Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరును పౌర్ణమి గురించి అడిగన భాగీ – భాగీని దగ్గరుండి గెలిపించిన అమర్
Nindu Noorella Saavasam Today Episode: భాగీ, మనోహరి చెస్ ఆడుతుంటారు. భాగీ ఓడిపోయే పరిస్థితుల్లో అమర్ వచ్చి గెలిపించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు ఆత్మ దగ్గరకు వెళ్ళిన మనోహరి ఈ పౌర్ణమి రోజు నీ కుటుంబంలో ఒకరిని నీకు తోడుగా పంపిస్తున్నాను రెడీ ఉండు అంటూ చెప్పి వెళ్లిపోతుంది. దీంతో ఆరు భయపడుతుంది. మనోహరి లోపలికి వెళ్లగానే భాగీ కిందకు వస్తుంది. గార్డెన్ లో ఆరును చూసి అక్కా అని వెళ్తుంది. ఆరు షాక్ లో ఉంటుంది. భాగీ ఎంత పిలిచినా పలకదు. ఇంతలో లోపలి నుంచి బయటకు వచ్చిన మనోహరి ఆరు అక్కడ ఉంటే ఇప్పుడు ఇది వెళ్లి మాట్లాడుతుంది. మాట్లాడింది అంటే ఆరు నేను చెప్పింది విని ఉంటుందని అనుకుంటుంది. భాగీ గట్టిగా ఆరును పిలిచి అక్కా ఒక పెద్ద సమస్య వచ్చింది చిన్న సొల్యూషన్ కావాలి అని అడుగుతుంది.
మనోహరి: నేను చెప్పాలనుకున్నది నువ్వు విన్నావు ఆరు. ఇప్పుడు కూడా నీకు తెలియకుండా నీతో ఎలా ఆట ఆడబోతున్నానో చూడు.
భాగీ: ఏంటక్కా నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూస్తున్నావు.
ఆరు: ఏం లేదు మిస్సమ్మ ఏంటో చెప్పు.
భాగీ: పౌర్ణమి రాబోతుంది కదా? ఇలాంటి ఒక పౌర్ణమి నాడే ఏదో ఒక శక్తి నన్ను ఆవహించి ఆయన పక్కన పీటల మీద కూర్చునేలా చేసింది అక్కా..
గుప్త: ఏదో ఒక శక్తి కాదు బాలిక. దుష్టశక్తి అది ఈ శక్తే..
భాగీ: మళ్లీ పౌర్ణమి వస్తుంది కదా.. ఈసారి కూడా ఆ శక్తి నాలోకి వచ్చి ఆయన దగ్గరకు వెళ్లి ఆరోజు పెళ్లి పీటల మీద కూర్చోవడానికి నాకు ఏ సంబంధం లేదని చెప్తే నా లైన్ క్లియర్ అయిపోతుంది అక్కా.
గుప్త: అయ్యో అయ్యయ్యో.. సమస్య సృష్టించిన వారినే సమాధానం అడుగుతున్నది. పిచ్చి బాలిక.
ఆరు: గుప్త గారు మీరు ఆగుతారా?
భాగీ: ఎవరితో మాట్లాడుతున్నారు అక్కా..
ఆరు: నాలోనే ఉన్న నాతోనే నేను మాట్లాడుకుంటున్నాను.
భాగీ: అక్కా నా లైన్ క్లియర్ అయిపోతే మేము కూడా అందరి భార్యాభర్తల్లా.. పాలు నీళ్లలా, పప్పులో ఉప్పులా.. మనోహరి, కుళ్లులా కలిసే ఉంటాం.
ఆరు: హతవిధి
భాగీ: అక్కా ఏమో అన్నారు.
ఆరు: ఏమీ లేదు… ఏమీ అనలేను. ఏమీ అనకూడదు కూడా. ఏమీ అననులే
భాగీ: ఎందుకు అనలేరు. ఎందుకు అనకూడదు.
అని అడగ్గానే ఆరు కోపంగా గుప్తను తిడుతుంది. దీంతో భాగీ ఎవరితో మాట్లాడుతున్నారు అని అడగ్గానే నా పక్కన ఒక దెయ్యం ఉందిలే అని చెప్పగానే భాగీ షాక్ అవుతుంది. సరేలే నేనే ఏదో ఒకటి ప్లాన్ చేస్తా.. అనుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది భాగీ. మరోవైపు అంజు, అమ్ము చెస్ ఆడుతుంటారు. అంజు సైలెంట్గా ఉంటే.. ఏంటి భయపడిపోయావా? అని అమ్ము అడగ్గానే భయం అంటే ఏంటని అడుగుతుంది అంజు. భాగీ వచ్చి నీ ప్రొగ్రెస్ రిపోర్టు మీ డాడీ చేతిలో ఉన్నప్పుడు నీకు ఉంటుంది చూడు దాన్నే భయం అంటారు అని చెప్పగానే అదేం లేదని అంజు వెంటనే చెక్ చెప్తుంది.
దీంతో పిల్లలు తమ మూడు నెలల ప్యాకెట్ మనీ పోయిందని బాధపడుతారు. శివరాం వచ్చి ఆడి అంజు చేతిలో ఓడిపోతాడు. భాగీ ఇవాళ నిన్ను ఎలాగైనా ఓడిస్తాను అంటుంది. అంజు నీలాంటి వారితో నేను ఆడను అంటుంది. ఇంతలో మనోహరి నేనాడతా అని వస్తుంది. దీంతో భాగీ, మనోహరి చెస్ ఆడుతుంటారు. ఇంతలో అమర్ వచ్చి భాగీని గెలిపిస్తాడు. మనోహరిని నీతో మాట్లాడాలని లోపలికి పిలుస్తాడు అమర్. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















