అన్వేషించండి

APPSC Group -2 Results : ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్ ఫలితాలు విడుదల- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక

APPSC Group -2 Results : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ఫలితాలు విడుదలయ్యాయి. 905 ఉద్యోగాలకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. మొత్తం

APPSC Group -2 Results: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 పోస్టుల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ఏప్రిల్ 4న విడుదల చేసింది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలకు సంబంధించి మొత్తం 2517 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇందులో సాధారణ కోటా కింద 2168 మంది ఉండగా.. స్పోర్ట్స్ కోటా కింద 370 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరి నుంచి ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేశారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. ఫలితాలతోపాటు మెయిన్స్ పరీక్షల తుది ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ అందుబాటులో ఉంచింది. ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీని కమిషన్ విడుదల చేసింది. 

గ్రూప్-2 మెయిన్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

Note: స్పోర్ట్స్ కోటా కిందక ఎంపికైన 370 మందిలో, 2168 మంది రెగ్యులర్ అభ్యర్థుల జాబితాలోని వివిధ కేటగిరీలలో ఇరవై ఒక్క (21) మంది అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం తాత్కాలికంగా ఎంపిక చేశారు.

గ్రూప్- మెయిన్స్ ఆన్సర్ కీలు..

గ్రూప్-2 నోటిఫికేషన్‌లో రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. వాటిని ఏపీపీఎస్సీ పట్టించుకోలేదు. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించింది. దీనిపై పోరాటం ఉద్ధృతం చేసిన అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో  ప్రక్రియ ఆలస్యం అవుతూ వచ్చింది.  అయితే కోర్టుల్లో ఈ కేసులు వీగిపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహించింది. పరీక్షకు రెండు రోజుల ముందు నుంచి తమ ఆందోళన మరింత తీవ్రం చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖ వరకు ఈ ఆందోళన ఉద్ధృతం అయ్యాయి. పరీక్షకు ఒక్క రోజు ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల విన్నపాన్ని మన్నించి పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి సూచనలు చేసింది. దీంతో పరీక్ష ముందు రోజు హైడ్రామా నడిచింది. పరీక్ష వాయిదాకు ప్రభుత్వం ఓకే చెప్పినప్పటికీ ఏపీపీఎస్సీ మాత్రం తన పట్టు వీడలేదు. అప్పటికే ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందున ప్రభుత్వ ఆదేశాలను పాటించలేమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. దీంతో అనుకున్నట్టుగానే పరీక్షను నిర్వహించింది. ఆ ఫలితాలను ఏప్రిల్ 4న అర్థరాత్రి విడుదల చేసింది. 

ఏపీలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో గతేడాది (2024) ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87.17 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో మొత్తం 905 గ్రూప్-2 పోస్టులకుగాను 4,83,535 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 4,04,037 (87.17%) మంది పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1327 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు. గ్రూప్-2 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారికి తర్వాత దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. అయితే గతేడాది జూన్‌ లేదా జులైలో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. అభ్యర్థుల వినతుల మేరకు పరీక్ష వాయిదావేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్‌‌లో 897 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి 2023, ఏపీపీఎస్సీ(APPSC) డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్(Excutive), 566 నాన్-ఎగ్జిక్యూటివ్(Non Excutive) పోస్టులు ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు అదనంగా మరో 8 పోస్టులను చేర్చడంతో మొత్తం పోస్టుల సంఖ్య 905కి చేరింది. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి జవనరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు గతేడాది ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేశారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 23న మెయిన్ పరీక్ష నిర్వహించారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరిగాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Smart ED Conclave 2026: ఉద్యోగాలు లేవనేది అపోహేనా? AI యుగంలో విద్యార్థులు ఎలా సిద్ధమవ్వాలి? ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి కీలక సూచనలు!
ఉద్యోగాలు లేవనేది అపోహేనా? AI యుగంలో విద్యార్థులు ఎలా సిద్ధమవ్వాలి? ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి కీలక సూచనలు!
AI career certificate: గూగుల్ సరికొత్త ఏఐ కెరీర్ సర్టిఫికేట్ - రేపటి టెక్ ఉద్యోగాలకు ఇదే రహదారి!
గూగుల్ సరికొత్త ఏఐ కెరీర్ సర్టిఫికేట్ - రేపటి టెక్ ఉద్యోగాలకు ఇదే రహదారి!
Andhra Pradesh Job Calendar : ఆంధ్రప్రదేశ్ యువతకు గుడ్ న్యూస్! జాబ్ క్యాలెండర్ విడుదల, ఉద్యోగాల జాతర, నైపుణ్య పోర్టల్ ప్రారంభం!
ఏపీలో నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్! ఉగాదికి జాబ్‌ క్యాలెండర్‌!
APEPDCL Jobs: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- త్వరలోనే మూడువేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- త్వరలోనే మూడువేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Embed widget