అన్వేషించండి

Trinayani Serial November 11th: తిలోత్తమ తల పగలగొట్టిన గాయత్రీ పాప..!

Trinayani Serial Today Episode : నయని పుట్టకముందే తన భవిష్యత్‌ను గాయత్రీ దేవి రాసిందని తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today November 11th Episode : తిలోత్తమ, వల్లభ ఇద్దరూ పెట్టె దగ్గరకు వస్తారు. తాళపత్రలు చదవాలని బూతద్దం పట్టుకొని వచ్చి చదవడానికి ప్రయత్నిస్తారు. అయితే గాయత్రి పాప వారిని చూసి కర్టెన్‌ లాగితే అది తిలోత్తమకు తగిలి కుయ్యో మెర్యో అంటుంది. దీంతో ఇంటి సభ్యులంతా అక్కడికి వస్తారు. గరువుగారు కూడా వస్తారు. ఎద్దులయ్య, డమ్మక్కలకు ఎవరి వల్ల జరిగింది గాయత్రీ వల్లేనా అని అడుగుతారు. అవునని వారు చెప్తారు. ఇక ఆ పాప కర్టెన్‌ లాగడం వల్లే ఇదంతా జరిగిందని వల్లభ చెప్తే తిలోత్తమ పాపను తిడుతుంది. విశాల్‌ ఆమెకు అడ్డుపడతాడు. చిన్న పిల్లమీద అంత అక్కసు ఎందుకని మండిపడతాడు. అయితే తిలోత్తమ తాళపత్రాలు చదవాలని ప్రయత్నించిందని అందరూ చివాట్లు పెడతారు. 

గురువుగారు: తిలోత్తమ మానవులు ఆ రాతలు చదవలేరని చెప్పాను కదా 

తిలోత్తమ: మనుషులు రాయకపోతే ఇంకెవరు రాస్తారు గురువుగారు

పావనామూర్తి: చిన్నోడా ఆ తాళపత్రాలు భద్రంగా ఈ పెట్టెలో పెట్టేయ్ 

ఎద్దులయ్య: సమస్య జటిలం కాకుండానే పక్కదారి పట్టింది అని అనడంతో అక్కడితో ఆ సీన్ ముగుస్తుంది. తర్వాత గురువుగారు నయనితో ఒంటరిగా మాట్లాడుతారు. 

గురువుగారు: అడగాలని ఆగిపోయావేందుకు నయని

నయని: విశాలాక్షి శ్రీశైలం వెళ్లేముందు నువ్వు ఎవరో తెలుసుకో అమ్మా అని నన్ను సందిగ్ధంలో పడేసింది. నాగులాపురం నుంచి తీసుకొచ్చిన పెట్టెలో నేను ఎవరని నా భవిష్యత్ ఏంటని రాసుందని మీరు అంటున్నారు. చూస్తే ఏమీ కనబడటం లేదు.

గురువుగారు: నుదిటి రాత కనపడదు నయని

నయని: తాళపత్రాల్లో ఉండేది చేతిరాతే కదా స్వామి

గురువుగారు:  రాసింది ఎవరో కాదు నీ భర్తను కన్న తల్లి

నయని: అమ్మగారు నా జాతకం రాసిందా

గరువుగారు: ఇక్కడే సరిగ్గా అర్ధం చేసుకోవాల్సింది జాతకం వేరు భవిష్యత్ వేరు

నయని: అమ్మగారికి కూడా ముందే ఏం జరగనుందో తెలిస్తుందా స్వామి

గురువుగారు: గాయత్రీదేవి కూడా విశాలాక్షి అమ్మవారి మీద అపారమైన భక్తి, విశ్వాసం కలిగి ఉండేది. తను చేసిన పూజల వల్ల చేసుకున్న పుణ్యాల వల్ల ఒకనాడు అమ్మవారు ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చారు. ఒక కోరిక కోరుకో అని అమ్మవారు గాయత్రీ దేవి చెప్పగా తన కొడుకు కోసం కాకుండా తన కొడుకును పసిబిడ్డలా చూసుకొనే తన కోడలు రావాలని.. తన భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పమని అడిగింది. భర్త ఎంత సంపాదించిన ఎంత కీర్తి గడించినా భార్య గుణవంతురాలై ఉండాలి. లేదంటే అష్టఐశ్వర్యాలు ఉన్నా ఆ ఇంటికి అనర్ధమే. అందుకే నువ్వు ఇంకా మీ అమ్మ గర్భంలో ఉన్నప్పుడే నీ ఈ జన్మ ఎలా ఉంటుందో అని తాళపత్రాల్లో లిఖించారు. 

నయని: అంటే మా తాతయ్య నా జాతకం రాస్తే.. నేను పుట్టక ముందే నా జాతకం విశాలాక్షి అమ్మవారు చెప్తే గాయత్రీ దేవి గారు రాశారా స్వామి. మరి ఎందుకు అమ్మగారు నాతో ఒక్క మాట చెప్పలేదు. చెప్పకూడదూ అనా..

గురువుగారు: చెప్పదు. చెప్పలేదు.. నయని నీకు రానున్న ఆపద కనిపిస్తుంది. దాన్ని పక్కదోవ పట్టించి ఆపదను తప్పిస్తావు అన్న వరం పొందావు. అయితే నీ భవిష్యత్ ఏంటి అని విశాలాక్షి అమ్మవారు చెప్పారు కానీ ఓ షరతు పెట్టారు. రాస్తున్నంత వరకు భావోగ్వేగానికి గురైన గాయత్రీ దేవి రాసిన తర్వాత వాటిని మరచి పోతుందని.. చదవాలి అన్నా అవి కనిపించవవు. మనుషులెవ్వరూ వాటిని చదవ లేరు. చదవాలి అని ప్రయత్నిస్తే వారికి గాయాలు తప్పవు అని స్వామీజీ చెప్పారు. ఇంకా నయని ఏదో అడగబోతుంటే శుభం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

ఇక తిలోత్తమ, వల్లభ ఆ ఘటన గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా గాయత్రీ పాప వల్లే జరిగిందని వల్లభ అంటే తిలోత్తమ వాటిని కొట్టి వేస్తోంది. ఇక నయని ఒంటరిగా ఓ చోట ఉంటే విశాల్ తన దగ్గరకు వస్తాడు. పిల్లల్ని ఎందుకు హాసిని వదిన దగ్గర ఉంచమన్నావ్ అని నయనినీ అడుగుతాడు. అందుకు నయని అందర్ని వదిలేయొచ్చు కానీ గాయత్రీ పాపని మాత్రం ఎవరో ఒకరు కనిపెడుతూనే ఉండాలి. తన వల్ల తిలోత్తమ అత్తయ్యకి ఈ పరిస్థితి అని నయని సీరియస్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today May 25th:యువరాజుకు కౌషికి ఇచ్చిన హామీ ఏంటి..? నిషికను దివ్యాంక ఎందుకు బెదిరించింది.?
జగద్ధాత్రి సీరియల్: యువరాజుకు కౌషికి ఇచ్చిన హామీ ఏంటి..? నిషికను దివ్యాంక ఎందుకు బెదిరించింది.?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పాపని చూసి లక్ష్మీ బిడ్డ అని అనుమానపడ్డ సహస్ర! కొడుకుని తీసుకొని పారిపోతున్న లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పాపని చూసి లక్ష్మీ బిడ్డ అని అనుమానపడ్డ సహస్ర! కొడుకుని తీసుకొని పారిపోతున్న లక్ష్మీ!
Godavari Serial Today May 25th: 'గోదావరి' సీరియల్: శంకర్ ఇంట్లో లవ్ లెటర్ గొడవ! మురళీ బాధ పడటానికి కారణమేంటి?
'గోదావరి' సీరియల్: శంకర్ ఇంట్లో లవ్ లెటర్ గొడవ! మురళీ బాధ పడటానికి కారణమేంటి?
Meghasandesam Serial Today May 25th: ‘మేఘసందేశం’ సీరియల్‌: తారను కొట్టిన భూమి – శరత్‌ చంద్రను రెచ్చగొట్టిన అపూర్వ  
‘మేఘసందేశం’ సీరియల్‌: తారను కొట్టిన భూమి – శరత్‌ చంద్రను రెచ్చగొట్టిన అపూర్వ  

వీడియోలు

RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Will Jacks Fielding in RR vs MI IPL 2026 | గాల్లో తేలుతూ విల్ జాక్స్ ఫీల్డింగ్
David Warner Blocked by SRH ? | డేవిడ్ వార్నర్‌ను బ్లాక్ చేసిన SRH?
IPL 2026 RCB vs GT Qualifier | SRH ఫ్యాన్స్ ను భయపడుతున్న ప్లేఆఫ్స్ సెంటిమెంట్
Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan on Nageshwar: జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
GHMC MeeSeva WhatsApp Number: అరచేతిలోనే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌! వాట్సాప్‌లోనే బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి 9 రకాల సేవలు!
అరచేతిలోనే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌! వాట్సాప్‌లోనే బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి 9 రకాల సేవలు!
Telangana Women Empowerment Schemes: మహిళా సంఘాలకు రైస్‌ మిల్లలు, గోదాములు, సూపర్ బజార్‌లు- ముఖ్యమంత్రి కీలక ప్రకటన
మహిళా సంఘాలకు రైస్‌ మిల్లలు, గోదాములు, సూపర్ బజార్‌లు- ముఖ్యమంత్రి కీలక ప్రకటన
Anantha Sriram parents protection: చేగొండి జోగయ్య కుమారుడి నుంచి తల్లిదండ్రులకు ప్రాణహాని - పోలీసులకు అనంతశ్రీరామ్ ఫిర్యాదు - అసలు కేసేమిటంటే?
చేగొండి జోగయ్య కుమారుడి నుంచి తల్లిదండ్రులకు ప్రాణహాని - పోలీసులకు అనంతశ్రీరామ్ ఫిర్యాదు - అసలు కేసేమిటంటే?
Maa Inti Bangaaram Trailer : మా ఇంటి బంగారం ట్రైలర్ - చాలా రోజుల తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్‌లో సమంత
మా ఇంటి బంగారం ట్రైలర్ - చాలా రోజుల తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్‌లో సమంత
AP DSC Merit List Controversy: ఏపీ మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్ - భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు
ఏపీ మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్ - భారీగా అక్రమాలు జరిగాయని సంచలన ఆరోపణలు
TamilNadu Farmers Loan Waiver: రైతులకు రూ.50వేల రుణమాఫీ - తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం
రైతులకు రూ.50వేల రుణమాఫీ - తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం
Rambha : నాన్నా ఐ మిస్ యూ - ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో తీవ్ర విషాదం
నాన్నా ఐ మిస్ యూ - ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో తీవ్ర విషాదం
Embed widget