Nindu Noorella Saavasam Serial Today September 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీకి గురిపెట్టిన అరవింద్ – అమర్, భాగీ మధ్య ఐస్ క్రీం రొమాన్స్
Nindu Noorella Saavasam Today Episode: అమర్, భాగీలను హోటల్ లో చూసిన మనోహరి కుళ్లుకుంటుంది. ముసుగు వేసుకుని హోటల్ లోపలికి వెళ్లడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అరవింద్ ఒక దగ్గర బైక్ ఆపి ఇప్పుడు ఎలా అనుకుంటాడు. మరోవైపు స్కూటర్ మీద అమర్, భాగీ రావడం చూసి పక్కు వెళ్లి దాక్కుంటాడు. వాళ్లు వెళ్లాక వెనకాలే ఫాలో అయితే బెటర్ అనుకుంటాడు. అమర్ స్కూటర్ తీసుకొచ్చి అరవింద్ బైక్ పక్కనే ఆపి పక్కనే ఉన్న హోటల్ లోకి వెళ్తాడు. ఇంతలో అరవింద్ అనుచరుడు గన్ తీసుకొచ్చి అరవింద్ ఇచ్చి వెళ్తాడు. గన్ తీసుకుని లోపలికి వెళ్తాడు అరవింద్.
భాగీ: ఏంటీ మనం బయలుదేరినప్పుటి నుంచి అటూ ఇటూ చూస్తూనే ఉన్నారు.
అమర్: ఏం లేదు మిస్సమ్మ. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎప్పుడూ నా పక్కనే ఉండు దూరంగా వెళ్లకు.
భాగీ: అయ్యో ఈనేంటి మరీ ఇంత డైరెక్టుగా చెప్పేస్తున్నారు. దేవుడా నువ్వు ఉన్నావయ్యా ( అని మనసులో అనుకుంటుంది.) సరేనండి.
అమర్: నేనెప్పుడూ నీ పక్కనే ఉంటాను నువ్వు కంగారు పడకు.
భాగీ: నా గురించి ఇంతలా ఆలోచించే భర్తను ఇచ్చావా? దేవుడా?
అని మనసులో అనుకుంటుంది. మరోవైపు అరవింద్ గన్ తీసి అమర్ కు ఎయిమ్ చేస్తాడు. మరోవైపు కారులో వస్తున్న ఆరు.. ఈయన, మిస్సమ్మ ఏంటి ఇంకా కనబడరు అనుకుంటుంది. త్వరగా పోనీ మను. అంటుంది. ఇంతలో రాథోడ్ మనోహరి గారు దాబా వెళ్లిపోతుంది గాడి రుక్ జావ్. అంటాడు. దీంతో మనోహరి, ఆరు షాక్ అవుతారు. రాథోడ్ కంగారుపడతాడు.
ఆరు: అవును మను పేరు ఇతనికి చెప్పలేదు కదా?
మనోహరి: నా పేరు నీకెలా తెలుసు? హలో అడుగుతుంది. నిన్నే నా పేరు నీకెలా తెలుసు?
రాథోడ్: అది ఇందాకా మీది చెప్పింది.
మనోహరి: నేను మాటల్లో చెప్పానా? నేనెప్పుడు మాట్లాడాను. నీకెప్పుడు చెప్పాను.
రాథోడ్: అవును కదాజీ.. మీది మాటలాడ లేదు కదా? అయినా ఎందుకు మాటలాడలేద జీ దేవుడు మనుషులకు ఎందుకు నోరు ఇచ్చింది. మాటలాడటానికే కదా? నెక్ట్ టైం అయినా ఈసారి లాగా కాకుండా మాట్లాడండి జీ
అంటూ కారు దిగిపోతాడు రాథోడ్. ఇంతలో రాథోడ్ వైపు చూస్తూ అక్కడే ఉన్న స్కూటర్ చూసి బాబ్జీ చెప్పిన బండి అనుకుంటూ హోటల్ లోకి చూడగానే అక్కడ అమర్, భాగీ కనబడతారు. వాళ్లను చూసిన మనోహరి కుళ్లుకుంటుంది. ఆరు మాత్రం ఎలాగైనా అక్కడకు వెళ్లి మిస్సమ్మకు నిజం చెప్పాలనుకుంటుంది. ఇంతలో మనోహరి బుర్ఖా వేసుకుని వెళ్తుంది. మరోవైపు అరవింద్ గన్ భాగీకి ఎయిమ్ చేసి ఉంటాడు. ఇంతలో రాథోడ్ గన్ కు అడ్డం వస్తాడు. భాగీకి సైగ చేస్తుంటే భాగీ తిడుతుంది. మనోహరి బుర్ఖా వేసుకుని వెళ్లి అమర్ వాళ్ల పక్కన కూర్చుంటుంది.
ఆరు: కొంచెం స్పేస్ దొరికినా వాడుకోవాలి. మిస్సమ్మను కాపాడుకోవాలి.
మరోవైపు
భాగీ: మా ఆయన్ను చూశావా? కండలు చూశావా? చంపేస్తారు.
రాథోడ్: మిమ్మల్ని చంపేస్తారు. అటూ ఇటూ చూస్తూ ఉండు.
ఆరు: అయ్యో ఇప్పుడు మిస్సమ్మకు నిజం చెప్పాలంటే నా గురించి అడుగుతుంది. ఎలా చెప్పాలి ఇప్పుడు. వీడెవడు మిస్సమ్మకు ఏవో సైగలు చేస్తున్నాడు.
అమర్: ఏయ్ లూజు జ్యూస్ ఉన్నది తాగడానికి . ఇలా అడుకోవడానికి కాదు.
భాగీ: అవునా జ్యూస్ తాగడానికి ఇచ్చారా? నేనింకా ఇలా ముందు పెట్టుకుని మీలా ఇలా దిక్కులు చూడటానికి ఇచ్చారనుకున్నా.. నేను వాష్ రూం కి వెళ్లి వస్తాను.
అమర్: నేను కూడా తోడు వస్తాను.
భాగీ: మిస్టర్ మొండి మొగుడు గారు ఈ లోపు నన్ను ఎవ్వరూ కిడ్నాప్ చేయరులేండి.
అని చెప్పి భాగీ వాష్రూంకు వెళ్తుంది. వెనకే రాథోడ్ వెళ్తాడు. ఆరు చూసి తిట్టుకుంటుంది. భాగీ వాష్రూంలోంచి బయటకు వస్తున్న భాగీని రాథోడ్ పక్కకు లాక్కెళ్లతాడు. దీంతో భాగీ రాథోడ్ ను పిచ్చకొట్టుడు కొడుతుంది. తర్వాత రాథోడ్ నిజం చెప్పగానే భాగీ బాధపడుతుంది. తర్వాత అమర్ దగ్గరకు వచ్చి గుర్రుగా చూస్తుంటుంది. ఎంటి అలా చూస్తున్నావు అని అమర్ అడగుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు, శరీరంపై ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనమో తెలుసా?
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















