అన్వేషించండి

APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?

APPSC గ్రూప్‌-1 మెయిన్స్ తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులకు మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మొత్తం 81 పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీచేయనుంది.

APPSC Group1 Mains: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులై, మెయిన్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులకు మే 3 నుంచి 9 వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. గ్రూప్-1 మెయిన్స్‌ అభ్యర్థులకు ట్యాబ్‌ల్లో ప్రశ్నపత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి జనవరి 21న ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మే 3న తెలుగు పేపర్, మే 4న ఇంగ్లిష్ పేపర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. మే 5 నుంచి 9 వరకు జరిగే పరీక్షలను మాత్రమే ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 5న పేపర్-I, మే 6న పేపర్-II, మే 7న పేపర్-III, మే 8న పేపర్-IV, మే 9న పేపర్-V పరీక్షలు నిర్వహించనున్నారు.    

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల పేపర్లు ఇలా..

పేపర్-I - ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ఇతివృత్తాలు మరియు అంశాలపై జనరల్ ఎస్సే

పేపర్-II - భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు సాంస్కృతిక మరియు భౌగోళిక శాస్త్రం

పేపర్-III - రాజకీయాలు, రాజ్యాంగం, పాలన, చట్టం మరియు నీతి

పేపర్-IV - భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి

పేపర్-V - సైన్స్, టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు

APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?

ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 81 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ (ప్రిలిమినరీ) పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల పరిధిలో 301 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-1 పరీక్ష నిర్వహించారు.  గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్-1 పరీక్ష కోసం మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో మొత్తం 1,26,068 (84.67 %)  మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో   పేపర్-1 పరీక్షకు 91,463 (72.55 %) మంది, పేపర్-2 పరీక్షకు 90,777 (72 %) మంది అభ్యర్థులు హాజరయ్యారు. 

మెయిన్స్ పరీక్ష విధానం..
మెయిన్స్ పరీక్షలో మొత్తం 5 ప్రధాన పేపర్లు ఉంటాయి. వీటితోపాటు తెలుగు, ఇంగ్లిష్ పేపర్లు కూడా ఉంటాయి. అయితే ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. మొత్తం 5 పేపర్లలో ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి మొత్తం 825 మార్కులకు అభ్యర్థుల ఎంపికను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో పేపరుకు 180 నిమిషాలు (3 గంటలు) కేటాయించారు. డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Meta Layoffs 2026: ఫేస్‌బుక్‌లో 8వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ - ఈ సీనియర్ మేనేజర్ వేదన ఏఐ పాపమే !
ఫేస్‌బుక్‌లో 8వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ - ఈ సీనియర్ మేనేజర్ వేదన ఏఐ పాపమే !
Tourist Guide Jobs In Telangana: తెలంగాణలోని ౩౩ జిల్లాల్లో గైడ్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం! అర్హతలు ఇవే! అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలోని ౩౩ జిల్లాల్లో గైడ్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం! అర్హతలు ఇవే!
Telangana Govt Jobs News: తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!
తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Opposition Crisis Deep Dive Analysis: ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
Chiranjeevi On Peddi: చరణ్ తండ్రిగానే కాదు, నటుడిగానూ గర్విస్తున్నా - పెద్ది విజయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
చరణ్ తండ్రిగానే కాదు, నటుడిగానూ గర్విస్తున్నా - పెద్ది విజయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
Kerala Menstrual Leave for Schoolgirls:కేరళ విద్యార్థులకు మెన్‌స్ట్రువల్ హాలిడేస్ ! దేశవ్యాప్తంగా చర్చినీయాంశమైన మోడల్‌!
కేరళ విద్యార్థులకు మెన్‌స్ట్రువల్ హాలిడేస్ ! దేశవ్యాప్తంగా చర్చినీయాంశమైన మోడల్‌!
AP DSC 2025 Irregularities: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
Peddi Vs Pushpa: పెద్ది వర్సెస్ పుష్ప... ఒక్క పాయింట్‌ మీద సినిమాలు తీసిన సుక్కు & బుచ్చి
పెద్ది వర్సెస్ పుష్ప... ఒక్క పాయింట్‌ మీద సినిమాలు తీసిన సుక్కు & బుచ్చి
TDP Janasena BJP Seat Sharing Formula: ఏపీ స్థానిక ఎన్నికల ఆలస్యం వెనుక బాబు మాస్టర్ ప్లాన్ - కూటమిలో చిచ్చు పెట్టకుండా నియోజకవర్గ స్థాయి ‘సమన్వయ’ ఫార్ములా!
ఏపీ స్థానిక ఎన్నికల ఆలస్యం వెనుక బాబు మాస్టర్ ప్లాన్ - కూటమిలో చిచ్చు పెట్టకుండా నియోజకవర్గ స్థాయి ‘సమన్వయ’ ఫార్ములా!
West Bengal TMC Political Crisis 2026: బెంగాల్ రాజకీయాల్లో మహారాష్ట్ర సీన్ - టీఎంసీలో ఓ షిండే రెడీ - మమతా బెనర్జీకి 50 మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా?
బెంగాల్ రాజకీయాల్లో మహారాష్ట్ర సీన్ - టీఎంసీలో ఓ షిండే రెడీ - మమతా బెనర్జీకి 50 మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా?
Embed widget