అన్వేషించండి

Yatra 2: ‘యాత్ర 2’ని ప్రకటించిన మహి వి రాఘవ్ - టాప్ క్లాస్ టెక్నీషియన్లతో - రిలీజ్ ఎప్పుడంటే?

ఎప్పట్నుంచో వార్తల్లో ఉన్న ‘యాత్ర 2’ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 2024 ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది.

2019 ఎన్నికలకు ముందు వచ్చిన ‘యాత్ర’ మంచి విజయం సాధించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను మమ్ముట్టి పోషించారు. అప్పటికి ఆనందో బ్రహ్మ, పాఠశాల వంటి చిత్రాలను తెరకెక్కించిన మహి వి.రాఘవ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని ‘యాత్ర 2’గా తెరకెక్కిస్తానని ఆయన గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు ఆ సినిమా కార్యరూపం దాల్చింది.

‘యాత్ర 2’ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 2024 ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుందని పోస్టర్ ద్వారా తెలిపారు. 2019 ఫిబ్రవరిలో ‘యాత్ర’ విడుదల అయింది. ఇప్పుడు సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత అదే నెలలో, ఎన్నికల ముంగిట ‘యాత్ర 2’ని రిలీజ్ చేయనున్నారు. ‘యాత్ర 2’ కీలక టెక్నీషియన్ల వివరాలను కూడా పోస్టర్‌లో తెలిపారు.

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఈ సంవత్సరం మార్చిలో వచ్చి రూ.100 కోట్లు కొట్టిన నాని ‘దసరా’ సంగీత దర్శకుడు ఆయనే. అలాగే ‘సాహో’, ‘సర్కారు వారి పాట’ వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన మదికి డీవోపీ బాధ్యతలు అప్పగించారు.

అయితే ఇందులో టైటిల్ రోల్ ఎవరు పోషిస్తారన్నది మాత్రం తెలియరాలేదు. గతంలో సూర్య, దుల్కర్ సల్మాన్‌ల పేర్లు బలంగా వినిపించాయి. ప్రస్తుతం తమిళ హీరో జీవా... వైఎస్ జగన్ పాత్రలో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య గత చిత్రం ‘కస్టడీ’లో తనకు అన్నయ్య పాత్రలో జీవా నటించారు. మిగతా నటీనటుల విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

'యాత్ర 2' సినిమాలో పాయింట్ ఏంటి?
వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి ముందు చేసిన పాదయాత్ర ఆధారంగా 'యాత్ర' తీశారు మహి వి. రాఘవ్. 'యాత్ర 2'లో వైయస్సార్ తనయుడు జగన్ మొగం రెడ్డి చేసిన పాదయాత్రను చూపించబోతున్నారు. తండ్రి మరణం నుంచి తనయుడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి మధ్య ఏం జరిగింది? అనేది చూపించబోతున్నారు. దాంతో ఈ సినిమాపై సామాన్య ప్రేక్షకులలో మాత్రమే కాదు... రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. 

'రంగం' సినిమాతో తెలుగులోనూ జీవా హిట్ అందుకున్నారు. తెలుగులో పలు హిట్ చిత్రాలు నిర్మించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బీ చౌదరి కుమారుడే ఆయన. ఆల్రెడీ రియల్ లైఫ్ క్యారెక్టర్ చేసిన అనుభవం ఉంది. టీమ్ ఇండియా తొలి వరల్డ్ కప్ విజయంపై రూపొందిన '83' సినిమాలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో కనిపించారు. 

కరోనా కారణంగా లభించిన సమయాన్ని  మహి వి. రాఘవ్ సద్వినియోగం చేసుకున్నారు. ఆ సమయంలోనే కొన్ని కథలు రాశారు. స్క్రిప్ట్ పనులు సైతం పూర్తి చేశారు. 'సేవ్ ద టైగర్స్', 'సైతాన్' ఆ కథల్లోనివే. ఈ రెండూ కాకుండా 'సిద్దా లోకం ఎలా ఉంది నాయనా' అని ఓ సినిమా కూడా తీశారు. అది త్వరలో విడుదల కానుంది. ఇప్పుడు మహి వి. రాఘవ్ ఏం చేయబోతున్నారు? అంటే... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంగా ఆధారంగా తీయబోయే 'యాత్ర 2' ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Tirumala Kalyana Ratham:   తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు  శ్రీవారి కళ్యాణ రథం!
తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణ రథం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Tirumala Kalyana Ratham:   తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు  శ్రీవారి కళ్యాణ రథం!
తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణ రథం!
Harish Rao Tweet: కాంగ్రెస్ పాలనలో పోలీసుల జీవితాలకే భద్రత లేదు - రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు
కాంగ్రెస్ పాలనలో పోలీసుల జీవితాలకే భద్రత లేదు - రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు
Pradeep Machiraju: బుల్లితెరపై ప్రదీప్ రీ ఎంట్రీ... వెంకీ మామతో 'బ్రహ్మముడి' కావ్య కామెడీ... సంక్రాంతి వేడుక కోసం
బుల్లితెరపై ప్రదీప్ రీ ఎంట్రీ... వెంకీ మామతో 'బ్రహ్మముడి' కావ్య కామెడీ... సంక్రాంతి వేడుక కోసం
Parents Property Rights: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
Renu Desai: రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
Embed widget