అన్వేషించండి

Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?

Fact Check: కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లింలకు అనుకూలంగా ఉందంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలు నిజం కాదని ఫ్యాక్ట్‌చెక్‌లో తేలింది.

Congress Manifesto 2024: ఏప్రిల్ 23వ తేదీన కర్ణాటక బీజేపీ ఓ పోస్ట్ షేర్ చేసింది. ముస్లింలకు ప్రత్యేక రిజర్వేష్‌లు, ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున ఆస్తులనూ పంచిపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోందన్నది ఆ పోస్ట్ సారాంశం. సోషల్ మీడియాలో ఒక్కసారిగా దుమారం రేపాయి ఈ ఆరోపణలు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇలాంటి హామీలే ఉన్నాయంటూ బీజేపీ ప్రచారం మొదలు పెట్టింది. బీజేపీ చెబుతున్న దాని ప్రకారం..కాంగ్రెస్ మొత్తం ఆరు హామీలను అందులో చేర్చింది. అన్ని విద్యా సంస్థల్లో హిజాబ్‌కి అనుమతి, ముస్లింలకు ఆస్తులు పంచి పెట్టడం, ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్‌లు, మత పరమైన చట్టాల్ని అనుసరించే స్వేచ్ఛనివ్వడం, ముస్లింలను నేరుగా జడ్జ్‌లుగా నియమించడం, అన్ని సంస్థల్లోనూ ముస్లింలను కచ్చితంగా ఉద్యోగులుగా తీసుకోవాలని నిబంధన తీసుకురావడం.

X వేదికగా పెట్టిన పోస్ట్‌లో ఈ ఆరు హామీలనూ ప్రస్తావించి బీజేపీ. ఈ పోస్ట్ తెగ వైరల్ (పోస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అవుతోంది. ఇటీవలే ప్రధాని మోదీ కూడా కాంగ్రెస్ దేశ ఆస్తుల్ని ముస్లింలకు పంచి పెడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలోనే బీజేపీ పెట్టిన పోస్ట్‌ మరింత సంచలనం సృష్టించింది. అయితే...బీజేపీ చెబుతున్నట్టుగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇవేమీ లేవని తేలింది. Logically Facts సంస్థ ఫ్యాక్ట్ చెకింగ్ చేయగా బీజేపీ ఆరోపణల్లో నిజం లేదని వెల్లడైంది. లాజికల్లీ ఫ్యాక్ట్స్‌ టీమ్‌ క్షుణ్ణంగా పరిశీలించిన తరవాత ఈ విషయం వెల్లడించింది. విద్యా సంస్థల్లో హిజాబ్‌కి అనుమతినిచ్చే అంశం మేనిఫెస్టోలో ఎక్కడా ప్రస్తావించలేదని తేలింది. 

Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?

ఇక ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామన్న హామీ కూడా ఎక్కడా లేదని వెల్లడైంది. దేశవ్యాప్తంగా కులగణన సర్వే చేపడతామని మాత్రం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మైనార్టీ వర్గాలు సాధికారత సాధించేలా చర్యలు చేపడతామని వెల్లడించింది. ఇక ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్‌లు అంటూ బీజేపీ చేసిన ఆరోపణలూ నిజం కాదని తేలింది. అయితే...సామాజిక న్యాయం కిందట ప్రస్తుతం అమల్లో ఉన్న 50% రిజర్వేషన్‌ల పరిమితిని తొలగించి మరీ అవసరమైన వాళ్లకి రిజర్వేషన్‌లు కల్పిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (EWS) విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్‌లు ఇస్తామని మాత్రమే చెప్పింది.

Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?

ఎక్కడా ముస్లింల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదని ఫ్యాక్ట్‌చెక్‌లో తేలింది. ఇక ముస్లింలను జడ్జ్‌లుగా నియమిస్తామని ఇచ్చిన హామీలోనూ నిజం లేదని వెల్లడైంది. SC,ST,OBCలను సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జ్‌లుగా నియమించేందుకు చొరవ చూపిస్తామని కాంగ్రెస్ చెప్పింది. అంతే కానీ ముస్లింలను జడ్జ్‌లుగా చేస్తామని మేనిఫెస్టోలో చేర్చలేదని ఫ్యాక్ట్‌చెక్‌లో తేలింది. ప్రభుత్వ, ప్రైవేట్  సంస్థల్లో ముస్లింలను నియమించుకోవడాన్ని తప్పనిసరి చేస్తామని కాంగ్రెస్‌ చెప్పినట్టు బీజేపీ ఆరోపించింది. ఇందులోనూ నిజం లేదు. మొత్తంగా కర్ణాటక బీజేపీ పెట్టిన పోస్ట్‌ వైరల్ అవడం వల్ల అంతా అదే నిజమని విపరీతంగా షేర్ చేస్తున్నారు. పైగా మోదీ కూడా కాంగ్రెస్‌పై ఇదే తరహా ఆరోపణలు చేయడం వల్ల ఈ పోస్ట్‌పై అందరి దృష్టి పడుతోంది. మొత్తంగా చూస్తే కర్ణాటక బీజేపీ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని Logically Facts ఫ్యాక్ట్‌చెక్‌లో తెలిసింది. 

Also Read: ఈ యువతి 24 గంటలూ మెలకువతోనే ఉంటుందట, నిద్రపోనివ్వని జబ్బుతో నరకం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nani HIT 3 Telugu Trailer Reaction | జనాల మధ్యలో ఉంటే  అర్జున్..మృగాల మధ్యలో ఉంటే సర్కార్ | ABP DesamVirat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదేKarun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Shaik Rasheed : మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
New Toll System: టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Pawan Wife: పవన్ సతీమణి భక్తికి అంతా ఫిదా - అన్నా లెజ్‌నోవాకు అంతా  ఫ్యాన్స్ అయిపోయారుగా !
పవన్ సతీమణి భక్తికి అంతా ఫిదా - అన్నా లెజ్‌నోవాకు అంతా ఫ్యాన్స్ అయిపోయారుగా !
Embed widget