![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bengal Team Covid Positive: శివమ్ దూబె, బెంగాల్ రంజీ క్రికెటర్లలో ఏడుగురికి కరోనా
టీమ్ఇండియా యువ క్రికెటర్ శివమ్ దూబెకు కొవిడ్ సోకింది. బెంగాల్ రంజీ క్రికెట్ జట్టులో ఆరుగురు క్రికెటర్లు, సహాయ సిబ్బందిలో ఒకరికి కరోనా వచ్చింది.
![Bengal Team Covid Positive: శివమ్ దూబె, బెంగాల్ రంజీ క్రికెటర్లలో ఏడుగురికి కరోనా Coronavirus Six Bengal cricketers team assistant coach Ranji Trophy squad test positive for Covid-19 Bengal Team Covid Positive: శివమ్ దూబె, బెంగాల్ రంజీ క్రికెటర్లలో ఏడుగురికి కరోనా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/03/d72c69a9dd09d132ecb3357c6a16ebe8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కరోనా మూడో వేవ్ దేశవాళీ క్రికెట్పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమ్ఇండియా యువ క్రికెటర్ శివమ్ దూబెకు కొవిడ్ సోకింది. బెంగాల్ రంజీ క్రికెట్ జట్టులో ఆరుగురు క్రికెటర్లు, సహాయ సిబ్బందిలో ఒకరికి కరోనా వచ్చింది. విషయం తెలియడంతో బీసీసీఐ, బెంగాల్, ముంబయి క్రికెట్ సంఘాలు నష్టనివారణ చర్యలు చేపట్టాయి.
మరికొన్ని రోజుల్లో రంజీ సీజన్ ఆరంభం కానుంది. ఇందుకోసం కోల్కతాలోని బెంగాల్ జట్టు సాధన చేసింది. ఇదే సమయంలో ఏడుగురు సభ్యులకు కొవిడ్ సోకడంతో ప్రాక్టీస్ సెషన్లను రద్దు చేశారు. బెంగళూరు పర్యటనను నిలిపివేశారు. జనవరి 8న ఆరంభమయ్యే ఎలైట్ గ్రూప్ బి మ్యాచుల కోసం బెంగాల్ జట్టు అక్కడికి వెళ్లాల్సి ఉంది.
మహమ్మారి నేపథ్యంలో వారాంతంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కరోనా సోకిందని బెంగాల్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి దేవవ్రత దాస్ ఈఎస్పీఎన్కు తెలిపారు. సుదీప్ ఛటర్జీ, అనుష్టుప్ మజుందార్, కాజీ జునైద్ సైఫి, గీత్ పూరి, ప్రదీప్త ప్రమాణిక్, సుజిత్ యాదవ్, సహాయ కోచ్ సౌరాషిష్ లాహిరికి పాజిటివ్ వచ్చిందని తెలిసింది.
కోల్కతాలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచులు, ట్రైనింగ్ సెషన్లలో ఆటగాళ్లు, కోచ్ పాల్గొన్నారని సమాచారం. పాజిటివ్ అని తెలిసిన తర్వాత అందరినీ ఐసోలేషన్కు పంపించారు. బెంగళూరుకు వెళ్లేముందు కోల్కతాలోనే మ్యాచులు ఆడాల్సిన ముంబయితో కోల్కతా సన్నాహక మ్యాచులు ఆడాల్సింది. వీటిని ఇప్పుడు రద్దు చేశారు.
ఇక ముంబయి తరఫున ఆడుతున్న టీమ్ఇండియా యువ ఆల్రౌండర్ శివమ్ దూబె, జట్టు వీడియో విశ్లేషకుడికి కొవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిసింది. ముంబయి జట్టు కోల్కతాకు బయల్దేరే ముందు వీరి ఫలితాలు వచ్చాయి. పాజిటివ్ అని తెలియడంతో వారిని ఐసోలేషన్కు పంపించారు.
దూబె స్థానంలో సైరాజ్ పాటిల్ను జట్టులోకి తీసుకున్నారు. కరోనా వల్ల కోల్కతాలోని స్థానిక క్రికెట్ టోర్నీలన్నీ రద్దు చేశారు. రంజీ ట్రోఫీ కోసం కోల్కతా, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, తిరువనంతపురంను బీసీసీఐ వేదికలుగా ఎంపిక చేసింది.
Also Read: WATCH: 'మమ్మా..' అంటున్న వామిక! తపించి పోతున్న కోహ్లీ, అనుష్క
Also Read: Kohli on 100th Test: వందో టెస్టుకు మీడియా ముందుకు కోహ్లీ..! షాకింగ్ విషయాలు చెబుతాడా??
Also Read: Lionel Messi Covid Positive: మెస్సీకి కరోనా.. మరో ఇద్దరికి కూడా!
Also Read: IND vs SA 2nd Test: వాండరర్స్లో 'వండర్'కు సిద్ధమైన కోహ్లీ.. 7 పరుగులు చేస్తే ఆ రికార్డు బద్దలే!
Also Read: Team India Schedule 2022: ఏడాదంతా క్రికెట్ పండగే! టీమ్ఇండియాకు వరుసగా కీలక సిరీసులు.. ప్రపంచకప్
Also Read: Jasprit Bumrah: పేస్ బౌలర్లకు బాధ్యతలు ఎందుకు అప్పగించకూడదు.. అవసరమైతే బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)