By: ABP Desam | Updated at : 27 Mar 2023 09:34 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pixabay
ఎల్లో కలర్ లో నిగనిగలాడుతూ ఉంటేనే కొంతమంది అరటి పండ్లు తింటారు. వాటి మీద ఏ కొంచెం మచ్చ కనిపించినా, పండిపోయినా తినకుండా పక్కన పడేస్తారు. మాగిన అరటి పండు తినాలంటే చాలా మందికి అసలు నచ్చదు. వాసన, రంగు చాలా వేరుగా ఉంటుంది. కానీ మాగిన అరటి పండు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో విటమిన్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. బాగా పండిన అరటి పండులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు బాగా పండిన అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అనేక వ్యాధుల నుంచి బయటపడేందుకు ఇవి సహాయపడతాయి.
బాగా పండిన అరటి పండు తింటే రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది అనేక వ్యాధులను నివారిస్తుంది. కణాలు దెబ్బతినకుండా నిరోధిస్తుంది.
అతిగా పండిన అరటిపండ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటుని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి తింటే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
మాగిన అరటి పండులో ఉండే స్టార్చ్ ఫ్రీ షుగర్ గా మార్చబడుతుంది. దీని వల్ల సులభంగా జీర్ణమవుతాయి. వీటిని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవాళ్ళు పండిన అరటిపండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
ఇవి తింటే గుండెల్లో మంట సమస్యను అధిగమించవచ్చు. నిజానికి ఇవి యాంటాసిడ్ గా పని చేస్తాయి. ఇందులో ఉండే గుణాలు పొట్ట లోపలి పొరను హానికరమైన యాసిడ్స్ నుంచి రక్షిస్తాయి. ఇవి తింటే ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
బాగా పండిన అరటి పండ్ల తొక్కపై ప్రత్యేక రకమైన పదార్థం ఏర్పడుతుంది. దీన్ని ట్యూమర్ నెక్రొసిస్ ఫ్యాక్టర్ అంటారు. ఇది క్యాన్సర్, ఇతర అసాధారణ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.
కండరాల నొప్పితో బాధపడుతుంటే మీకు పండిన అరటిపండు చక్కగా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది కండరాల నొప్పి, తిమ్మిరి నుంచి ఉపశమనం పొండటంలో సహాయపడుతుంది.
అరటిపండ్లలో అధికంగా ఫైబర్ ఉంటుంది. వీటిని అతిగా తింటే పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువగా తింటే పళ్ళు పుచ్చిపోతాయి. నిద్ర ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్ ఉన్న వాళ్ళు రోజుకి ఒకటికి మించి తింటే ఇతర సమస్యలకు దారితీస్తుంది. అందుకే రోజుకి రెండుకు మించి అరటిపండ్లు తినకుండా ఉండటమే మంచిది. ఇది తిన్న తర్వాత గోరు వెచ్చని నీటిని తాగితే జలుబు, దగ్గు వంటివి రాకుండా ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: వేసవిలో ఐస్ యాపిల్స్ తింటే చాలా మంచిదట - ప్రయోజనాలివే!
Fatty Liver Disease: ఆకలిగా ఉండటం లేదా? ప్రమాదకరమైన వ్యాధికి ఇది ముందస్తు లక్షణం
Demetia: డిమెన్షియాను ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి?
ఓ మై గాడ్, ఈ ఫుడ్లో ప్రాణాంతక రసాయనాలు కలుపుతున్నారట!
Workplace Burnout: ‘వర్క్ ప్లేస్ బర్న్ అవుట్’ అంటే ఏంటో తెలుసా? పెళ్లైన పురుషులకు ఈ బాధ తక్కువేనట!
వేసవిలో షవర్, బాత్ టబ్లో స్నానం యమ డేంజర్ - ఈ బ్యాక్టీరియా ప్రాణం తీస్తుందట!
Sharwanand: సీఎం కేసీఆర్ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం