Podarillu Serial Today May 14th:మహాలక్ష్మీకి పెద్ద కంపెనీలో ఇంటర్వూ ఆఫర్...భార్య వదిలివెళ్లిపోతుందేమోనని చక్రికి బెంగ
Podarillu Serial Today Episode May 14th:మహాలక్ష్మీకి పెద్ద కంపెనీలో ఇంటర్వూ ఆఫర్...భార్య వదిలివెళ్లిపోతుందేమోనని చక్రికి బెంగ

Podarillu Serial Today Episode: మాధవ్తో గాయత్రి దంపతుల కూల్ డిస్కషన్తో పొదరిల్లు సీరియల్ మే 14 నాటి ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. గాయత్రి,ఆమె భర్త భోజనానికి వచ్చి మాధవ్తో సరదాగా మాట్లాడతారు.మీరు ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదని గాయత్రి భర్త మాధవ్ను అడుగుతాడు. మీరే ఏమీఅనుకోవద్దని మీకన్నా మీ తమ్ముడు ముందు పెళ్లి చేసుకోవడంతో అడిగానని అంటాడు.వెంటనే చక్రి కల్పించుకుని మాది లవ్ మ్యారేజీ అని....మా ఆవిడకు వాళ్ల తల్లిదండ్రులు వేరే పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తుండటంతో మేం పెళ్లిచేసుకోవాల్సి వచ్చిందని చెబుతాడు.
మ్యాట్రిమోనిలో పెళ్లి సంబంధాలు చూస్తున్నామని...మంచి సంబంధం కుదిరితే పెళ్లి చేస్తామని మహాలక్ష్మీ చెబుతుంది. మీరు ఎలాగూ మాకు బంధువులు అయిపోయారు కాబట్టి....మీ తరఫున మంచి అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పండని చక్రి అంటాడు. మా నాన్నగారికి చాలా బాగా తెలుసని తప్పకుండా మాధవ్కు ఓ మంచి సంబంధం చూస్తామని చెబుతాడు.ఇంతలో మహాలక్ష్మీ చక్రిని పక్కకు తీసుకెళ్లి గట్టిగా తిడుతుంది.. మీ అన్నయ్య అంటే వంట పనుల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి గుర్తు ఉండి ఉండదు....మీ బుద్ధి ఏమైందని నిలదీస్తుంది. కొత్తగా మన ఇంటికి వచ్చినవారికి బట్టలు పెట్టాలన్న జ్ఞానం కూడా లేదా అని మండిపడుతుంది. నా దగ్గర కొత్త డ్రెస్ ఉందని...దాన్ని గాయత్రికి ఇస్తానని మహా అంటుంది. చక్రి కూడా తన వద్ద ఓ వాచ్ ఉందని తీసుకొచ్చి చూపిస్తాడు. ఇద్దరూ కలిసి వారికి బట్టలు పెట్టి అక్కడి నుంచి సాగనంపుతారు.
Also Read: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీ కడుపు సంగతి నర్మద, ప్రేమలు తేల్చేస్తారా! రెచ్చిపోయిన సాగర్.. ధీరజ్ని అపార్థం చేసుకున్నాడా!
గాయత్రి పుట్టింటి నుంచి అత్తగారింటికి బయలుదేరుతుంది.అప్పగింతలు చెబుతూ తాయరు, పురుషోత్తం కన్నీళ్లు పెట్టుకుంటారు. తాయరు కూతురుని కౌగిలించుకుని ఏడుస్తుంది.కానీ గాయత్రి ఎలాంటి ఫీలింగ్ లేకుండా నిల్చుండిపోతుంది. అల్లుడు కుటుంబం అప్పటికే కారు ఎక్కడంతో తాయరు కూతురుని నిలదీస్తుంది. పాతికేళ్లుగా ప్రేమించిన వాడి కోసం ఎక్కి ఎక్కి ఏడ్చి గోల చేశావని...అంతకన్నా ప్రేమగా పాతికేళ్లు పెంచిన నాకోసం నీ దగ్గర ఒక్క కన్నీటి చుక్క కూడా లేదా అని అడుగుతుంది. నేను ఎక్కిఎక్కి ఏడ్చి నా కన్నీళ్లు మొత్తం ఇంకిపోయేలా చేసింది నువ్వేనని గాయత్రి తల్లిపై మండిపడుతుంది. నా సంతోషం నా నుంచి దూరం చేసి మీ పంతం నెగ్గించుకున్నారు కదా అదేచాలని అంటుంది. మీరు నా నుంచి ఎలాంటి ప్రేమ ఆశించవద్దని గట్టిగా చెబుతుంది.మీరు చెప్పినట్లే మీకు నచ్చిన వాడిని చేసుకున్నానని....సంతోషంగా వెళ్తున్నానని భ్రమపడంటూ కారు ఎక్కి గాయత్రి వెళ్లిపోతుంది.
Also Read:జగద్ధాత్రి సీరియల్ నటి దీప్తి మన్నే గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్! ఫ్రెండ్తో ఆడిషన్కు వెళ్లి సీరియల్ ఆఫర్ ఎలా కొట్టేసింది!
మహాలక్ష్మీకి పెద్ద కంపెనీలో ఇంటర్వూ ఆఫర్ వచ్చిందని తెలిసి ఇంట్లో అందరూ సంతోషించినా.....చక్రి మాత్రం చాలా బాధపడతాడు. ఈ ఉద్యోగం వస్తే తను ఇక్కడి నుంచి వెళ్లిపోతుందని అనుకుంటాడు. అయితే ఇంట్లో ఎవరూ మహాను డిస్టర్బ్ చేయవద్దని తను ఇంటర్వూకు ప్రిపేర్ అవుతుందని మాధవ్ అందరికీ చెప్పి పంపించేస్తాడు. ఇంతలో నిహారిక మహాకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెబుతుంది. మనం ఎప్పుడూ కలిసే చోట కలుద్దామని చెప్పగా....నువ్వు అక్కడ ఎలా ఉంటున్నావో చూడాలి కదా అందుకే వస్తున్నానని చెప్పడంతో మహాకు ఏం చేయాలో అర్థం కాదు.కన్నా మరింత కంగారుపడిపోతాడు. ఈ ఇల్లు నాకే నచ్చదని...ఇక మీ వదినకు ఎలా నచ్చుతుందని అంటాడు. చక్రి, కేశవ్్, మాధవ్కు ఫోన్ చేసి రమ్మంటాడు. ఇంతలో మహా ఇల్లు కొంచెం శుభ్రం చేస్తుంది. గాయత్రి కారులో ఇంటికి రానే వచ్చేస్తుంది.
Also Read:సూర్యనారాయణ ఇంటి ముందుకొచ్చి గొడవపెట్టుకున్న సరోజ...కోడలు సింధూ చేసిన పని పెద్దయ్యకు చెప్పిన సరోజ
ట్రెండింగ్ వార్తలు





















