ప్రశ్నలు).
- ఇంగ్లీష్ ఎస్సే, కాంప్రహెన్షన్ విభాగంలో 25 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది.
Also Read: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
ఎగ్జామ్ ఫీజు
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ. 850
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు: రూ. 175
ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: జులై 1, 2026
- దరఖాస్తుకు చివరి తేదీ: జులై 21, 2026
- ప్రిలిమ్స్ పరీక్ష: ఆగస్టు 2026
- ప్రిలిమ్స్ రిజల్ట్స్: సెప్టెంబర్/అక్టోబర్ 2026
- మెయిన్స్ ఎగ్జామ్: అక్టోబర్/నవంబర్ 2026
- ఇంటర్వ్యూ: నవంబర్/డిసెంబర్ 2026
అర్హులైన అభ్యర్థులు IBPS అధికారిక వెబ్సైట్(https://www.ibps.in/) ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
Also Read: గూగుల్ సమ్మర్ ఇంటర్న్షిప్ 2027 - టెక్ విద్యార్థులకు సువర్ణావకాశం.. దరఖాస్తుకు జూన్ 28 ఆఖరి తేదీ! - పూర్తి వివరాలు
Frequently Asked Questions
ఐబీపీఎస్ ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది?
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు, వయోపరిమితి ఎంత?
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి.
ఐబీపీఎస్ PO/MT పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఎప్పుడు?
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జులై 21, 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు జులై 1, 2026 నుండి ప్రారంభమయ్యాయి.
అభ్యర్థుల ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష అనే ఐదు దశలు ఉంటాయి. పరీక్షలు ఇంగ్లీష్, హిందీ మీడియంలో జరుగుతాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు రుసుము ఎంత?
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 175.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















