అన్వేషించండి

Diabetic Retinopathy: డయాబెటిక్ రెటినోపతితో కంటి చూపు పోతుందా? ఆయుర్వేదంతో కళ్లను కాపాడుకోవచ్చా?

సైలెంట్ కిల్లర్స్ వ్యాధుల్లో మధుమేహానికి అగ్రస్థానం ఇవ్వవచ్చు. ఇది ఒకసారి వస్తే వదిలించుకోవడం కష్టం. షుగర్ లేవల్స్ అధికంగా ఉంటే కళ్ళని కూడా దెబ్బతీస్తుంది.

మధుమేహం తీవ్రమైన పరిస్థితి. ఇది కళ్ళతో సహా వివధ అవయవాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. డయాబెటిక్ వల్ల రెటినోపతి సంభవిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేనప్పుడు కళ్ళను ప్రభావితం చేసే సమస్య. రెటీనా వెనుక భాగంలోని కాంతి సున్నితమైన కణజాలానికి సంబంధించి రక్త నాళాలు దెబ్బతింటాయి. డయాబెటిక్ రెటినోపతిలో తేలికపాటి దృష్టి సమస్యలే కాకుండా ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ చివరికి అంధత్వానికి దారి తీయవచ్చు.

సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం డయాబెటిస్ ఉన్న వారిని ప్రభావితం చేసే కంటి వ్యాధులు మాక్యులర్ ఎడెమా, కంటి శుక్లం, గ్లకోమా తో పాటు దృష్టి లోపానికి దారితీస్తుంది. ముందస్తు రోగనిర్ధారణ చేసుకుని చికిత్స తీసుకుంటే కంటి చూపును రక్షించుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్ల మంది ప్రజలు దృష్టి లోపంతో బాధపడుతున్నారు. వారిలో 3 మిలియన్ల మందికి డయాబెటిక్ రెటినోపతి ఉంది. ఇందులో రెండు దశలు ఉన్నాయి.

ప్రాథమిక దశ: నాన్-ప్రొలిఫెరేటివ్ అని కూడా పిలుస్తారు. ఇందులో రెటీనాలోని రక్తనాళాల గోడలు బలహీనపడతాయి. రక్తం, ఇతర ద్రవాలను లీక్ అవడం వల్ల దృష్టి సమస్యలకు కారణమవుతాయి.

అడ్వాన్స్డ్ స్టేజ్: ఇది రెటీనాలో కొత్త రక్తనాళాలు పెరగడం జరుగుతుంది. పెళుసుగా ఉంటాయి. సులభంగా రక్తస్రావం అవుతుంది. కనుగుడ్డులో డార్క్ స్పాట్స్ కలిగిస్తుంది. రక్తస్రావం అనియంత్రంగా మారితే దృష్టి పూర్తిగా తగ్గిపోతుంది.

రెటినోపతి లక్షణాలు, సంకేతాలు

  • మసక మసకగా కనిపించడం
  • కంట్లో మచ్చలు
  • రంగులను గుర్తించలేకపోవడం
  • చీకటి, ఖాళీ ప్రదేశాల్లో కళ్ళు కనిపించకపోవడం
  • పూర్తిగా దృష్టి కనిపించకపోవడం
  • కళ్ళలో నొప్పి
  • చదవడంలో ఇబ్బంది

ఆయుర్వేదం ద్వారా డయాబెటిక్ రెటినోపతికి చికిత్స చేయవచ్చు. ఈ వ్యాధి దశలను బట్టి కన్ను మూడు దోషాలను కలిగి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యం ప్రమాదాన్ని పెంచే ప్రధాన కారకాలు మానసిక ఒత్తిడి, ఆహారం. ఇవి నాళాల ఆకృతిని దెబ్బతీస్తాయి. ఆయుర్వేదంలో రెటినోపతికి చికిత్స ఉంటుంది. ఆయుర్వేద మందులు రెటినోపతిని నిరోధించగలవు. మీ రోజువారీ ఆహారంలో ఈ పదార్థాలు చేర్చుకున్నారంటే రెటినోపతి పరిస్థితి నుంచి బయటపడొచ్చు.

ఆమ్లా

ఉసిరి లేదా ఇండియన్ గూస్బెర్రీ రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ డైట్లో భాగంగా ఆహారంలో ఉసిరి రసం, ఉసిరికాయ మురబ్బా, ఉసిరి పొడి లేదా ఉసిరికాయ పచ్చడిని జోడించవచ్చు.

గిలోయ్

గిలోయ్ లేదా గుడుచీ వేప, మామిడి వంటి పెద్ద చెట్లపై పెరుగుతుంది. ఆయుర్వేదం మధుమేహుల కోసం దీన్ని సిఫార్సు చేస్తుంది. దీని చేదు రుచి కఫ, పిత్త, మీద సమతుల్య ప్రభావాన్ని కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ పైరేటిక్ లక్షణాలు ఉన్నాయి.

త్రిఫల

సర్వరోగ నివారిణి త్రిఫల చూర్ణం. త్రిఫల గ్లైకేషన్ ఎంజైమ్‌ల నిరోధం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులను కాపాడుతుంది.

జీవనశైలి

ప్రాణాయామ పద్ధతులు అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కంటి చూపును మెరుగుపరచడం కోసం యోగాలోని ముఖ్యమైన భాగం. నిప్పు, చంద్రుడు, సూర్యుని వంటి నిర్ధిష్ట వస్తువు మీద దృష్టి పెట్టాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: అలసటగా ఉంటుందా? ఇది లోపించడం వల్లే కావచ్చు!

టాప్ హెడ్ లైన్స్

TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget