అన్వేషించండి

Omicron Alert: తక్కువ.. అసలు లక్షణాలు లేని వారికి వారమే ఐసోలేషన్.. కేంద్రం ప్రకటించిన కొత్త కరోనా రూల్స్ ఇవే..!

కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో లక్షణాలు లేని వారు.. తక్కువ లక్షణాలు ఉన్న వారు వారం రోజులు ఐసోలేట్ అయితే సరిపోతుంది. కేంద్రం కొత్త నిబంధనలు విడుదల చేసింది.

కరోనా వైరస్ సోకిన వారికి ఐసోలేషన్ నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసింది.   హోం ఐసోలేషన్ లో ఉంటున్న పేషెంట్లకు కొత్త మార్గదర్శకాలు వర్తిస్తాయి. కరోనా పాజిటివ్‌గా తేలి లక్షణాలు లేని వారు.. తక్కువగా ఉన్నవారు..  వరసగా మూడు రోజులు జ్వరం రాకపోతే కేవలం 7 రోజుల ఐసోలేషన్ ఉంటే సరిపోతుంది.  కోవిడ్ వచ్చిన వారు ట్రిపుల్ లేయర్ మాస్క్ లను ధరించాలని, వెంటిలేషన్ బాగా ఉండే రూంలో ఐసోలేట్ అవ్వాలని కేంద్రం  సూచించింది. 

 

Also Read: భయపడకండి.. బూస్టర్ డోస్ వచ్చేసింది.. చుక్కల మందుకు డీసీజీఐ అనుమతి!

ఈ వారం రోజులు ఇతరులతో ఎటువంటి కాంటాక్ట్ లేకుండా చూసుకోవాలని కేంద్రం కోరింది. హోం ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.  హెచ్ఐవీ, అవయవాలు ట్రాన్స్‌ప్లాంట్ , క్యాన్సర్ థెరపీ వంటి సీరియస్ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం లక్షణాలు ఉన్నా లేకపోయినా ఆస్పత్రిలో చేరాలని కేంద్రం సూచిస్తోంది. అలాగే హైగ్రేడ్ ఫివర్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు..  ఆక్సిజన్ శాతం 93 కన్నా తక్కువగా ఉండేవారికి ఖచ్చితంగా మెడికల్ సపోర్ట్ అవసరమని కేంద్రం స్పష్టం చేసింది.

Also Read: WHO On Omicron: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్..!

హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు ఎప్పటికప్పుడు పల్స్ రేట్ చెక్ చేసుకోవాలి.  కుటుంబసభ్యులు ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి దగ్గరకు రావాల్సి వస్తే.. ఇద్దరూ ఎన్‌ 95 మాస్క్‌ను ఉపయోగించాలి. బాధితులు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలుచేసింది. రోజుకు మూడు సార్లు వేడి నీటితో గార్గిల్‌ చేసుకోవడం, ఆవిరి పట్టడం వంటివి చేయాలి.  ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో కరోనా బాధితులు ఉపయోగించే వస్తువులను ఇతరులు ఉపయోగించకూడదు.   

Also Read: Bengal Team Covid Positive: శివమ్‌ దూబె, బెంగాల్‌ రంజీ క్రికెటర్లలో ఏడుగురికి కరోనా

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభణ కొనసాగుతోంది. కరోనాకు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తోడవడంతో కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. గత కొన్ని రోజుల దాకా రోజూవారీ కేసులు  50 వేల వరకూ నమోదువుతున్నాయి. ఒమిక్రాన్ కేసులూ పెరుగుతున్నాయి. అయితే ఎక్కువగా  సీరియస్ కావడం లేదు. దీంతో ఏడు రోజులు మాత్రమే ఐసోలేషన్‌కు తగ్గించినట్లుగా తెలుస్తోంది. 

Also Read: Lionel Messi Covid Positive: మెస్సీకి కరోనా.. మరో ఇద్దరికి కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Actor Govinda: అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Embed widget