అన్వేషించండి

Overripe Banana: ఒత్తిడి తగ్గించుకోవాలా? మాగిన అరటిపండు తినేయండి - ఇంకా లాభాలెన్నో!

అతిగా పండిన అరటిపండు తినాలంటే ఎవరికీ నచ్చదు. కానీ ఇది తింటే అనేక అనారోగ్య సమస్యలు దూరంఅవుతాయి.

ల్లో కలర్ లో నిగనిగలాడుతూ ఉంటేనే కొంతమంది అరటి పండ్లు తింటారు. వాటి మీద ఏ కొంచెం మచ్చ కనిపించినా, పండిపోయినా తినకుండా పక్కన పడేస్తారు. మాగిన అరటి పండు తినాలంటే చాలా మందికి అసలు నచ్చదు. వాసన, రంగు చాలా వేరుగా ఉంటుంది. కానీ మాగిన అరటి పండు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో విటమిన్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. బాగా పండిన అరటి పండులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు బాగా పండిన అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అనేక వ్యాధుల నుంచి బయటపడేందుకు ఇవి సహాయపడతాయి.

కణాలు దెబ్బతినకుండా నిరోధిస్తుంది

బాగా పండిన అరటి పండు తింటే రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది అనేక వ్యాధులను నివారిస్తుంది. కణాలు దెబ్బతినకుండా నిరోధిస్తుంది.

గుండెకి మేలు

అతిగా పండిన అరటిపండ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటుని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి తింటే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

జీర్ణం సులభం

మాగిన అరటి పండులో ఉండే స్టార్చ్ ఫ్రీ షుగర్ గా మార్చబడుతుంది. దీని వల్ల సులభంగా జీర్ణమవుతాయి. వీటిని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవాళ్ళు పండిన అరటిపండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

గుండె మంట తగ్గిస్తుంది

ఇవి తింటే గుండెల్లో మంట సమస్యను అధిగమించవచ్చు. నిజానికి ఇవి యాంటాసిడ్ గా పని చేస్తాయి. ఇందులో ఉండే గుణాలు పొట్ట లోపలి పొరను హానికరమైన యాసిడ్స్ నుంచి రక్షిస్తాయి. ఇవి తింటే ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

క్యాన్సర్ ని నివారిస్తుంది

బాగా పండిన అరటి పండ్ల తొక్కపై ప్రత్యేక రకమైన పదార్థం ఏర్పడుతుంది. దీన్ని ట్యూమర్ నెక్రొసిస్ ఫ్యాక్టర్ అంటారు. ఇది క్యాన్సర్, ఇతర అసాధారణ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

కండరాల నొప్పి తగ్గిస్తుంది

కండరాల నొప్పితో బాధపడుతుంటే మీకు పండిన అరటిపండు చక్కగా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది కండరాల నొప్పి, తిమ్మిరి నుంచి ఉపశమనం పొండటంలో సహాయపడుతుంది.

ఎన్ని తినాలి?

అరటిపండ్లలో అధికంగా ఫైబర్ ఉంటుంది. వీటిని అతిగా తింటే పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువగా తింటే పళ్ళు పుచ్చిపోతాయి. నిద్ర ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్ ఉన్న వాళ్ళు రోజుకి ఒకటికి మించి తింటే ఇతర సమస్యలకు దారితీస్తుంది. అందుకే రోజుకి రెండుకు మించి అరటిపండ్లు తినకుండా ఉండటమే మంచిది. ఇది తిన్న తర్వాత గోరు వెచ్చని నీటిని తాగితే జలుబు, దగ్గు వంటివి రాకుండా ఉంటుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: వేసవిలో ఐస్ యాపిల్స్ తింటే చాలా మంచిదట - ప్రయోజనాలివే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Water Tank Cleaning Tips : ఇంట్లో వాటర్ ట్యాంక్ ఇలా క్లీన్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్
ఇంట్లో వాటర్ ట్యాంక్ ఇలా క్లీన్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్
Backward Walking : ఉదయాన్నే 30 సెకన్లు వెనక్కి నడిస్తే చాలు.. శారీరక, మానసిక ప్రయోజనాలు పొందడం ఖాయం
ఉదయాన్నే 30 సెకన్లు వెనక్కి నడిస్తే చాలు.. శారీరక, మానసిక ప్రయోజనాలు పొందడం ఖాయం
Low Cost Semaglutide Drug : భారత్‌ ఫార్మా రంగంలో సరికొత్త విప్లవం! డయాబెటిస్‌, ఒబేసిటీ చికిత్స మరింత చవక!
భారత్‌ ఫార్మా రంగంలో సరికొత్త విప్లవం! డయాబెటిస్‌, ఒబేసిటీ చికిత్స మరింత చవక!
Castor Oil on the Belly Button : బొడ్డుపై ఆముదం మసాజ్.. వైరల్ ట్రెండ్ వల్ల నిజంగా లాభాలున్నాయా? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే
బొడ్డుపై ఆముదం మసాజ్.. వైరల్ ట్రెండ్ వల్ల నిజంగా లాభాలున్నాయా? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget