అన్వేషించండి

Raisins: ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి మంచిదే, కానీ ఈ సమస్యలు ఉన్నవాళ్లు జాగ్రత్తపడాలి

ఎండు ద్రాక్ష వంటివి ఆరోగ్యానికి చాలా మంచిది. అధికంగా తింటే మాత్రం అనర్ధాలు తప్పవు.

కిస్మిస్, మునక్కా ఎలా పిలిచినా అది ఒక ఎండిన ద్రాక్షలే.  ప్రాంతాలను బట్టి ఒక్కో పేరుతో పిలుచుకుంటారు. సాధారణంగా రాత్రిపూట నానబెట్టి ఉదయం తింటారు. సాంప్రదాయ భారతీయ వైద్యంలో ఇది ఎంతో ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కోలుకోవడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. వీటిలో కొవ్వులు ఉండవు. కేలరీలు, కార్బోహైడ్రేట్లు శరీరానికి కావాల్సిన స్థాయిలోనే ఉంటాయి. కాబట్టి వీటిని తినడం అన్ని విధాల ఆరోగ్యకరమని ఆంగ్ల వైద్యంతో పాటు సాంప్రదాయ వైద్యం కూడా చెబుతోంది. అందుకే వీటికి అభిమానులు ఎక్కువ. పోషకాహార నిపుణులు రోజూ గుప్పెడు కిస్మిస్‌లను తినమని సూచిస్తారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. తినే ముందు వైద్యులను సంప్రదించాలి.

ఎవరు తినకూడదు?
కొందరు తమకున్న ఆరోగ్య సమస్యల కారణంగా రక్తాన్ని పలచబరిచే మందులను వాడుతూ ఉంటారు. ఇలాంటి వారు కిస్మిస్‌లను తినక పోవడమే ఎంతో మేలు. ఎందుకంటే ఆ మందులతో ఈ కిస్మిస్‌లు ప్రతికూల పరస్పర చర్యను జరిపే అవకాశం ఉంది. దీనివల్ల వారి ఆరోగ్యం మరింత దిగజారవచ్చు. అలాగే గర్భవతిగా ఉన్నప్పుడు, పిల్లలకు పాలు ఇస్తున్నప్పుడు కూడా కిస్మిస్‌లను దూరం పెడితే మంచిది. తినేముందు ఓసారి వైద్యున్ని సంప్రదించడం అన్ని విధాలా ఉత్తమం. కిస్మిస్లు ఆరోగ్యానికి మంచివని, అధికంగా తింటే మాత్రం అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా డయేరియా వచ్చే అవకాశం ఉంది. ఇవి అరగడానికి సమయం పడుతుంది. అందుకే జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు, బలహీనమైన జీర్ణశక్తిని కలిగి ఉన్నవారు కిస్మిస్‌లను తక్కువగా తినాలి.

కిస్‌మిస్ వల్ల జరిగే అనర్ధాలు తక్కువే కానీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువ.

1. వీటిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఈ డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మందగించేలా చేస్తుంది. దీనివల్ల ఎక్కువ కాలం పాటు ఏమీ తినకుండా ఉండగలుగుతారు. అందుకే అధిక బరువును తగ్గాలనుకునేవారు, రోజు గుప్పెడు కిస్మిస్‌లను తినడం మంచిది. అలాగే ఈ వీటిలో లెప్టిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది కొవ్వును కాల్చేస్తుంది.

2. కిస్‌మిస్‌లో రెస్వెరాట్రాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. శరీరంలోని కణాలలో ఇన్ఫ్లమేషన్ రాకుండా అడ్డుకుంటుంది. ధమనుల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు లేకుండా ఆ మార్గాన్ని క్లియర్ చేస్తుంది. ఎల్డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

3. రాత్రంతా నానబెట్టిన కిస్‌మిస్‌లను ఉదయం లేచి తినడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట వంటివి తగ్గుతాయి. ఆయుర్వేదం ప్రకారం పిత్తదోషాన్ని నివారించే శక్తి దీనిలో ఉంది. పొట్టలో శీతలీ కరణ ప్రభావాన్ని చూపిస్తుంది. 

4. వీటిని తినడం వల్ల దంతాలకు ఎంతో మంచిది. చిగుళ్ల వాపు వంటి సమస్యలను నయం చేస్తుంది. రోజు అయిదారు కిస్మిస్‌లను తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గిపోతుంది. దంత బాక్టీరియాని చంపి దంతక్షయం బారిన పడకుండా కాపాడుతుంది.

5. పిల్లలు, మహిళల్లో అధికంగా రక్తహీనత సమస్య ఉంటుంది. అలాంటివారు రోజూ గుప్పెడు కిస్‌మిస్ తింటే చాలా మంచిది. ఐరన్, విటమిన్ బి సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనతకు సరైన చికిత్సను చేస్తాయి. ముఖ్యంగా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి.

6. మగవారిలో సంతాన ఉత్పత్తిని పెంచే శక్తి కిస్మిస్‌లకు ఉంది. ఇది కామ ఉద్దీపనకు సహకరిస్తుంది. స్పెర్మ్  కౌంట్ పెంచి సంతాన ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. రాత్రిపూట గోరువెచ్చని పాలలో కిస్మిస్లు నానబెట్టి తాగితే ఎంతో మంచిది. అంగస్తంభన సమస్యకు ఇది సరైన చికిత్స.

Also read: ఈ యాంటీ బయోటిక్స్ తరచూ వాడే అలవాటును మానుకోవాలి - సూచిస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 2 Exams: గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
Hyderabad Metro Phase2: హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2- మళ్లీ మొదటికొచ్చిన సమస్య, ఆ విషయంపై మెట్రో అధికారులు అభ్యంతరం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2- మళ్లీ మొదటికొచ్చిన సమస్య, ఆ విషయంపై మెట్రో అధికారులు అభ్యంతరం
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 2 Exams: గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
Hyderabad Metro Phase2: హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2- మళ్లీ మొదటికొచ్చిన సమస్య, ఆ విషయంపై మెట్రో అధికారులు అభ్యంతరం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2- మళ్లీ మొదటికొచ్చిన సమస్య, ఆ విషయంపై మెట్రో అధికారులు అభ్యంతరం
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Viral News: గుంటూరులో ఫ్రీగా చికెన్ బిర్యానీ, కోడి కూర - రద్దీని కంట్రోల్ చేయలేక గేట్లు మూసివేసిన నిర్వాహకులు
గుంటూరులో ఫ్రీగా చికెన్ బిర్యానీ, కోడి కూర - రద్దీని కంట్రోల్ చేయలేక గేట్లు మూసివేసిన నిర్వాహకులు
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
IND vs PAK Champions Trophy: భార‌త్ వైపే మొగ్గు.. జ‌ట్టులో చాలా కలిసొచ్చే అంశాలు.. పాక్ లో అవి కొర‌వ‌డ్డాయి.. మాజీ క్రికెట‌ర్
భార‌త్ వైపే మొగ్గు.. జ‌ట్టులో చాలా కలిసొచ్చే అంశాలు.. పాక్ లో అవి కొర‌వ‌డ్డాయి.. మాజీ క్రికెట‌ర్ విశ్లేష‌ణ‌
Embed widget