Podharillu Serial Today April 3rd:తమ్ముళ్లపై మాధవ్ కోప్పడటానికి కారణమేంటి..? పెద్దికి మహా ఎందుకు క్షమాపణలు చెప్పింంది.?
Podharillu Serial Today Episode April 3rd:తమ్ముళ్లపై మాధవ్ కోప్పడటానికి కారణమేంటి..? పెద్దికి మహా ఎందుకు క్షమాపణలు చెప్పింంది.?

Podharillu Serial Today Episode: గాయత్రి వాళ్ల ఇంటి దగ్గర గొడవ జరుగుతున్న విషయం మాధవ్కు చెబుతారు. మీ అన్నదమ్ములతోపాటు మీ చక్రి వాళ్ల ఆవిడ మహాలక్ష్మీని కూడా వాళ్లు అవమానిస్తున్నారని చెప్పడంతో మాధవ్ చాలా కోపంగా బయలుదేరతాడు. ఎంత బ్రతిమాలినా గాయత్రి తల్లిదండ్రులు వినకపోవడంతో మహాలక్ష్మీ వాళ్లందరినీ తీసుకుని వెనక్కి తీసుకుని వెళ్తుంది. ఇంటికి వెళ్లిన మహాతోపాటు కొడుకులను చూసి నారాయణ గట్టిగా కోప్పడతాడు. నామాట వినకుండా వెళ్లినందుకు బాగా అయ్యిందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.
చిన్నప్పటి నుంచి వాళ్లను చూస్తున్నారు...మీకు వాళ్ల సంగతి తెలియదా అని చక్రిపై కోప్పడతాడు. న్యాయంగా వాళ్లకు రావాల్సిన వాటా మొత్తం పంచుకున్నా....మళ్లీ గొడవ చేసి నా ఆస్తి కూడా కొట్టేయాలని చూస్తున్నారని చెబుతాడు. నేను ఈ ఇంటి ముందే ఎందుకు ఉంటున్నానో తెలుసా....ఈ ఇంటిని వాళ్లు కొట్టేయకుండా వాచ్మెన్లా కాపలా కాస్తున్నానని అంటాడు. నా బిడ్డలకు నిలువు నీడలేకుండా చేస్తారన్న భయంతోనే కుక్కలా ఈ ఇంటిని కాపాడుకుంటున్నానని అంటాడు. ఆ మాటలు విన్న కొడుకులు వాళ్ల నాన్నపై మండిపడతారు.
మీరు ఎప్పటికీ మీనాన్నను అర్థం చేసుకోలేరని మహాలక్ష్మీ అందరిపై మండిపడుతుంది. ఆయన తాగిపడేసే సీసాల లెక్కలు చూడటం మానేస్తే ఆయన మనసు ఎలాంటిదో తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆయన చేసే పనులు ఎలా ఉన్నా ఆయనలో మాత్రం మనకన్నా గొప్ప విషయం ఏదో ఉందని చెబుతుంది.లేకపోతే నేను చక్రిని ఇష్టంలేని పెళ్లిచేసుకున్నానని తెలిసినా, ఈ ఇల్లు వదిలి వెళ్లిపోతానని తెలిసినా....
నాకోసం యాదగిరిగుట్ట వరకు వచ్చారని...నా ప్రాణాల కాపాడటానికి తన ప్రాణాలు కూడా అడ్డుపెట్టారంటేనే ఆయన ఎంత మంచివాడో అర్థమవుతుందని అంటుంది. ఇంతలో అక్కడికి మాధవ్ వచ్చి అందరూ కలిసి ఎక్కడికి వెళ్లారని నిలదీస్తాడు. నీకు పెళ్లి చేయడానికి వీళ్లంతా పెద్దమనుషులై పెళ్లి సంబంధం కుదర్చడానికి వెళ్లారని నారాయణ మాధవ్కు చెబుతాడు. అక్కడ వాళ్లు చేసిన అవమానం గురించి చెబుతాడు. నా మాట అంటే అంత లెక్కలేకుండా పోయిందని మాధవ్ అందరిపై మండిపడతాడు. వాళ్లను ఏం అనవద్దని...మీ బాధ చూడలేక నేనే వాళ్లను తీసుకుని వెళ్లానని మహా చెబుతుంది.
ఎవరు చెప్పారు నేను బాధపడుతున్నానని పెద్ది అంటాడు. మరి నువ్వు, గాయత్రి తెల్లవారుజామున ఎందుకు ఏడుస్తూ మాట్లాడుకున్నారని అంటుంది. మాకు ఎలాంటి బాధలేదని చెప్పడంతో మహా బాధపడుతుంది. అందరికీ సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తమ్ముళ్లపైనా మాధవ్ చాలా కోప్పడతాడు. తెల్లారి మళ్లీ మామూలుగా అందరితో కలిసిపోవడం చూసి మహాలక్ష్మీ ఆశ్చర్యపోతుంది. మీరు మీ తమ్ముళ్లతో రెండు,మూడురోజులు మాట్లాడరేమో అనుకున్నానని అంటుంది. అయినా మీరు చేసింది నాకోసమే అయినప్పుడు నేను ఎందుకు మీపై కోపం పెంచుకుంటానని అంటాడు.
ఫోన్ కోసం మెకానిక్ షాపు దగ్గరకు వచ్చిన శైలూ అతన్ని బ్రతిమలాడుతుంది. నిజంగా నాదగ్గర అన్ని డబ్బులు లేవని అంటుంది. కనీసం నా ఫాలోవర్స్ కోసం ఓ రీల్చేసుకోనివ్వమని అడిగితే...ఫోన్ తీసుకుని పారిపోకుండా ఉండేందుకు తన చేతిని శైలూ చేతితో కట్టిసే రీల్ చేసుకునేందుకు అంగీకరిస్తాడు. శైలూ రీల్స్ చేస్తుండగా....అతని గురింంచి పాటలు పాడుతున్న ఫీలింగ్ వస్తుంది కేశవ్కు. శైలూపైనా కేశవ్కు చిన్నచిన్నగా ప్రేమ మొదలవుతుంది.























