అన్వేషించండి

Covid19 Update: మానసిక రోగుల్లో కోవిడ్ మరణాలు ఎక్కువ

Covid19 Update: మానసిక రోగుల్లో కోవిడ్ ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది. యూరోపియన్ కాలేజ్ ఆఫ్ న్యూరో సైకోఫార్మాకాలజీకి చెందిన ఇమ్యునో న్యూరో సైకియాట్రీ నెట్‌వర్క్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.

సాధారణ వ్యక్తులతో పోలిస్తే మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి కోవిడ్ (Covid- 19) సోకే ప్రమాదం ఎక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మానసిక రుగ్మతలు ఉన్న వారికి కోవిడ్ సోకితే అధికంగా మరణించడమో, ఆసుపత్రి పాలు కావడమో జరుగుతోందని తేలింది. యూరోపియన్ కాలేజ్ ఆఫ్ న్యూరో సైకోఫార్మాకాలజీకి (European College of Neuro psychopharmacology) చెందిన ఇమ్యునో న్యూరో సైకియాట్రీ నెట్‌వర్క్ (Immuno Neuro Psychiatry Network) ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. 
దీని ప్రకారం మిగతా వారితో పోలిస్తే మానసిక రుగ్మతలు ఉన్న వారికి కోవిడ్ సోకితే మరణించడం, ఆసుపత్రుల్లో చేరడం వంటివి రెండు రెట్లు అధికంగా జరుగుతాయని స్పష్టమైంది. యాంటిసైకోటిక్స్ (antipsychotics ) లేదా యాంజియోలైటిక్స్ (anxiolytics) వంటి ఆందోళన తగ్గించే మందులతో చికిత్స పొందుతున్న వారిలో కూడా ఇవే ఫలితాలు కనిపించాయి. 
మొత్తం 22 దేశాలకు చెందిన 1,469,731 మంది (వీరిలో 43,938 మంది మానసిక రోగులు ఉన్నారు) కోవిడ్ పేషెంట్లపై నిర్వహించిన 33 అధ్యయనాల సమాచారం ఆధారంగా ఇమ్యునో న్యూరో సైకియాట్రీ నెట్‌వర్క్ ఈ విషయాలను వెల్లడించింది. వీటిలో 23 అధ్యయనాల్లో కోవిడ్ సంబంధిత మరణాలు, ఆసుపత్రిలో చేరడం, ICU లో ఉంచడం వంటి పలు అంశాలను పరిశీలించింది.  

"తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిలో మరణాలు, ఆసుపత్రిలో చేరే అవకాశాలు ఎక్కువని మేం చాలా సార్లు వెల్లడించాం. టీకాలు అమలు చేసే విధానాన్ని మార్చాలని మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా పలు దేశాలకు సూచించాం. అయితే మానసిక రుగ్మతలతో బాధపడుతున్న రోగుల మరణాలు, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్యపై సరైన ఆధారాలు లేకపోవడం వల్ల మా సిఫార్సుల అమలుకు ఆటంకం కలుగుతుంది. ఇదే కారణంతో చాలా దేశాల జాతీయ ఆరోగ్య అధికారులు మా అభ్యర్థనలను తిరస్కరిస్తున్నారు. ఈ కారణంగానే మేం లిఖిత పూర్వకంగా అధ్యయన వివరాలు ప్రకటిస్తున్నాం. ఈ కొత్త సాక్ష్యాలతోనైనా పరిస్థితులు మారతాయని ఆశిస్తున్నాం. తీవ్రమైన ముప్పు ఉన్న మానసిక రోగులందరికీ పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ అందించాలి. కోవిడ్ సోకిన మానసిక రోగులను జాగ్రత్తగా చూసుకునేందుకు వీలుగా వారిని పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేయాలి" అని ఈ అధ్యయనంలో పాల్గొన్న బెల్జియంలోని యూనివర్సిటీ సైకియాట్రిక్ హాస్పిటల్ క్యాంపస్ డఫెల్ కు చెందిన డాక్టర్ లివియా డి పికర్ వెల్లడించారు. 

ఇమ్యునో న్యూరో సైకియాట్రీ నెట్‌వర్క్ డైరెక్టర్ మేరియాన్ లెబోయర్ మాట్లాడుతూ.. "మానసిక రోగులు ఉపయోగించే మందుల వల్ల కూడా కోవిడ్ లక్షణాలు తీవ్రం అయ్యే అవకాశం ఉంది. మానసిక రోగులకు ఇచ్చే బెంజోడయైజెఫైన్స్ (Benzodiazepines) సహా ఇతర మందుల వల్ల కూడా శ్వాస సంబంధ సమస్యలు కనిపిస్తున్నాయి. దీని వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నట్లు భావిస్తున్నాం. అయితే దీని గురించి మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది" అని అన్నారు. తీవ్రమైన మానసిక అనారోగ్యం, రుగ్మతలతో బాధపడే వారికి మొదటి ప్రాధాన్యతగా వ్యాక్సిన్లు ఇవ్వడం ద్వారా ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చని వైద్యరంగానికి చెందిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ అధ్యయన వివరాలు  'లాన్సెట్ సైకియాట్రీ' (Lancet Psychiatry) జర్నల్ లో ప్రచురితమయ్యాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
Embed widget