Upasana: మెగా ఫ్యామిలీకి వారసుడొస్తున్నాడా? ఉపాసన హింట్ ఇచ్చేసింది!
'ఆర్ఆర్ఆర్' అంటూ రిలేషన్, రీప్రొడ్యూస్, రోల్ ఇన్ లైఫ్ గురించి సద్గురుతో మాట్లాడింది ఉపాసన.

అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో సద్గురు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ ని మెగాస్టార్ కోడలు ఉపాసన కామినేని కొణిదెల హోస్ట్ చేసింది. ఆమె సద్గురుని కొన్ని ప్రశ్నలు సంధించింది. 'ఆర్ఆర్ఆర్' అంటూ రిలేషన్, రీప్రొడ్యూస్, రోల్ ఇన్ లైఫ్ గురించి సద్గురుతో మాట్లాడింది ఉపాసన. దానికి ఆయన సమాధానాలు ఇచ్చారు. రిలేషన్ అనేది ఒకరి పర్సనల్ విషయమని దాని గురించి స్పందించలేనని అన్నారు.
ఎబిలిటీ టూ రీ ప్రొడ్యూస్(పిల్లలను కనడం) అయితే వద్దని చెబుతానని అన్నారు. అదే నువ్ ఒకవేళ లేడీ టైగర్ అయి ఉంటే పిల్లలను కనమని చెప్పేవాడినని.. ఎందుకంటే అవి అంతరించిపోతున్నాయని అన్నారు. మనుషుల సంఖ్య అయితే చాలా ఎక్కువగా ఉందని.. అది అంతరించే జాతి కాదు కాబట్టి, పిల్లలను కనకుండా ఉండటమే అందరూ చేసే సాయమని అన్నారు. ఎవరైతే పిల్లలను కనకుండా ఉంటారో వారికి అవార్డులు ఇస్తానని ప్రకటించారు సద్గురు.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఉపాసన.. సద్గురుతో ఇంటరాక్షన్ గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. సద్గురుతో మాట్లాడడం, ఎన్నో విషయాల మీద చర్చించడం ఎంతో సంతషంగా ఉందని అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల మీద ప్రాక్టికల్ గా ఆయన సమాధానాలు ఇచ్చారని అన్నారు. ఇదే సందర్భంలో పిల్లలను కనకపోతే సద్గురు ఇస్తానన్న అవార్డుల గురించి మాట్లాడుతూ.. 'మా తాత మీరిచ్చే అవార్డుని స్వీకరించడానికి ఒప్పుకోవడం లేదు' ని చెప్పింది.
అంటే ఉపాసన పిల్లలను కంటున్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చిందన్నమాట. అయితే అది ఎప్పుడు అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ కచ్చితంగా మెగాస్టార్ ఫ్యామిలీ వారసుడు వస్తాడనే విషయం మాత్రం కన్ఫర్మ్ చేసింది ఉపాసన.
Also Read : సీరియస్గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?
Also Read : గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్
View this post on Instagram
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















